అన్వేషించండి

MLA Poaching Case: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టు షాక్ - ఈడీ విచారణపై స్టేకు నిరాకరణ

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ దర్యాప్తుపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. మొయినాబాద్ ఫాం హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈడీ దర్యాప్తుపై స్టేకు హైకోర్టు నిరాకరించింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ దర్యాప్తుపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. మొయినాబాద్ ఫాం హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈడీ దర్యాప్తుపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. డిసెంబర్ 30న విచారణకు హాజరు కావాలన్న ఈడీ సమన్లలో జోక్యం చేసుకోవడానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. 

ఈడీ కేసు కొట్టివేయాలన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తరఫున వైకాపా ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పార్టీ మారాలని రోహిత్‌రెడ్డికి వంద కోట్లు ఆఫర్ ఇచ్చారని తెలిపారు. ఆఫర్ మాత్రమే చేశారు కాని డబ్బు ఇవ్వలేదని రోహిత్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదని రోహిత్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమన్న రోహిత్‌రెడ్డి అంటున్నారు. కానీ వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 5 కు వాయిదా వేసింది.

ఎమ్మెల్యేల ఎర కేసు సీబీఐ చేతికి.. 
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసును సీబీఐకి  బదిలీ చేస్తూ తెలంగాణ  హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సుదీర్గ వాదన తర్వాత హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొదట ఏసీబీ కేసును నమోదు చేశారు. తర్వాత హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. కానీ ఈ కేసును ఏసీబీ మాత్రమే విచారించాలని..  సిట్ ఎలా దర్యాప్తు చేస్తుందని ఏసీబీ కోర్టు .. సిట్ దాఖలు చేసిన నివేదికల్ని తిరస్కరించింది. అలాగే.. ఈ కేసులో కీలక నిందితులు సిట్ దర్యాప్తు కుట్ర పూరితంగా జరుగుతోందని.. విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఎమ్మెల్యేల ఎర కేసులో ఈడీ కూడా విచారణ 

ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా విచారణ జరుపుతోంది. నిందితుడు నందకుమార్ ను జైల్లోనే కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తోంది. డిసెంబర్ 26, 27న ప్రశ్నించింది. ఈ కేసులో బీజేపీ ప్రోద్భలంతో నందకుమార్ తనను ప్రలోభ పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. వంద కోట్లు ఇస్తామన్నారని ఆయన చెప్పారు.  రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు నందుకుమార్‌‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ నం.‌ 967/2022, మొయినాబాద్‌ పీఎస్‌లో నమోదైన ఫామ్‌హౌస్‌ కేస్‌ ఎఫ్‌ఐఆర్‌‌ నం.455/2022 కేసులు నమోదయ్యాయి. వీటిలో  ప్రివెన్షన్ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ 2002, సెక్షన్‌50 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈఎస్‌ఐఆర్‌)‌/48/20‌22 రిజిస్టర్‌‌ చేసినట్లు ఈడీ ప్రకటించారు.    

ఫిర్యాదుదారుడినైన తనను ఇరికించేందుకు కుట్ర

మరో వైపు ఫామ్ హౌస్ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి ఈడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నందకుమార్ నుంచి స్టేట్ మెంట్ తీుకుని తనను నిందితుడిగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిపై రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయగా, విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ ఈడీ విచారణపై స్టేకు నిరాకరిస్తూ పిటిషన్ కొట్టివేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించడంతో పాటు తదుపరి విచారణ జనవరి 5 కు వాయిదా వేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
Embed widget