అన్వేషించండి

Hussain Sagar: వినాయక నిమజ్జనంతో తీవ్ర కాలుష్యానికి గురైన హుస్సేన్ సాగర్!

Hussain Sagar: గణేష్ నిమజ్జనోత్సవం కారణంగా హుస్సేన్ సాగర్ తీవ్ర కాలుష్యానికి గురైంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన నీటిని విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు ముందు చేసిన తర్వాత తీసుకొని పరీక్షిస్తున్నారు. 

Hussain Sagar: గణేష్ నిమజ్జనోత్సవంతో హుస్సేన్ సాగర్ తీవ్ర కాలుష్యానికి గురైంది. ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల విగ్రహాలు వేసి ఉంటారని అధికారులు అంచనా వేశారు. నీటి నాణ్యతను లెక్కగట్టేందుకు కాలుష్య నియంత్రమ మండలి వేర్వేరు రోజుల్లో నమూనాలు సేకరించింది. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా రెండో చోట్లు లుంబినీ పార్క్, ట్యాంక్ బండ్ సహా బుద్ద విగ్రహం వద్ద ఆరు చోట్ల నీటి నమూనాలను తీసుకున్నారు. నిమజ్జనానికి ముందు... ఆ తర్వాత నీటిని సేకరించారు. అయితే వీటిలో బయో ఆక్సిజన్ డిమాండ్ మూడు లోపు ఉండాలి. కానీ 30కి పైగా ఉందని ప్రాథమిక పరిశీలనలో తేలింది. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ నాలుగుకు బదులుగా 25 రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించారు. శనివారం కూడా నిమజ్జనం కొనసాగడంతో ఆదివారం నమూనాలు తీసుకున్నారు. 

వర్షాల కారణంగా కలుషిత నీరు మరింత కిందకు..

అప్పటికే భారీ విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం కాకపోవడంతో కెమికల్ ఆక్సిన్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వినాయక నిమజ్జనం జరిగిన మూడ్రోజులు భారీ వర్షాలు కురవడంతో వరద నీటి కాలువలు, నాలాలా ద్వారా హుస్సేన్ సాగర్ లోకి కలుషిత నీరు భారీగా చేరింది. వర్షాల కారణంగా కలుషిత జలాలు కొంత పరిమాణం దిగువకు వెళ్లినట్లు తెలుస్తోంది. శని, ఆది వారాల్లో నాలాల ద్వారా ప్రమాదకర రసాయనాలు సాగర్ లోకి చేరుకున్నాయి. గతేడాది కూడా కాలుష్య నియంత్రణ మండలి పరీక్షలు నిర్వహించింది. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా తీసుకున్న నీటి నమూనాల్లో బయో ఆక్సిజన్ డిమాండ్ అత్యధికంగా 45 మిల్లీ గ్రామ్స్ పర్ లీటర్ ఉందని తేలింది. 

అతినీల లోహిత నమూనాలు మరింత ఎక్కువ..

మరోచోట కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 199 మిల్లీ గ్రామ్స్ పర్ లీటర్ గా ఉందని గుర్తించారు. అతిభార లోహిత నమూనాలు ఎక్కువగా ఉన్నాయని పీసీబీ అధికారులు చెప్పారు. ఈసారి కూడా తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మట్టి ప్రతిమలు ఎక్కువగా ఉన్నందున.. కాలుష్యం స్థాయి ఎంత ఉందో తుది ఫలితాల ఆధారంగా తేలనుంది. 

అందుకే హైకోర్టు కూడా వద్దంది..!

హైదరాబాద్ జంట నగరాల్లోని హుస్సేన్ సాగర్ తో పాటు నదుల్లో  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీళ్లేదని గతంలోనే తెలంగాణ హైకోర్టు తెలిపింది. కేవులం చిన్న చిన్న చెరువుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ నందాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పీఓపీ విగ్రహాలను నిషేధించడంపై ఓం ప్రకాష్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ వేశారు. కళాకారుల తరఫున పిటిషన్ వేసిన ఇతను.. పీఓపీ విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. అలాగే విగ్రహాలను నిషేధిస్తే.. దానిపై ఆదారపడి బతుకున్న వేలాది మంది రోడ్డున పడతారని వివరించారు. స్పందించిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget