By: ABP Desam | Updated at : 22 May 2022 02:15 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Secunderabad Railway Station Theft News: పబ్లిక్ ప్లేస్లో ఓ మహిళ చాకచక్యంగా చేసిన పని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పక్కనే అందరూ ఉన్నా ఏకంగా 53 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించింది. కేవలం తన చీర కొంగు అడ్డు పెట్టుకొని పని కానిచ్చింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం విషయం వెలుగులోకి వచ్చింది. నిందితురాలిని గుర్తించేందుకు పోలీసులు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అనూరాధ, రైల్వే డీఎస్పీ నరసయ్య, జీఆర్పీ సీఐ శ్రీను ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ మహిళ రైలు ఎక్కేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చింది. ఆమె బ్యాగులో 53 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన మరో మహిళ ఆమెను ఫాలో అవుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆమెతోపాటే లిఫ్ట్ ఎక్కింది. ఆమెకు దగ్గరగా నిలబడి చీర కొంగు అడ్డుపెట్టి బ్యాగ్లో ఉన్న ఆభరణాలు కొట్టేసింది. ఈ విషయం గుర్తించడానికి పోలీసులు సుమారు 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాల్సి వచ్చింది. మొత్తానికి పోలీసులు నిందితురాలిని పట్టుకొని అరెస్ట్ చేశారు.
నగరానికి చెందిన ఓ ప్రయాణికురాలు బంగారు ఆభరణాలతో 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రాగా.. గేటు నెం.4 నుంచి ప్లాట్ఫాం వైపునకు వెళుతుండగా, కూకట్పల్లి ఆల్విన్ కాలనీ తులసీనగర్కు చెందిన ఆరూరి ప్రియ (40) ఆమెను అనుసరించింది. బాధితురాలి బ్యాగు జిప్ను తొలగించి అందులోని బంగారు ఆభరణాలున్న బ్యాగును దొంగిలించి పారిపోయింది. బ్యాగు జిప్ తెరిచి ఉండడం గమనించిన బాధితురాలికి అందులో నగలు కనిపించలేదు. వెంటనే ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అప్రమత్తమైన పోలీసులు స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియోలను పరిశీలించారు. బాధితురాలు లిఫ్ట్లో వస్తుండగా, నిందితురాలు చీర కొంగు అడ్డుపెట్టి నగల బ్యాగును కొట్టేసినట్లుగా రికార్డయింది. ఆ తర్వాత బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయిన దృశ్యాలు కూడా పోలీసులు గుర్తించారు. నిందితురాలు కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో ఉంటుందని గుర్తించారు. నిందితురాలు ఇంటి వద్ద లేకపోవడంతో నిఘా పెట్టిన పోలీసులు ఈనెల 18న సికింద్రాబాద్ స్టేషన్ 4వ గేటు వద్ద ఆమె ఉన్నట్టుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
చివరికి ఆమె నుంచి రూ.6.31 లక్షల విలువ చేసే 53.1 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఆమెపై కూకట్పల్లి, పేట్బషీరాబాద్, కేపీహెచ్బీ తదితర ప్రాంతాల్లో దొంగతనాల కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. విచారణలో నిందితురాలు నేరం అంగీకరించిందని చెప్పారు.
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
Hyderabad Traffic News: నేడు రూట్స్లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు
KPHB Techie Murder: అల్లుడి అంతం కోసం 4.5 లక్షలకు సుపారీ, హత్య తర్వాత దూరంగా ఎడమకాలు! వెలుగులోకి కీలక విషయాలు
Driverless Car: సంగారెడ్డిలో డ్రైవర్ లేని కారు, అందులో ప్రయాణించిన కేంద్ర మంత్రి - మనుషుల్ని మోసే డ్రోన్లు కూడా
Rains in AP Telangana: నేటి నుంచి 48 గంటలపాటు వర్షాలు, ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్ - ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్
RRR Movie: సీరియస్గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?