అన్వేషించండి

Ponnala Lakshmaiah: ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కన్‌ఫ్యూజన్! పొన్నాల ఫైర్ - బయటపడ్డ వర్గపోరు

హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఓటరు జాబితాలోని పేర్లు మార్చాలంటూ పొన్నాల లక్ష్మయ్య ఆందోళనకు దిగారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉన్న అంతర్గత పోరు తాజాగా జరుగుతున్న ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల సందర్భంగా బయటపడింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఓటరు జాబితాలోని పేర్లు మార్చాలంటూ పొన్నాల లక్ష్మయ్య ఆందోళనకు దిగారు. రాత్రికి రాత్రి తన పేరు మార్చేశారని పొన్నాల లక్ష్యయ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనగామ నియోజకవర్గం డెలిగేట్ ఓట్ల విషయంలో ఈ గందరగోళం చోటుచేసుకుంది. తెలంగాణలో ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అయితే, జనగామ నుంచి పొన్నాల లక్ష్యయ్యకు, చెంచారపు శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశాన్ని తొలుత కల్పించారు. ఆ మేరకు ఓటింగ్ కార్డ్ ఇష్యూ చేశారు. ఓటు వేసేందుకు పొన్నాల లక్ష్మయ్య, శ్రీనివాస్‌ రెడ్డి గాంధీ భవన్ కు చేరుకోగా చివరి క్షణంలో ఓటరు లిస్టులో చెంచారపు శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించి ఉంది.

శ్రీనివాస్ రెడ్డి స్థానంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరు చేర్చి ఉంది. ఆదివారం (అక్టోబరు 16) రాత్రికి రాత్రే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును రాష్ట్ర కాంగ్రెస్ అధిష్ఠానం చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇలా ఆఖరి నిమిషంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరును చేర్చడం పట్ల పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఏజెంట్లపై మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాను 40 ఏళ్ల నుంచి గాంధీ భవన్ కు వస్తున్నానని చెప్పారు. అదే సమయంలో పొన్నాల లక్ష్మయ్యకు జానారెడ్డి సర్ది చెప్పారు. ఈ గొడవ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరినీ ఓటు వేయకుండా సంబంధిత ఎన్నికల సిబ్బంది ఆపారు.

కాంగ్రెస్ లో కీలక పరిణామం - జానారెడ్డి

ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ - All India Congress Committee) అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతుండడంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కె. జానారెడ్డి స్పందించారు. సోమవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఆయన గాంధీ భవన్ కు వచ్చారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆయన చాలా కాలం తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవికి డెమొక్రటిక్‌గా (ప్రజాస్వామ్య పద్ధతిలో) ఎన్నికలు జరుగుతున్నాయని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక కీలక పరిణామం అని ఆయన అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడి ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు. ఎన్నిక సందర్భంగా వివాదాలు మాట్లాడడం సరైంది కాదని తాను భావిస్తున్నానని జానారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల గురించి కూడా జానారెడ్డి మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చరిత్ర సృష్టిస్తోందని అన్నారు. రెండు ప్రభుత్వాలు ఎన్నికపై జవాబు చెప్పాలని అన్నారు. మునుగోడు ప్రజలు పార్టీలకు అతీతంగా ఓటేస్తారని జానారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: Hyderabad: చెప్పుతో కొడతా, ఆ సీఐ నా చుట్టమే - నడిరోడ్డుపై మహిళ బూతులతో రచ్చ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget