అన్వేషించండి

TG TET Fee: తెలంగాణలో టెట్‌ రాస్తున్న అభ్యర్థులకు హ్యాపీ న్యూస్- ఫీజు తగ్గించిన ప్రభుత్వం- వాళ్లకు మాత్రం ఫ్రీ

Telangana TET 2024 : తెలంగాణలో టెట్‌ ఫీజును ప్రభుత్వం భారీగా తగ్గించింది. దీంతో దరఖాస్తులు సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది. వెబ్‌సైట్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను కూడా రెక్టిఫై చేసింది.

Telangana TET Fee: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పరీక్ష కోసం చెల్లించే ఫీజును భారీగా తగ్గించింది. గతంలో పేపర్‌ వన్ లేదా పేపర్‌ టూ ఏది రాసినా వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 750 రూపాయలకు  తగ్గించారు. అదే రెండూ కలిపి రాసిన వాళ్లు గతంలో రెండు వేలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని సగానికి తగ్గించారు. అంటే వెయ్యిరూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 

సగానికి తగ్గిన ఫీజు

టెట్‌ ఫీజు తగ్గిస్తే రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. ఈ మేరకు వెబ్‌సైట్‌లో మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటికే చెల్లించిన వారు ఏం చేయాలి. లాంటి  పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రెండు రోజులక్రితం నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో మొదటి రోజు దరఖాస్తు చేయడానికి ఇబ్బంది ఎదురైంది. దాన్ని సరి చేసిన తర్వాత ఒక రోజు ఆలస్యంగా గురువారం నుంచి సైట్ సక్రమంగా పని చేస్తోంది. 

వాళ్లకు ఫ్రీ

గతంలో ఈ ఫీజులు కేవలం 400 రూపాయలు మాత్రమే ఉండేది. దీన్ని రేవంత్ సర్కారు వెయ్యికి పెంచింది. అప్పట్లో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా దాన్ని వెనక్కి తీసుకోలేకపోయారు. ఆ పరీక్షలో అర్హత సాధించలేని వాళ్లు భవిష్యత్‌లో వచ్చే నోటిఫికేషన్‌లో ఉచితంగా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. గత టెట్‌ 2.35 లక్షల మంది రాస్తే 1.09 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంకా ఉత్తీర్ణత సాధించని 1.26 లక్షల మంది ఈసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

దరఖాస్తు ప్రక్రియ నెల 20 వరకు కొనసాగనుంది. 2025 జనవరి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్లను డిసెంబర్ 27 నుంచి 2025 జనవరి 20 వరకు పంపిణీ చేయనుంది. ఫలితాలను ఫిబ్రవరి 5న వెల్లడించనుంది. 

టెట్‌ ఉత్తీర్ణత సాధిస్తేనే డీఎస్సీ రాయడానికి అర్హులు 

డీఎస్సీ రాయాలంటే ముందుగా టెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా అందులో వచ్చిన మార్కులను కూడా డీఎస్సీలో మెరిట్‌గా తీసుకుంటారు. అందుకే ఏటా ఈ టెట్‌ను నిర్వహిస్తుంటారు. 150 మార్కులకు ఈ టెట్ పరీక్ష ఉంటుంది. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2 ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఇలా అన్ని విభాగల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటితోపాటు మీ మెథడాలజీకి సంబంధించి కంటెంట్‌, మెథడాలజీ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. 

పేపర్‌-1కు డీఈడీ అభ్యర్థులు అర్హులు కాగా... పేపర్‌-2కు బీఈడీ చేసిన వాళ్లు అర్హులు అవుతారు. మొదటి పేపర్ రాసిన వాళ్లు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) ఉద్యోగాలు రాసుకోవచ్చు. పేపర్‌ 2 రాసి ఉత్తీర్ణులైన వాళ్లు స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) ఉద్యోగాలకు పోటీ పడేందుకు అర్హత సాధిస్తారు.

150కి 150 వచ్చిన వాళ్లకు డీఎస్సీలో 20 మార్కులు మెరిట్ ఉంటుంది. అందుకే ఈ పరీక్ష కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ పరీక్షలోజనరల్ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం మార్కులు రావాలి, బీసీ అభ్యర్థులైతే... 50 శాతం వస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీలు సహా ఇతర కేటగిరీ అభ్యర్థులకేతే 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.

 

Also Read: తెలంగాణలో వర్కింగ్ మదర్స్‌కి గుడ్ న్యూస్- ప్రభుత్వం ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్‌లు ఏర్పాటు

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Embed widget