అన్వేషించండి

YS Sharmila: అర్ధరాత్రి షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం - వెంటనే ఆస్పత్రికి తరలింపు

ప్రజాప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు అనుమతించినా పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారని లోటస్‌పాండ్‌లో ఉన్న తన పార్టీ కార్యాలయం ఆవరణలో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

వైఎస్‌ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిలను అరెస్టు చేసి బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించారు. తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు అనుమతించినా పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారని లోటస్‌పాండ్‌లో ఉన్న తన పార్టీ కార్యాలయం ఆవరణలో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా దీక్ష చేపట్టడంతో ఆమె ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెంటనే తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

అంతకుముందు శనివారం రాత్రి వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేస్తున్నారని విమర్శించారు. ‘‘పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా ప్రభుత్వ, పోలీసులు అనుమతివ్వడం లేదు. మా నాయకులను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు శనివారం సాయంత్రానికి కూడా విడుదల చేయలేదు. పాత కేసులు తవ్వి రిమాండ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టారు. సామాన్యులను కూడా రానివ్వట్లేదు. పాదయాత్రలో ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పాదయాత్రలో ఎక్కడా వ్యక్తిగత దూషణలు చేయలేదు. మంత్రి సత్యవతి రాథోడ్‌ ఏనాడూ మహిళల గురించి నోరు విప్పలేదు. పైగా నన్ను తిట్టారు. అదంతా ఆమె విచక్షణకే వదిలేస్తున్నా. 3,500 కిలోమీటర్ల పాదయాత్రలో ఒక్కసారి కూడా నేను నిబంధనలను ఉల్లంఘించలేదు.’’ అని మాట్లాడారు.

శనివారం రాత్రి షర్మిలను పలువురు పరామర్శించారు. ఆమెకు మద్దతుగా తల్లి వైఎస్‌ విజయలక్ష్మి దీక్షలో పాల్గొన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు సుధీకర్‌ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తదితరులు షర్మిల వద్దకు వచ్చి ఆమెను పరామర్శించారు.

రెండ్రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష 

ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, అలాగే అరెస్టు చేసిన వైఎస్ఆర్టీపీ నేతలను విడుదల చేయాలని రెండ్రోజులుగా వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష విమరించే ప్రసక్తి లేదని షర్మిల తేల్చిచెప్పారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల దీక్ష చేస్తున్నారు. ఆమె ఆరోగ్యంపై వైఎస్సార్టీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. షర్మిల ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు.  పార్టీ ఆఫీస్ కు నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీస్ లు అడ్డుకుంటున్నారు. లోటస్ పాండ్ వద్ద కర్ఫ్యూ వాతావరణం కొనసాగింది.

వైఎస్ షర్మిలకు వైద్యులు నిన్న (డిసెంబరు 10) ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుందని వైద్యుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. లాక్టెట్ లెవెల్స్ బాగా పెరిగాయని, యూరియా లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. బీపీ లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. గ్లూకోజ్  లెవెల్స్ బాగా తగ్గాయని వైద్యులు తెలిపారు. 30 గంటలుగా షర్మిల మంచి నీళ్లు సైతం తీసుకోవడం లేదన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించకపోతే ప్రాణాలకు ప్రమాదమన్నారు. మరోవైపు, పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు తన దీక్ష విరమించనని షర్మిల అన్నారు. మొత్తానికి అర్ధరాత్రి పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించారు.

హైకోర్టు అనుమతి ఇచ్చినా

సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటూ మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు కానీ ప్రజల పక్షాన పోరాడే వైఎస్సార్టీపీని మాత్రం కార్యక్రమాలు చేసుకోవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు తన పాదయాత్రకు అనుమతి ఇచ్చినా కేసీఆర్ నియంతృత్వ పాలనలో న్యాయస్థానానికి,  ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందన్నారు. తమ పార్టీ శ్రేణులను విడుదల చేసేంత వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని వైఎస్ షర్మిల తేల్చిచెప్పారు. కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao On Telangana Rising Global Summit: రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
IndiGo Flights Cancelled: నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
GHMC: మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
AK47 Movie - Venkatesh & Trivikram: 'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao On Telangana Rising Global Summit: రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
IndiGo Flights Cancelled: నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
GHMC: మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
మొన్న కలిపారు -రేపు విభజిస్తారు - నాలుగు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్?
AK47 Movie - Venkatesh & Trivikram: 'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
'ఏకే 47'లో వెంకటేష్ లుక్ ఇదిగో... త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమా టైటిల్ రివీల్ చేశారుగా
Year Ender 2025: బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ లో 2025 చివర్లో వచ్చే మార్పులివే! మరో గందరగోళం కూడా ఉండవచ్చు!
బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ లో 2025 చివర్లో వచ్చే మార్పులివే! మరో గందరగోళం కూడా ఉండవచ్చు!
Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Embed widget