అన్వేషించండి

MP Aravind: కేటీఆర్, కవితపై ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు, ఏకంగా అంత మాట అనేశారే!

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి ఘాటు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. మత్తు పదార్థాలు తీసుకుంటారని.. మంత్రి కేటీఆర్‌పై ఉన్న ఆరోపణలు కిషన్ రెడ్డిపై లేవని, కేటీఆర్ మాదిరి బాలీవుడ్ వాళ్లతో కిషన్ రెడ్డికి దోస్తానా లేదన్నారు.  

కవిత లిక్కర్ రాణి అని ఆమె మాదిరి.. కిషన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు లేవని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బాట సింగారం.. డబుల్ బెడ్రూం ఇళ్ళకు బాట ఉంది కానీ.. సింగారం లేదని ఎద్దేవా చేశారు. అక్కడ అసంపూర్తిగా ఉన్న ఇళ్ల ఫొటోలను మీడియాకు చూపించారు. పేదల ఇళ్ళ నిర్మాణంపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ధర్మపురి అరవింద్ విమర్శించారు. పేదలు పాలకుల కాళ్లు మొక్కితే ఇల్లు కేటాయిస్తున్నరని ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్మిస్తున్న ఇళ్లను తనిఖీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద ఆవాస్ యోజన కింద మూడు కోట్ల గృహ ప్రవేశాలు పూర్త చేసుకున్నట్లు చెప్పారు. కానీ తెలంగాణాలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. హౌసింగ్ శాఖలో 1821  ఉద్యోగులు ఉండాల్సి  ఉండగా కేవలం 505 మంది ఉన్నారని అన్నారు. 1306 మందిని వివిధ శాఖలకు డిప్యుటేషన్ పంపించారని అన్నారు. ఇళ్ల నిర్మానంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం ఆ పార్టీ కార్యకర్తలకు కూడా న్యాయం చేయడం లేదని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని, నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలంటూ నిలదీశారు.

కిషన్ రెడ్డి అరెస్ట్

చలో బాటసింగారం పిలుపు నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌లో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయబోయారు. ఈ ఉదయం నుంచి ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చలో బాటసింగారం నిర్వహిస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని అప్రమత్తమైన పోలీసులు బీజేపీ లీడర్లను అరెస్టు చేశారు.  ఈ నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్తత ఏర్పడింది.
పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరుకు నిరసనగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో ధర్నాకు దిగారు. జోరు వానలోనే రోడ్డుపై బైఠాయించారు. కిషన్ రెడ్డి, రఘునందన్‌రావు మినహా మిగిలిన వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. బాటసింగారం తీసుకెళ్లాలని పోలీసులను బీజేపీ నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కాన్వాయ్‌నే అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. తానేమీ టెర్రరిస్టును కాదని అన్నారు. నిరసన తెలిపే హక్కు తనకు ఉందని కిషన్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తుంటే ప్రతిపక్షంగా బీజేపీ అడగటం తప్పా అని నేతలు ప్రశ్నిస్తున్నారు. పరిశీలనకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. ఉదయం ఐదు గంటల నుంచే పోలీసులు తమ వాహనాలను తీసుకొచ్చి ఇళ్ల చుట్టూ మోహరించారని ఆరోపించారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.