అన్వేషించండి

Revanth Reddy: ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ, దేశదిమ్మరిలా తిరగడానికా - రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఏనాడు అమర వీరుల కుటుంబాలను కలిసింది లేదని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఎప్పుడూ పరామర్శించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ కోసం టీఆర్ఎస్ తరపున సొంతగా విమానం కొనుగోలు చేస్తున్నారనే వార్తలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో కనీస పనులు చేయని వ్యక్తి దేశ దిమ్మరిలా తిరిగేందుకు వెళ్తున్నారని, అందుకు విమానం కూడా కొనుగోలు చేస్తున్నారని ఎద్దేవా చఏశారు. కేసీఆర్ ఏనాడు అమర వీరుల కుటుంబాలను కలిసింది లేదని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఎప్పుడూ పరామర్శించలేదని విమర్శించారు. ఆఖరికి ప్రగతి భవన్ నుంచి బయటికి రాలేదని, ఫాంహౌస్ దాటింది లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి విమానం కొనుగోలు గురించి విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

‘‘అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడు పరామర్శించ లేదు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు... ఫాంహౌస్  దాటింది లేదు. ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట! ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ!!’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ గురువారం ఓ కీల‌క నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త ప‌ర్యట‌న‌ల కోసం ప్రత్యేకంగా ఓ చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయాల‌ని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందు కోసం ఏకంగా రూ.80 కోట్లను వెచ్చించేందుకు ఆ పార్టీ సిద్ధప‌డింది. 12 సీట్లతో కూడిన ఈ విమానం కోనుగోలుకు సంబంధించి ద‌స‌రా ప‌ర్వదినాన ఆర్డర్ ఇవ్వనుందా పార్టీ. ఈ విమానం కొనుగోలుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను విరాళాల ద్వారా సేక‌రించాల‌ని కూడా ఆ పార్టీ తీర్మానించింది. ఈ క్రమంలో విరాళాలు ఇచ్చేందుకు పార్టీ నేత‌లు పోటీ ప‌డుతున్నట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జ‌రిగితే... సొంత విమానం క‌లిగిన రాజ‌కీయ పార్టీగా టీఆర్ఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ద‌క్కనుంది.

ద‌స‌రా రోజున (అక్టోబ‌ర్ 5) టీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంతోపాటు పార్టీ ముఖ్యనేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలోనే దేశ రాజ‌కీయాల్లోకి పార్టీకి ప్రవేశం క‌ల్పిస్తూ పార్టీకి కొత్త పేరు ప్రక‌టిస్తార‌న్న వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ పేరు ప్రక‌ట‌న త‌ర్వాత ప్రత్యేక విమానం కొనుగోలుకు పార్టీ నుంచి ఆర్డర్ వెలువ‌డ‌నున్నట్లు స‌మాచారం. పార్టీ ఖ‌జానాలో ఇప్పటికే రూ.865 కోట్ల మేర నిధులు ఉన్నా... విమానం కొనుగోలుకు మాత్రం విరాళాలు సేక‌రించాల‌ని ఆ పార్టీ నిర్ణయించ‌డం గ‌మ‌నార్హం.

2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రమంతా తిరిగారు. ఆయన పాల్గొనాల్సిన సభలు ఎక్కువగా ఉండడంతో రోజుకి నాలుగు ఐదు చోట్ల కూడా హెలికాప్టర్లో వెళ్లారు అలా ఆయన ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆ పార్టీ నేతలు చెబుతారు. కేసీఆర్ మాట వ్యవహార శైలి ఆయన వాడే పదాలు బహిరంగ సభల్లో అందరినీ ఆకట్టుకుంటాయనిది ఆ పార్టీ నేతల నమ్మకం. 

ఇప్పుడు దేశ వ్యాప్తంగా అనేక చోట్ల కేసీఆర్ బహిరంగ సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని కార్మిక కర్షక వర్గాల నేతలు కలుసుకునేందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం ఈ ప్రత్యేక విమానం ఉపయోగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
AP New Liquor Policy: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
CTET 2024: సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
Embed widget