![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hyderabad News: భార్యతో కలిసి కన్నతల్లిని హత్య చేసిన కొడుకు! దిండు అదిమి, గొంతు పిసికి ఊపిరాడకుండా
Hyderabad Latest News: కొడుకు జులాయిగా తిరగడంతో అప్పులు పెరిగాయి. అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలని కొడుకు కోడలు కొంతకాలంగా సుగుణమ్మపై ఒత్తిడి చేస్తున్నారు.
![Hyderabad News: భార్యతో కలిసి కన్నతల్లిని హత్య చేసిన కొడుకు! దిండు అదిమి, గొంతు పిసికి ఊపిరాడకుండా Hyderabad son eliminates mother with wife help to sell their property in uppal Hyderabad News: భార్యతో కలిసి కన్నతల్లిని హత్య చేసిన కొడుకు! దిండు అదిమి, గొంతు పిసికి ఊపిరాడకుండా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/07/be570fc66f316f653cb0ae8d11cb87061704602026349234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Uppal News: ఆస్తి అమ్మడానికి అడ్డు వస్తుందని కన్న తల్లినే భార్యతో కలిసి మట్టు పెట్టాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెంకట్ రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కసావేణి సుగుణమ్మ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు ఆమెకు కుమారుడు అనిల్, కోడలు తిరుమల ఉన్నారు. వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు భర్త చనిపోయిన తర్వాత ఇంటిని సుగుణమ్మ తన పేరు మీదకు మార్చుకుంది. కొడుకు జులాయిగా తిరగడంతో అప్పులు పెరిగాయి. అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలని కొడుకు కోడలు కొంతకాలంగా సుగుణమ్మపై ఒత్తిడి చేస్తున్నారు.
అయితే సుగుణమ్మ ససేమిరా అనడంతో కోడలు తిరుమల పుట్టింటికి వెళ్ళింది. ఇల్లు అమ్మాలంటే ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల నాలుగో తేదీ అర్ధరాత్రి తిరుమల మరో వ్యక్తి శివతో కలిసి వెంకటరెడ్డి నగర్ వచ్చింది అదే రాత్రి సుగుణమ్మ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న సుగుణమ్మ ముఖంపై దిండు అదిమి గొంతు చుట్టి హత్య చేశారు అమ్మ నిద్రలోనే చనిపోయిందని అనిల్ బంధువులతో బుకాయించారు
మృతదేహంపై గాయాలు ఉండడంతో బయటపడ్డ అసలు నిజం
మరణ వార్త విని సుగుణమ్మ తల్లి దాసరి ఐలమ్మ సహా బంధువులు వరంగల్ ప్రాంతం నుంచి భారీగా తరలివచ్చారు. 5వ తేదీన అంత్యక్రియలకు సన్న హాలు చేశారు. సుగుణమ్మ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడమీద గాయాలు కనిపించాయి దీంతో అనుమానం వచ్చి బంధువులు అనీలు నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కొడుకు, కోడలిని అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. ఆస్తికోసం అమ్మను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని భార్య ఆమెతో వచ్చిన శివతో కలిసి హత్య చేసినట్లు అనిల్ పోలీసులకు తెలిపాడు దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)