అన్వేషించండి

Hyderabad Mayor: మరో వివాదంలో హైదరాబాద్ మేయర్, ఏకంగా భూకబ్జా ఆరోపణలు

మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఆమె సోదరుడు తమ భూమిని అక్రమంగా లాక్కుంటున్నారని బుధవారం (డిసెంబరు 28) ఓ వ్యక్తి మీడియా ఎదుట ఆరోపించడం సంచలనంగా మారింది.

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆమెపై ఓ వ్యక్తి నేరుగా ఆరోపణలు చేశాడు. ఏకంగా మీడియా ముందుకు వచ్చిన తనకు మేయర్ వల్ల అన్యాయం జరిగిందంటూ వాపోయాడు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఆమె సోదరుడు తమ భూమిని అక్రమంగా లాక్కుంటున్నారని బుధవారం (డిసెంబరు 28) ఓ వ్యక్తి మీడియా ఎదుట ఆరోపించడం సంచలనంగా మారింది.

ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం మీర్జాపూర్‌లోని సర్వే నంబర్‌ 20లో పది ఎకరాల భూమిలో అదే గ్రామానికి చెందిన కొనింటి వడ్డె మల్లేశ్‌ కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసుకుంటున్నారు. వారికి అది తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిందని తెలిపాడు. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ దొరసాని రాములమ్మ నుంచి తమ తాతలు ఈ భూమిని కొనుగోలు చేశారని చెప్పాడు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని చెప్పాడు. 2004 వరకు ఆ భూమి కబ్జా రికార్డుల్లో తమ తాత వడ్డె ఎల్లయ్య పేరు పైన నమోదై ఉందని తెలిపాడు.

అయితే 2005లో దొరసాని సంబంధీకుడైన నర్సింహా రెడ్డి అప్పటి తహసీల్దార్‌ సహకారంతో భూమిని తన పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమ భూమి చుట్టూ పాతిన స్తంభాలను హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి దగ్గరుండి తీసేయించేస్తున్నారని వాపోయారు. అదేంటని అడిగితే చంపేస్తామని తుపాకీతో బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2007లోనే ఈ భూవివాదంలో ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేసినట్లు వారు చెప్పారని వాపోయాడు. పోలీసులు కూడా వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారని వాపోయారు. ఇదిలా ఉండగా పరిగి ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి సదరు భూమిని పరిశీలించి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మేయర్‌ విజయలక్ష్మిని వివరణ అడిగేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

బాధితుడు తెలిపిన వివరాలు ఇవీ..

‘‘1975వ సంవత్సరంలో దొరసాని రాములమ్మ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మిర్జాపూర్ గ్రామంలోని 32 ఎకరాల భూమిని 38 కింద మాకు ఇచ్చింది. మిగతా 32 ఎకరాల భూమిని ఆమె కొడుకు అయిన నర్సింహా రెడ్డికి రూ.3,251 ఇచ్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ భూమిలో మేమే కబ్జాలో ఉన్నాం కాబట్టి 1978 సంవత్సరంలో సీలింగ్ యాక్ట్ కింద రూ.1,447 తీసుకుని ప్రభుత్వం మాకు సర్టిఫికెట్లు ఇచ్చింది. అయితే, పూర్వీకులు చనిపోవటం వల్ల వాటిని ప్రభుత్వ రికార్టులో చేర్పించలేకపోయారు. కొంత భూమి మాత్రం రికార్డుల్లో చేరటంతో పాస్ పుస్తకాలు వచ్చాయి.

మిగతా భూమిని 2005లో కే కేశవరావు కొడుకు వెంకటేశ్వరావు, నర్సింహ రెడ్డికి విరాసత్ కింద 10 ఎకరాలకు పాస్ బుక్ సృష్టించి, 2007లో ఆ భూమిని ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లోనే గన్‌తో బెదిరించారు. ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని చంపేశారు. వ్యవసాయం చేసుకోనివ్వకుండా అడ్డుపడ్డాడు. అందరం ఎదురు తిరగటంతో మీ భూమి మీకు ఇచ్చేస్తానని చెప్పాడు. మళ్లీ ఇప్పుడు భూమి రేట్లు పెరగటంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పోలీసులను పెట్టుకుని మరీ ఫెన్సింగ్ వేస్తున్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు. దీని ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు వాళ్లు సృష్టించిన నకిలీ పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి’’ అని బాధితులు మీడియాకు చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: నరైన్‌ శతక గర్జన , కోల్‌కత్తా భారీ స్కోరు
నరైన్‌ శతక గర్జన , కోల్‌కత్తా భారీ స్కోరు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Telangana | లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటే పార్టీ ఏది? | ABP DesamABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: నరైన్‌ శతక గర్జన , కోల్‌కత్తా భారీ స్కోరు
నరైన్‌ శతక గర్జన , కోల్‌కత్తా భారీ స్కోరు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
KCR Comments: ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు, అందుకే వీరు లిల్లిపుట్‌లు - కేసీఆర్ కామెంట్స్
ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు, అందుకే వీరు లిల్లిపుట్‌లు - కేసీఆర్ కామెంట్స్
Embed widget