By: ABP Desam | Updated at : 28 Dec 2022 03:16 PM (IST)
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ దర్యాప్తుపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. మొయినాబాద్ ఫాం హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈడీ దర్యాప్తుపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. డిసెంబర్ 30న విచారణకు హాజరు కావాలన్న ఈడీ సమన్లలో జోక్యం చేసుకోవడానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఈడీ కేసు కొట్టివేయాలన్న ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తరఫున వైకాపా ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. పార్టీ మారాలని రోహిత్రెడ్డికి వంద కోట్లు ఆఫర్ ఇచ్చారని తెలిపారు. ఆఫర్ మాత్రమే చేశారు కాని డబ్బు ఇవ్వలేదని రోహిత్రెడ్డి తరఫున వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆర్థిక లావాదేవీలు జరగలేదు కనుక ఈడీకి విచారణ పరిధి లేదని రోహిత్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమన్న రోహిత్రెడ్డి అంటున్నారు. కానీ వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 5 కు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల ఎర కేసు సీబీఐ చేతికి..
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సుదీర్గ వాదన తర్వాత హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొదట ఏసీబీ కేసును నమోదు చేశారు. తర్వాత హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. కానీ ఈ కేసును ఏసీబీ మాత్రమే విచారించాలని.. సిట్ ఎలా దర్యాప్తు చేస్తుందని ఏసీబీ కోర్టు .. సిట్ దాఖలు చేసిన నివేదికల్ని తిరస్కరించింది. అలాగే.. ఈ కేసులో కీలక నిందితులు సిట్ దర్యాప్తు కుట్ర పూరితంగా జరుగుతోందని.. విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్యేల ఎర కేసులో ఈడీ కూడా విచారణ
ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా విచారణ జరుపుతోంది. నిందితుడు నందకుమార్ ను జైల్లోనే కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తోంది. డిసెంబర్ 26, 27న ప్రశ్నించింది. ఈ కేసులో బీజేపీ ప్రోద్భలంతో నందకుమార్ తనను ప్రలోభ పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. వంద కోట్లు ఇస్తామన్నారని ఆయన చెప్పారు. రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు నందుకుమార్పై బంజారాహిల్స్ పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ నం. 967/2022, మొయినాబాద్ పీఎస్లో నమోదైన ఫామ్హౌస్ కేస్ ఎఫ్ఐఆర్ నం.455/2022 కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, సెక్షన్50 కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈఎస్ఐఆర్)/48/2022 రిజిస్టర్ చేసినట్లు ఈడీ ప్రకటించారు.
ఫిర్యాదుదారుడినైన తనను ఇరికించేందుకు కుట్ర
మరో వైపు ఫామ్ హౌస్ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి ఈడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నందకుమార్ నుంచి స్టేట్ మెంట్ తీుకుని తనను నిందితుడిగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిపై రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయగా, విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ ఈడీ విచారణపై స్టేకు నిరాకరిస్తూ పిటిషన్ కొట్టివేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించడంతో పాటు తదుపరి విచారణ జనవరి 5 కు వాయిదా వేశారు.
Bandi Sanjay : గవర్నర్ విషయంలో హైకోర్టు చివాట్లు, కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్?- బండి సంజయ్
Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు
Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్
Hyderabad Traffic: హైదరాబాదీలు జర సోచో - ఆ రూట్లో నేటి నుంచి 40 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!
BJP Govt: మోడీ సర్కార్కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!