అన్వేషించండి

Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తారా?

Revanth Reddy: ఏఐసీసీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరుకాబోతున్నారు. లోక్‌ సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

Revanth Reddy Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గురువారం (మార్చి 6) ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరుకాబోతున్నారు. రేపు లోక్‌ సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో చాలా వరకూ లోక్‌సభ స్థానాలను ఏఐసీసీ ప్రకటించనుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాను ఏఐసీసీ పరిశీలించిన అనంతరం విషయం తెలిసిందే.

మరోవైపు రేపే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా కూడా విడుదల అవుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్‌ రెడ్డికి అధిష్ఠానం అప్పజెప్పినట్లు తెలిసింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ రెడ్డి హై కమాండ్‌కు వివరించబోతున్నారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ఇప్పటికే తమకు వీలైనంత మేరకు ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో ఏకాభిప్రాయంతో ఉన్న సీట్ల వరకూ రేపు ఏఐసీసీ ప్రకటించనున్నట్లు తెలిసింది. మార్చి 7న  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఫైనల్ చేయడానికి సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన అని చెబుతున్నారు.

రేవంత్ ఢిల్లీ పర్యటనతో మిగతా కార్యక్రమాలు రద్దు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు కావడం వల్ల ఆయనకు ముందే ఖరారైన ఇతర కార్యక్రమాలు అన్నీ రద్దు అయ్యాయి. రేవంత్ రెడ్డి సిరిసిల్ల, వేములవాడ పర్యటన ముందే ఫిక్స్ కాగా ఢిల్లీ పర్యటన కారణంగా రద్దయింది. మార్చి 7న సీఎం పర్యటనలు అన్ని రద్దు అయినట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. మార్చి 7న మహా శివరాత్రి జాతర ఉత్సవాల సందర్బంగా సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ముందే షెడ్యూల్ విడుదల చేశారు. అనంతరం గుడి చెరువు మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాలి. అయితే సీఎం పర్యటన రద్దుతో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వేములవాడలో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

షెడ్యూల్ ప్రకారం మార్చి 7న షెడ్యూల్ ప్రకారం సిరిసిల్లలో నూతన ఎస్పీ భవన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాల్సి ఉంది. దీంతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు భూమి పూజ చేయాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget