అన్వేషించండి

Karthika Masam Special Train: కార్తీక మాసంలో ఆలయాల సందర్శనకు ఐఆర్‌టీసీ ప్రత్యేక ట్రైన్- దివ్య దక్షిణ్‌ యాత్ర పేరిట 9 రోజుల టూర్

IRCTC Special Train :కార్తీక మాసం చాలా ప్రత్యేకమైన నెల. ఎంతో నిష్టతో పూజలు చేసే భక్తులు. ప్రముఖ పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌టీసీ ప్రత్యేక ట్రైన్‌ నడుపుతోంది.

Karthika Masam 2024 కార్తీక మాసం మొదలైంది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలను సందర్శించుకోవాలని చాలా మంది భక్తులు ప్లాన్ చేసుకొని ఉంటారు. అలాంటి వారందరికీ ఐఆర్‌టీసీ ప్రత్యేక ఆఫర్ ఇస్తోంది. దక్షిణ భారత దేశంలో వివిధ పుణ్య క్షేత్రాల దర్శన భాగ్యం కలిగించేందుకు ప్రత్యేక ప్యాకేజీతో సిద్ధమైంది. 

దివ్య దక్షిణ్‌ యాత్ర విత్‌ జ్యోతిర్లింగ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఈ ప్రత్యేక ప్యాకేజీ నవంబర్ ఆరు నుంచి ప్రారంభంకానుంది. 9 రోజులు ఉంటే ఈ టూర్‌ ప్యాకేజీలో తిరువణ్ణమలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివెండ్రం, తిరుచ్చీ, తంజావూరుతోపాటు దక్షిణ భారత దేశంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు. 

భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్ ట్రైన్‌లో 2AC, 3AC & SL classesలో టికెట్లు కేటాయిస్తారు. మొత్తం 578 మంది ఈ టూర్‌ ప్యాకేజీలో సందర్శనకు వెళ్లొచ్చు. ఇది తొమ్మిది రోజుల టూర్‌. నవంబర్‌ 6న ప్రారంభమవుతుంది. 578 సీట్లలో SL క్లాస్‌ 320, 3AC క్లాస్‌ 206, 2AC క్లాస్‌ 50 సీట్లు ఉంటాయి. 

ఎక్కడెక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు
సికింద్రాబాద్‌లో బయల్దేరే ఈ ట్రైన్‌ భువనగిరి, కాజీపేట, జనగామ్‌, వరంగల్ మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతుంది. ఆయా స్టేషన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లంతా ఎక్కి టూర్‌కు వెళ్లవచ్చు. 

టూర్ ప్యాకేజీ ఒక్కసారి పరిశీలిస్తే...

కేటగిరి  పెద్దలకు  చిన్నారులకు(5 నుంచి 11 ఏళ్లు )
SL క్లాస్‌లో ప్రయాణం రూ. 14, 250 రూ. 13, 250
3AC క్లాస్‌లో ప్రయాణం రూ. 21,900 రూ. 20,700
2ACక్లాస్‌లో ప్రయాణం రూ. 28,450 రూ. 27,010

ఎక్కడ ఏం చూడవచ్చు 

  • తిరువణ్‌మలై:    అరుణాచలం ఆలయం 
  • రామేశ్వరం :       రామేశ్వరం టెంపుల్
  • మదురై :             మీనాక్షి అమ్మవారి ఆలయం 
  • కన్యాకుమారీ:      రాక్‌ మెమోరియల్, కుమారి అమ్మణ్‌ టెంపుల్ 
  • త్రివేండ్రం:         శ్రీ పద్మనాభ స్వామి ఆలయం 
  • తిరుచ్చి :            శ్రీ రంగనాథ స్వామి ఆలయం
  • తంజావూరు:       బృహదీశ్వర ఆలయం 

ఏ రోజు ఎక్కడ ఉంటాం 

  • మొదటి రోజు (నవంబర్ 6) సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరతారు. 
  • రెండో రోజు (నవంబర్ 7) ఉదయం ఏడు గంటలకు తిరువణ్‌మలైలో దిగుతారు. అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత ఆలయాన్ని సందర్శిస్తారు. మళ్లీ అక్కడ నుంచి రాత్రి పది గంటలకు రామేశ్వరం బయల్దేరతారు. 
  • మూడో రోజు (నవంబర్ 8) కుదల్‌నగర్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామేశ్వరం బయల్దేరి వెళ్తారు. అక్కడ వెళ్లి స్వామిని దర్శించుకొని అక్కడే స్టే చేసి లోకల్‌గా ఉండే ఆలయాలు సందర్శిస్తారు. 
  • నాల్గో రోజు (నవంబర్ 9) ఉదయాన్నే ఫ్రెష్ అయిన తర్వాత మరికొన్ని ప్రాంతాలు సందర్శిస్తారు. అక్కడ లంచ్ చేసిన మధ్యాహ్నం రోడ్డు మార్గంలోనే మదురై బయల్దేరతారు. అక్కడకు చేరుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకొని లోకల్‌గా షాపింగ్‌లు చేసి మళ్లీ కుదల్‌నగర్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కన్యూకుమారి బయల్దేరతారు. 
  • ఐదో రోజు (నవంబర్ 10) ఉదయాన్నే 8 గంటలకు కన్యాకుమారి చేరుకుంటారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. సూర్యాస్తమయం, గాంధీ మండపం, రాక్‌ గార్డెన్ అన్నీ సందర్శిస్తారు.  
  • ఆరో రోజు (నవంబర్ 11) కన్యూకుమారి నుంచి కోచువేళి మీదుగా తిరుచ్చీ చేరుకుంటారు. ఉదయం 9 గంటలకు బయల్దేరి తిరుచ్చీ వెళ్లి అక్కడ పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకొని కోవళం బీచ్ చూసిన తర్వాత మళ్లీ తిరుచిరపల్లి బయల్దేరతారు. మార్గ మధ్యలోనే ట్రైన్‌లోనే డిన్నర్ చేస్తారు. 
  • ఏడో రోజు (నవంబర్ 12) ఉదయాన్నే తిరుచిరపల్లి చేరుకొని అక్కడ ఫ్రెష్ అయ్యి శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరు వెళ్తి బృహదీశ్వర ఆలయం చూస్తారు. అనంతరం సికింద్రాబాద్‌ తిరుగుపయనం అవుతారు. మార్గ మధ్యలోనే డిన్నర్ చేస్తారు. 
  • నవంబర్‌ 12 రాత్రి 11 గంటలకు బయల్దేరిన తర్వాత 14 తేదీ వేకువజామున 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతోటూర్ ముగుస్తుంది. 

మీరు డబ్బులు చెల్లించుకోవాల్సిన అంశాలు 

  • ఆలయాల ప్రవేస ఫీజు, బోటింగ్, ఇతర పర్యాటక ప్రదేశాల ప్రవేశ రుసుం చెల్లించాలి.  
  • వాళ్లు ఇచ్చిన ఫుడ్ తినాల్సి ఉంటుంది. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే మాత్రం డబ్బులు చెల్లించాలి. 
  • రూమ్‌లో ఉండేటప్పుడు ఏమైనా తెప్పించుకుంటే కూడా మీరే చెల్లించుకోవాలి. 
  • లోకల్ గైడ్ మాట్లాడుకుంటే కూడా డబ్బులు మీరే భరించాలి. 
  • డ్రైవర్స్‌కు ఇచ్చే టిప్స్‌, వెయిటర్స్‌కు ఇచ్చే టిప్స్‌, ఫ్యూయల్‌కు చెల్లించే సర్‌ ఛార్జ్‌ కూడా భరించాలి. 
  • వైన్‌, మినరల్ వాటర్, ఇష్టమైన ఫుడ్‌, డింక్స్‌కు మీరే చెల్లించుకోవాలి.  
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
SLBC Tunnel Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కథ విషాదాంతం, 8 మంది కార్మికులు మృతి, డెడ్ బాడీస్ గుర్తించిన రెస్క్యూ టీమ్
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Kiara Advani Pregnant: తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
తల్లి కాబోతున్న హీరోయిన్ కియారా... జీవితంలో గొప్ప బహుమతి అంటూ!
EPF Interest Rate: 7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
7 కోట్ల మందికి నిరాశ - 2024-25 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటు ఎంతంటే?
Uttarakhand : బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచు చరియలు - రిస్క్‌లో 47 మంది ప్రాణాలు
Andhra Pradesh Budget 2025 Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ - కూటమి సర్కార్ వార్షిక బడ్జెట్ హైలైట్స్ ఇవే 
Meenakshi Natarajan: మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
మీనాక్షి నాటరాజన్ పై తెలంగాణ కాంగ్రెస్ కోటి ఆశలు! చేయిదాటిన నేతలను దారిలోకి తెస్తారా ?
Embed widget