News
News
X

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి ఖండించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు.

FOLLOW US: 
Share:

Remarks On Pragathi Bavan: ప్రగతి భవన్ ను పేల్చాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి పై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అలాగే మహాత్మా గాంధీ మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా అంటూ కాంగ్రెస్ నేతలను నిలదీశారు. పక్కనే ఉన్న ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. అక్కడ ప్రభుత్వ ఆఫీస్ లను కూడా ఇలాగే పేల్చాలని డిమాండ్ చేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఉన్న పీసీసీలు అందరూ రేవంత్ రెడ్డి తరహాలోనే కామెంట్లు చేస్తారా అని ప్రశ్నించారు. 

రేవంత్ రెడ్డి క్రిమినల్ లా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తే... రేవంత్ తోడో యాత్ర అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తీవ్ర ఫ్రస్టేషన్ లో ఉన్నారని... తన ఉనికిని కాపాడుకునేందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. సంఘ విద్రోహ శక్తుల్లా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు. మావోయిస్టులను రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. మావోయిస్టుల పై కాంగ్రెస్ స్టాండ్ ఏంటని, విధ్వంసమే మా విధానం అని చెబుతారా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పేల్చేయడం... కుల్చేయడం అసాంఘిక శక్తుల మాటలని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.

డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రేజశ్వర్ రెడ్డి

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 8వ తేదీ బుధవారం రోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో... సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయంతో పాటు నివాసాన్ని గ్రానైట్లు పెట్టి పేల్చాయాల్సిందిగా కోరారని వివరించారు. చట్టసభల్లో సభ్యుడిగా ఉండి.. అధికార భవనాలను కూల్చివేయమని కోరడం అంటే ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేక చర్యగా భావించి.. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపని కోరారు. 

Published at : 08 Feb 2023 06:04 PM (IST) Tags: MP Revanth Reddy Gandra Venkata Ramana Reddy Telangana News Remarks On Pragathi Bavan MLA Peddi Sudarshan reddy

సంబంధిత కథనాలు

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Crime News: హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్

Hyderabad Crime News:  హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్

మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

మార్గదర్శి కేసులో  మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్

అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులకు ఫ్రీ మెడికల్ క్యాంప్ - 10రోజుల పాటు

అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులకు ఫ్రీ మెడికల్ క్యాంప్ - 10రోజుల పాటు

టాప్ స్టోరీస్

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

ప్రజాస్వామ్యం అంటే పట్టింపులేదు- ఓబీసీలు అంటే గౌరవం లేదు- రాహుల్‌పై మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం

ప్రజాస్వామ్యం అంటే పట్టింపులేదు- ఓబీసీలు అంటే గౌరవం లేదు- రాహుల్‌పై మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం