అన్వేషించండి

ప్రయాణికులు పొగొట్టుకున్న రూ.1.54 కోట్ల విలువైన వస్తువులను తిరిగిచ్చిన ఆర్పీఎఫ్

Operation Amanat: రైలులో ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను ఆర్పీఎఫ్ సిబ్బంది యజమానులకు తిరిగి అందించారు. వాటి విలువ సుమారు రూ.1.54 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Operation Amanat: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ ఏడాది 2022లో రూ.1.54 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని తిరిగి ఇచ్చింది. ‘ఆపరేషన్ అమానత్’లో భాగంగా ప్రయాణికులు పొగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చింది. వాటి విలువ దాదాపు. రూ. 1.54 కోట్లుగా ఉంటుందని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు పోగొట్టుకున్న, మర్చిపోయిన వస్తువులను, లగేజీ బ్యాగులను ఇచ్చి వారికి ఆర్పీఎఫ్ సాయం చేసింది. 

పోగొట్టుకున్న వస్తువులు అందజేత..

మొబైల్ ఫోన్లు, ల్యాప్ ‌టాప్ ‌లు, నగలు, నగదు మొదలైన విలువైన వస్తువులను రైల్వే అథారిటీ తిరిగి పొందింది. ఆయా వస్తువులను, బ్యాగులు వాటి యజమానులకు తిరిగి ఇచ్చింది. 2021లో 615 సందర్భాలలో ప్రయాణీకుల సామాను, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని యజమానులకు తిరిగి ఇచ్చినట్లు ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మితా చటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు.

ఇందులో రూ.1.44 కోట్ల విలువైన ల్యాప్‌టాప్, పర్సులు, లగేజీ బ్యాగులు, మొబైల్ ఫోన్‌లు ఉన్నాయి. 2022లో సెప్టెంబరు వరకు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది 608 సందర్భాలలో విలువైన వస్తువులను కనుగొని, తిరిగి ఇవ్వగలిగారు. వస్తువుల మొత్తం విలువ రూ.1.54 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 

'ఆపరేషన్ అమానత్’ 

ఆపరేషన్ అమానత్ కింద ఆర్పీఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారు. వారు రైల్వే ఆస్తులను మాత్రమే కాకుండా, ప్రయాణీకులు పోగొట్టుకున్న సామాన్లను భద్రపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తారని ఆర్పీఎఫ్ అధికారి తెలిపారు.

సిబ్బంది పనితీరు భేష్

1.84 లక్షల విలువైన విలువైన వస్తువులను ఆర్పీఎఫ్ సిబ్బంది సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుల విలువైన వస్తువులను భద్రపరచడంలో, వాటిని యజమానులకు తిరిగి అప్పగించడంలో ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రతిస్పందనను ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబష్మితా చటోపాధ్యాయ బెనర్జీ ప్రశంసించారు.

సాయం కావాలంటే 139కు  కాల్ చేయండి

'ఆపరేషన్ అమానత్' కింద ప్రతి సంవత్సరం కోట్ల విలువైన ప్రయాణీకుల వస్తువులను భద్రపరచడంలో, తిరిగి అందజేయడంలో ఆర్పీఎఫ్ సిబ్బంది మంచి పని తీరు కనబరుస్తున్నారు. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు వ్యక్తిగత వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, రైలును వీడి వెళ్తున్నప్పుడు ఒకటికి రెండు అన్ని బ్యాగులు, ఇతర వస్తువులు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, పర్సులు ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు తమ వ్యక్తిగత వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైలు ప్రయాణంలో ఏదైనా వస్తువు పోగొట్టుకున్నా, మర్చిపోయినా వెంటనే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబష్మితా చటోపాధ్యాయ బెనర్జీ సూచించారు. 

పోయాయనుకున్న వస్తువులు తిరిగి అందుకోవడం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తమ వస్తువులు తిరిగి ఇవ్వడంపై హర్షం తెలుపుతున్నారు. విలువైన వస్తువులు, నగదు, ఫోన్లు, ల్యాప్ టాప్ లాంటివి తిరిగి ఇవ్వడాన్ని వారు ప్రశంసిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget