By: ABP Desam | Updated at : 30 Jul 2021 11:17 AM (IST)
హత్య సీన్పై గ్రాఫిక్ ఇమేజ్
హైదరాబాద్లో సహజీవనం చేస్తున్న ఓ జంట దారుణానికి ఒడిగట్టింది. తాజా ఘటనతో గత కొంతకాలంగా వారు చేస్తున్న పైశాచికాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జంట ఇతరులను నమ్మించి నేరాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. గురువారం షాపూర్నగర్లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజ ఈ కేసు వివరాలను విలేకరులకు వివరించారు. అసలేం జరిగిదంటే..
ఒంటరిగా అందంగా ఉన్న యువతులు, మహిళలే లక్ష్యంగా చేసుకొని ఈ జంట ఆకృత్యాలకు పాల్పడుతోంది. హైదరాబాద్లోని మల్లంపేటకు చెందిన ఓ పేద మహిళ(37) వీరి చేతికి చిక్కి ప్రాణాలు పొగొట్టుకొంది. ఈ కేసు విచారణతో ఆ జంట చేసిన గత నేరాలు బట్టబయలు అయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం వైఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్న కురువ స్వామి అలియాస్ రవి, మసనమొల్ల నర్సమ్మ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ఈ నెల 25న మల్లంపేట లేబర్ అడ్డాకు వెళ్లారు. పని కోసం వచ్చి ఒంటరిగా ఉన్న మల్లంపేటకు చెందిన మహిళ(37)ను వారు గుర్తించారు. ఆమె మెడలో బంగారు ఆభరణాలు ఉండటంతో వారిలో దుర్భుద్ధి కలిగింది. ఆమెను పరిచయం చేసుకున్నారు. ఆలయం వద్ద సున్నం వేసే పని ఉందని, ఆ పని చేస్తే తనకు రూ.700 ఇస్తారని నమ్మించారు. దీంతో వారిని నమ్మిన మహిళ వాళ్ల బైక్పైనే పని ప్రదేశానికి వెళ్లింది.
ఆమెను జిన్నారం మండలం అంకిరాల గుట్టల్లోకి తీసుకెళ్లారు. ఆమెకు అనుమానం వచ్చి ప్రశ్నించినా కొండపై ఆలయం ఉందని నమ్మబలికారు. కొండపైకి తీసుకెళ్లి ఆ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. అందుకోసం నర్సమ్మ ఆమెను కదలకుండా పట్టుకొని అతనికి సహకరించింది. బాధితురాలు కేకలు వేస్తుండడంతో ఆమెను నిలువరించేందుకు కిరాతంగా కర్రతో జననాంగాలపై దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె చనిపోయింది. ఆ తర్వాత మెడలోని బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయారు.
అయితే, కూలి పనికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని ఆమె భర్త దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకోసం సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. మల్లంపేట లేబర్ అడ్డా నుంచి మహిళను బైక్పై తీసుకెళ్తున్నట్లుగా సీసీటీవీ కెమెరాల్లో గుర్తించారు. నిందితులను గుర్తించి వారిని బుధవారం వికారాబాద్ జిల్లాలో అదుపులోకి తీసుకొన్నారు. వారిని విచారణ జరపగా వారి గత నేర చరిత్ర వెలుగు చూసింది.
ఈ జంట గతంలో సంగారెడ్డి జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెలలోనే నాలుగు దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి రూ.2 లక్షలు విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
KCR On Central Government: పల్లె నిధులపై పంచాయితీ- కేంద్రంపై కేసీఆర్ సీరియస్
Breaking News Live Updates : వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి 5గురు మృతి
Revanth Reddy On CM KCR : మరో శ్రీలంకలా తెలంగాణ, రాజపక్స పరిస్థితే కేసీఆర్ కు వస్తుంది : రేవంత్ రెడ్డి
Hyderabad Crime : గర్ల్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పాడని కత్తితో దాడిచేసిన బాలుడు, రక్తం కారుతుంటే సెల్ఫీ!
Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం, ఐసీయూలో చికిత్స
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి
Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్లో ఉన్న దేశం అదే
Keerthy Suresh: రోజురోజుకి మహానటి అందం పెరిగిపోతోందిగా