అన్వేషించండి

Eetala Rajender: గ్రామ కార్యదర్శులను తొలగించే అధికారం సీఎంకు లేదు: ఈటల రాజేందర్

Eetala Rajender: గ్రామ కార్యదర్శులను తొలగించే అధికారం సీఎం కేసీఆర్ కు లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఉద్యోగం పర్మినెంట్ చేయమంటే వేధించడం సరికాదన్నారు. 

Eetala Rajender Fires on CM KCR About Junior Panchayat Secretaries Protest: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామక పత్రాలు పొందిన గ్రామ కార్యదర్శులకు 3 సంవత్సరాలు ప్రొబేషన్ పెట్టారని గుర్తు చేశారు. రెండు సంవత్సరాలు తగ్గించమని కోరితే 4 ఏళ్లకు పెంచారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ చక్రవర్తి ఏం కాదని విమర్శించారు. అలాగే ఆయన తన సొంత సంపాదనను గ్రామ కార్యదర్శులలకు ఇవ్వట్లేదని ఫైర్ అయ్యారు.

ఉద్యోగాలు పర్మినెంట్ చేయమని అడుగుతుంటే గ్రామ కార్యదర్శుల (Junior Panchayat Secretaries)ను వేధించడం దారుణం అన్నారు. ఆర్టీసీ కార్మికుల చావుకు సీఎం కేసీఆర్ యే కారణం అయ్యారని ఆరోపించారు. గ్రామ కార్యదర్శులను తొలగించే అధికారం ముఖ్యమంత్రికి లేదన్నారు. బేషజాలకి పోకుండా పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని న్నారు. సీపీ టెంట్లు వేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. అలాగే సీఏ, వీపీఓలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ మహిళలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఈటల అన్నారు.

జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై సర్కారు సీరియస్, విధుల్లో చేరకపోతే టర్మినేట్ చేస్తామని హెచ్చరికలు 
తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు విధుల్లో చేరాలని జేపీఎస్ లకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే.. విధుల్లో చేరని వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నోటీసులను జారీ చేశారు. అంతేకాకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం.. నిబంధనలను ఉల్లంఘించడమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. జేపీఎస్ యూనియన్ ఏర్పాటు చేయడం, స్మమెకు దిగడం చట్ట విరుద్ధం అని తెలిపారు. ప్రభుత్వంతో కుదుర్కుచుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ సర్వీస్ డిమాండ్ తో 2023 ఏప్రిల్ 28వ తేదీ నుంచి జేపీఎస్ యూనియన్ గా ఏర్పడి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటీసుల్లో సుల్తానియా పేర్కొన్నారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా తను సొసైటీలు, యూనియన్లలో చేరనని బాండ్ పై సంతకం చేశారని గుర్తు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మె చేసే హక్కు లేది ఈ వాస్తవాలు తెలిసినా జేపీఎస్ యూనియన్ గా ఏర్పడి... చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28వ తేదీ 2023 నుంచి సమ్మెకు దిగారని గుర్తు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సమ్మె చేయడం వల్ల జేపీఎస్ ఉద్యోగాల్లో కొనసాగే హక్కును కోల్పోయిందని సుల్తానియా అన్నారు. మానవతా దృక్పథంతో జేపీఎస్ కు చవరి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. నేడు సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని ఆదేశించారు. ఇవాల సాయంత్రం లోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరినీ తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
Embed widget