News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Malla Reddy: టీఎస్ఆర్టీసీ విలీనంపై నోరు జారిన మంత్రి మల్లారెడ్డి! కేసీఆర్‌కి దిల్ ఉందని కామెంట్లు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలతో కలిసి మంత్రి పాలాభిషేకం చేశారు.

FOLLOW US: 
Share:

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు డబుల్ కా మీటా ఇచ్చినమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కనీసం వారు కూడా ఊహించని విధంగా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ చేశారని మంత్రి మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలతో కలిసి మంత్రి పాలాభిషేకం చేశారు. 

ఉద్యోగులకు డబుల్ కా మీటా

‘‘ఆర్టీసీ ఉద్యోగులు కూడా మన బిడ్డలే, మన కార్మికులే అని చెప్పి మొన్న కేబినెట్ మీటింగ్ లో పెద్ద ఎత్తున డబుల్ కా మీటా, డబుల్ ధమాకా ఇచ్చినం. తాము ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అవుతామని వాళ్లు కలలో కూడా ఊహించి ఉండరు. ఎప్పటికీ ఆర్టీసీలోనే ఉంటమని అనుకున్నరు. ఇయ్యల అందర్నీ ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా ప్రభుత్వంలో కలుపుకున్నం. సీఎం కేసీఆర్ మహాత్ముడు, ఆయన భగవంతుడి స్వరూపం. ఏది చేసినా గొప్ప పని చేస్తడు. ఆయన లెక్క ఎవ్వరు పని చేయలేరు.’’

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటా? అని విలేకరులు ప్రశ్నించగా, ‘‘ఎన్నికల స్టంట్ అనుకో.. ఏదైనా అనుకోండి.. మాది రాజకీయ పార్టీ.. అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘మాది రాజకీయ పార్టీ వయా.. ఎన్నికలనుకో ఏదన్నా అనుకో.. కార్మికులైతే న్యాయం జరిగిందా లేదా? వాళ్ల భవిష్యత్తు మంచిగా అయిందా లేదా? ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినయా లేదా? ఎన్నికలకు ఎట్లనన్నా పోతం, ఎన్నికల స్టంట్ ఉంటది. ఇది రాజకీయ పార్టీ. కానీ, చేసే దిల్, ధైర్యం కావాల. ఎంత ఫండ్స్ కావాలె. ఎంత ధైర్యం కావాల. అది మా కేసీఆర్ కే ఉంది’’ అని మాట్లాడారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఘట్కేసర్ మున్సిపాలిటీలోని ఏమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఘట్కేసర్ మున్సిపాలిటీ, ఘట్కేసర్ మండలానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున మంజూరు అయిన (17+9) షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని శివాస్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం పోచారం మున్సిపాలిటీకి మంజూరు చేసిన షాదీ ముబారక్ కల్యాణలక్ష్మి (17) చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు. 

అలాగే నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ NAC ఆధ్వర్యంలో జరిగిన మహిళాలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన అర్హులైన దాదాపు 35 మంది కుట్టు శిక్షణ పొందిన మహిళాలకు కుట్టు మిషన్ లు అందజేశారు.

Published at : 02 Aug 2023 04:27 PM (IST) Tags: TSRTC News Minister Malla reddy CH mallareddy TSRTC merging

ఇవి కూడా చూడండి

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి

PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి

TSSPDCL Jobs: విద్యుత్‌ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి

TSSPDCL Jobs: విద్యుత్‌ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి

Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలుకు నిర్ణయం

Anganwadi Teachers: అంగన్వాడీ టీచర్లకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలుకు నిర్ణయం

KNRUHS: బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ

KNRUHS: బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు