అన్వేషించండి

KTR: ‘బండి సంజయ్‌ను ED చీఫ్‌గా పెట్టినందుకు థ్యాంక్స్’, మోదీకి కేటీఆర్ సెటైర్లు

KTR Satires on PM Modi: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌ గా కూడా నియమించినందుకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకొని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల రోజూ ఉదయం ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక నివేదికలు, వార్తా కథనాలను ఎత్తి చూపుతూ బీజేపీ, మోదీ ప్రభుత్వ విధానాల వల్లే ఇలా జరుగుతోందంటూ వరుసగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా నేడు కూడా బీజేపీ నేతల్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌ గా కూడా నియమించినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అసలు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో ఇప్పుడు తెలిసిందని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ‘మోదీ అండ్ ఈడీ’ అని అన్నారు.

టైమ్స్ గ్రూపులో వచ్చిన ఓ కథనాన్ని ఉటంకిస్తూ మంత్రి కేటీఆర్ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆ కథనంలో ఉన్నాయి. త్వరలోనే కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. 

మరో ట్వీట్‌‌లో భారత్‌లో రెండు వాస్తవాలు జరిగాయని అన్నారు. ప్రపంచ పేదరిక రాజధానిగా భారత్ నైజీరియాను అధిగమించిందని విమర్శించారు. మరోవైపు బిల్ గేట్స్ ను అధిగమించి ఆదానీ ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా ఎదిగారని ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి వార్తా కథనాలను కూడా జత చేశారు.

‘‘మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఒకవైపు, మోదీ ప్రభుత్వం కార్పొరేట్ పన్నులను ఏడాదికి 1.45 లక్షల కోట్ల రాయితీ ఇచ్చింది. మరోవైపు, బియ్యం, పెరుగు, గోధుమ, మజ్జిగ లాంటి సామాన్యుడి నిత్యావసరాలపై పన్నులను పెంచింది. కార్పొరేట్లకు ట్యాక్స్ కట్, కామన్ మ్యాన్‌పైన ట్యాక్స్ హైక్’’ అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget