అన్వేషించండి

Hyderabad Metro: సోమవారం మెట్రో ఫుల్‌- హైదరాబాద్ మెట్రో అరుదైన రికార్డు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. జులై మూడో తేదీ సోమవారం ఒక్కరోజే మెట్రోలో 5.10 లక్షల మంది ప్రయాణించారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రయాణికుల ఆదరణ వల్ల సోమవారం ఒక్కరోజే 5.10 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. భాగ్య నగరంలో మెట్రో రైలు ప్రారంభం అయినప్పటి నుంచి ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణం చేయడం ఇదే మొదటి సారి. అయితే ఇందులో సగానికి పైగా అంటే రెండున్నర లక్షల మంది ప్రయాణికులు మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కారిడార్ లోనే ప్రయాణించారు. నాగోల్ నుంచి రాయదుర్గం మార్గంలోనూ 2.25 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ రెండు కారిడార్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. పాతిక వేల తేడాతో రెండు కారిడార్లలోనూ రెండు లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణం చేశారు. 

భాగ్యనగర వాసులకు అత్యంత కీలక ప్రజా రవాణా సాధనాల్లో మెట్రో రైలు ఒకటి. ఈ ఆధునిక రవాణా వ్యవస్థను మొదటి నుంచి అన్ని వర్గాలు ఆదరిస్తున్నాయి. ప్రస్తుతం మూడు కారిడార్లలో కలిపి 69.2 కిలో మీటర్ల మేర మెట్రో రైలు పురగులు తీస్తోంది. 2017 నవంబర్ 29వ తేదీన హైదరాబాద్ లో మెట్రోరైలు సేవలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు నుంచి ప్రయాణికులు మెట్రో ప్రయాణంపై చాలా సంతృప్తిగా ఉన్నారు. మెట్రో ప్రారంభించిన రెండున్నర ఏళ్లలోనే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 2020 ఫిబ్రవరి నాటికి ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు చేరింది. లాక్ డౌన్ విధించే సయానికి ఒకరోజు గరిష్టం 4.75 లక్షలుగా నమోదు అయింది. ఆ తర్వాత లాక్ డౌన్ సమయంలో దాదాపు ఆరు నెలల పాటు మెట్రో రైల్లు డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే 2020 సెప్టెంబర్ నెలలో తిరిగి మెట్రో సేవలు ప్రారంభం అయినప్పటికీ.. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ భయంతో చాలా మంది మెట్రో ఎక్కేందుకు వెనుకాడారు. 

కరోనా తర్వాత పుంజుకున్న మెట్రో..

కానీ కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత నుంచి మెట్రోకు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. 2021 జనవరి నాటికి ప్రయాణికుల సంఖ్య 1.60 లక్షలు ఉండగా.. మార్చి 2022 నాటికి ఆ సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. అలాగే అదే ఏడాదిలో నాలుగు లక్షల మైలురాయిని కూడా అందుకుంది. అయితే మెట్రోలో ప్రయాణిస్తున్న వాళ్లలో ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు మొదటి వరుసలో ఉన్నారు. వీరు రోజు సగటున 1.40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరి తర్వాతి స్థానం విద్యార్థులదే. నిత్యం 1.20 లక్షల మంది విద్యార్థులు మెట్రో ద్వారానే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రజలను.. మెట్రో గమ్యస్థానాలకు చేర్చింది. అయితే ఎక్కువ మంది రాకపోకలు సాగించిన స్టేషన్లలో రాయదుర్గం(32,000), ఎల్బీనగర్(30,000), అమీర్ పేట(29,000), మియాపూర్(23,000) ఉన్నాయి. 

ట్విట్టర్ ద్వారా ప్రయాణికులకు మెట్రో సంస్థ ధన్యవాదాలు

5 లక్షల మైలురాయిని చేరేందుకు ఆదరించిన ప్రయాణికులకు మెట్రో సంస్థ ధన్యవాదాలు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నుంచి నిరంతరం సహకారం, మద్దుతుతోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget