అన్వేషించండి

Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు

Actor Mohan Babu Attack: 24 గంటల వరకు తండ్రీ కొడుకుల మధ్య గొడవ... ఇప్పుడు మీడియాతో గొడవ. మోహన్ బాబు ఆవేశంతో వివాదం మరో టర్న్‌ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

Actor Mohan Babu News: మంచు కుటుంబంలో మొదలైన తుపాను సునామీగా మారింది. మంగళవారం రాత్రి వరకు మోహన్ బాబు వర్శెస్‌ మనోజ్‌ అన్నట్టు సాగిన వివాదం ఒక్కసారిగా మరో టర్న్ తీసుకుంది. మీడియా ప్రతినిధులపై దాడితో మోహన్ బాబు వర్శెస్‌ మీడియాగా పరిస్థితి మారిపోయింది. కుటుంబంలో ఉన్న వివాదంపై ప్రశ్నించిన మీడియాపైనే దాడికి మోహన్ బాబు తెగబడటంతో విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. ఒకే రోజులు రెండు సార్లు మీడియా ప్రతినిధులపై దాడుల చేశారని మాట వినిపిస్తోంది.  

నాలుగు రోజుల నుంచి రగులుతున్న వివాదం 

మూడు రోజులుగా ఆస్తుల విషయంలో మంచు ఫ్యామిలీలో ఏర్పడ్డ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తలెత్తిన విభేదాలు ఇప్పుడు రోడ్డు ఎక్కేశాయి. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్‌ ఫిర్యాదు చేస్తే తనపై చేయి చేసుకున్నాడని మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. ఇలా పరస్పరం ఫిర్యాదులతో వివాదం బయటకు వచ్చింది. 

విష్ణు రాకతో మరింత రచ్చ- రాత్రి హైడ్రామా

అప్పటి వరకు విదేశాల్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ రావడంతో వివాదం మరింత రాజుకుంది. మంచు మనోజ్‌కు సిబ్బందిని, బౌన్సర్లను బయటకు పంపేశారు. దీనిపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తండ్రి ఎదుటే ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వారిస్తున్నా ఇద్దరూ తగ్గలేదని సమాచారం. విషయం పెద్దది అవుతుందని మధ్యవర్తులు సర్దిచెప్పేందుకు నిన్నంతా మోహన్ బాబు నివాసంలో చర్చలు జరిపారు. ఈ చర్చలు జరుపుతున్న వేళే మనోజ్‌ ఆగ్రహంతో బయటకు వచ్చేశారని బాగొట్టా. మళ్లీ కాసేపటికి భార్యతో కలిసి మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడే హైడ్రామా మొదలైంది. 

మీడియాపై మోహన్ బాబు దాడి 

మోహన్ బాబు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న మనోజ్, మౌనిక దంపతులను సెక్యూరిటీ లోపలికి రానివ్వలేదు. దీంతో తన అనుచరులతో వచ్చిన మనోజ్‌ గేట్‌ను బలవంతంగా తోసుకొని ఇంటి లోపలికి ప్రవేశించాడు. ఎదురుగా వస్తున్న మోహన్ బాబు వచ్చి అడ్డుకున్నారు. మనోజ్ గేట్‌ను లోపలికి తోసుకు వెళ్లేటప్పుడే మీడియా ప్రతినిధులు కూడా వారితో వెళ్లిపోయారు. ఎదురుగా వస్తున్న మోహన్ బాబును చూసి మీడియా ప్రశ్నలు సంధించింది. అప్పటికే తన ఫ్యామిలీపై మీడియాలో వస్తున్న కథనాలతో ఆగ్రహంగా ఉన్న మోహన్ బాబు వారిపై దాడి చేశారు. మైక్‌ను లాక్కొని విసిరికొట్టారు. దీంతో ఓ మీడియా ప్రతినిధి గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మోహన్ బాబుపై కేసులు 

మోహన్ బాబు ప్రవర్తను మీడియా సంఘాలు, రాజకీయ నాయకులు ఖండించారు. మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనపై కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. పహాడీ షరీఫ్ పోలీస్‌ స్టేషన్‌లో మోహన్‌ బాబుపై బీఎన్ఎస్ సెక్షన్ 118 కింద కేసు రిజిస్టర్ చేశారు. అంతే కాకుండా ఆయనకు కేటాయించిన బౌన్సర్లను బైండోవర్ చేయనున్నారు. గన్‌ కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. దాడి ఘటనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఖండించారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. గాయపడిన జర్నలిస్ట్‌కు మెరుగైన వైద్యం అందివ్వాలని ఆదేశించారు. 

పోలీస్‌ విచారణకు రానట్టే

కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు దంపతులు ఆసుపత్రి పాలైనట్ట వార్తలు వస్తున్నాయి. గొడవలతో కలత చెందిన మనోజ్‌ తల్లి సాయంత్రమే అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు చెబుతున్నారు. మరో వైపు తన నివాసంలో మనోజ్ చేసిన హంగామా, మీడియా ప్రతినిధులపై దాడి అనంతరం మోహన్ బాబు కూడా అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇద్దర్నీ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా మోహన్ బాబు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావడం లేదని సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Tesla Y in india: ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Tesla Y in india: ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
Rambha: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ! - ఇండస్ట్రీకి దూరం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమాల్లోకి రంభ రీఎంట్రీ! - ఇండస్ట్రీకి దూరం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
Yash: 'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
Embed widget