News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Revanth Reddy: హైదరాబాద్‌లో మేం కోరుకున్నట్టే జరిగింది, ఇప్పుడు వీళ్లకి బుద్ధి రావాలని మొక్కుకున్నం - రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేలా అమ్మ వారి చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు.

FOLLOW US: 
Share:

Ujjaini Mahakali Temple: సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, అనిల్ యాదవ్, హర్కర వేణుగోపాల్ తదితరులు రేవంత్ వెంట ఉన్నారు. ఆర్థిక సంక్షోభం రాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, మత సామరస్యాన్ని కాపాడాలని. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేలా అమ్మ వారి చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ అభివృద్ధికి హాని కలిగించే అనేక కార్యక్రమాలు పాలకులు తీసుకుంటున్నారు. అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. కృరమైన ఆలోచనలతో పరిపాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకుల బుద్దులు మార్చాలని అమ్మ వారిని కోరుకున్నం. సమాజానికి హానీ కలిగించే వ్యక్తులను అమ్మవారు శిక్షిస్తుంది. ప్రజలు, మనుషుల వల్ల కానీ పనులను అమ్మవారు చేస్తుందనే సంపూర్ణ విశ్వాసం ఉంది. మానవ తప్పిదాల నుంచి వచ్చిన వరదలు తగ్గుముఖం పట్టే విధంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నాం.

‘‘మానవమాత్రులుగా మేము చేయాల్సింది చేశాం. ప్రతిపక్షాల బాధ్యత నిర్వర్తించాం. కానీ పాలకులు ఎవరూ వినిపించుకోనే పరిస్థితి లేరు. సమస్యలను సృష్టించే వ్యక్తులకు అమ్మవారు సమాధానం చెబుతుంది. ఒక వేళ వారు మారకపోతే వాళ్లను మార్చి.. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాల్సిందిగా అమ్మవారిని కోరుకున్నం. కరోనా బారి నుంచి, వరదల నుంచి హైదరాబాద్ ను కాపాడాలని మేము గతంలో కోరుకున్నట్లే జరిగింది’ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

పోలీసులకు, రేవంత్ కు మధ్య వాగ్వివాదం
రేవంత్ రెడ్డి ఆలయానికి వచ్చిన సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. మహంకాళి ఆలయం వద్ద పోలీసులు, రేవంత్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ తో పాటు వచ్చిన కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రోటోకాల్ పాటిస్తున్నారంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లను తోసుకుని మరీ రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు లోనికి వెళ్లారు.

Published at : 17 Jul 2022 12:11 PM (IST) Tags: revanth reddy telangana congress news Bonalu Festival TPCC CHiEF Hyderabad Bonalu ujjaini mahakali temple

ఇవి కూడా చూడండి

Top Headlines Today: తెలంగాణలో బీసీ కార్డు తీయబోతున్న కాంగ్రెస్-  ఎన్నికల వరకు  ప్రజల్లో ఉండేలా వైసీపీ ప్లాన్

Top Headlines Today: తెలంగాణలో బీసీ కార్డు తీయబోతున్న కాంగ్రెస్- ఎన్నికల వరకు ప్రజల్లో ఉండేలా వైసీపీ ప్లాన్

Petrol-Diesel Price 23 September 2023: స్వల్పంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు- ఈ ప్రాంతంలో మాత్రం తగ్గుదల

Petrol-Diesel Price 23 September 2023: స్వల్పంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు- ఈ ప్రాంతంలో మాత్రం తగ్గుదల

Gold-Silver Price 23 September 2023: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌- మీ నగరాల్లో గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి టైం

Gold-Silver Price 23 September 2023: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌- మీ నగరాల్లో గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి టైం

JL Exam: టీఎస్‌పీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

JL Exam: టీఎస్‌పీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Mynampally Hanumanth Rao Resign: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

Mynampally Hanumanth Rao Resign: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

టాప్ స్టోరీస్

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Shiva Rajkumar : హాలీవుడ్ స్టైల్‌లో శివ రాజ్ కుమార్ 'ఘోస్ట్' ఫస్ట్ సాంగ్ - గ్యాంగ్‌స్టర్ మ్యూజిక్ విడుదల

Shiva Rajkumar : హాలీవుడ్ స్టైల్‌లో శివ రాజ్ కుమార్ 'ఘోస్ట్' ఫస్ట్ సాంగ్ - గ్యాంగ్‌స్టర్ మ్యూజిక్ విడుదల

Shoulder: భుజం నొప్పి ఎక్కువగా ఉంటుందా? ఒత్తిడి తగ్గించుకుంటే నొప్పి తగ్గుతుంది

Shoulder: భుజం నొప్పి ఎక్కువగా ఉంటుందా? ఒత్తిడి తగ్గించుకుంటే నొప్పి తగ్గుతుంది

ఎదురులేని భారత్, మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్

ఎదురులేని భారత్, మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్