By: ABP Desam | Updated at : 27 Jul 2021 09:01 PM (IST)
CP Sajjanar
ఎక్కడైనా చోరీ జరిగిందంటే చాలు.. మీ సొమ్ము ఇక తిరిగి మీకు దొరుకుతుందా లేదా అనే అనుమానం ఉంటుంది. చుట్టుపక్కల వాళ్లు సైతం మీ డబ్బు లేదా విలువైన వస్తువులు మీరు తిరిగి పొందలేరని చెబుతుంటారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఊహించని దాని కంటే భిన్నమైన పరిస్థితి తలెత్తుతుంది. పోయిన మీ సొమ్ముకు మేం భరోసా అంటున్నారు పోలీసులు.
సాధారణంగా ఇళ్లు, షాపులు, కార్యాలయాలలో అధికంగా చోరీలు జరుగుతుంటాయి. అయితే దొంగతనం జరిగిన విషయాన్ని చాలా మంది దాచిపెడుతుంటారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు, మరికొందరు ఫిర్యాదు చేస్తే లాభం ఏముంటుంది, మన డబ్బు తిరిగిరాదని భావిస్తారు. నేటితో ప్రజలలో ఆ అపోహ తొలగిపోయిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. చోరీ కేసుల సొత్తుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చోరీ జరిగిన తరువాత బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడం ఒక ఎత్తు అయితే, వాటిని తాము దొంగల నుంచి రికవరీ చేసుకోవడం ఇంకో ఎత్తు అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. పోగొట్టుకున్న సొత్తును బాధితులకు కోటిన్నర రూపాయలకు పైగా అందజేసినట్లు తెలిపారు. మొత్తం 176 కేసుల్లో కోటిన్నరకు పైగా సొత్తును తమ పోలీసులు రికవరీ చేశారని పేర్కొన్నారు.
చోరీ కేసులను ఛేదించడం సైతం కొంత కష్టతరమేనని, అయినా తమ పోలీసులు ముఖ్యంగా కానిస్టేబుళ్లు శ్రమించి దొంగలను పట్టుకున్నారని ప్రశంసించారు. చోరీ అయిన సొమ్మును బాధితులకు సాధ్యమైనంత వరకు యథాతథంగా అప్పగించడంలో కానిస్టేబుళ్లు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. పోగొట్టుకున్న సొత్తును బాధితులకు ఇప్పించాలని చాలా రోజులుగా అనుకుంటున్నామని, ఎట్టకేలకు ఈరోజు ఆ పని సాధ్యమైందన్నారు. చోరీ అయిన సొమ్ము తమకు తిరిగి దక్కదనే భావన సరికాదన్నారు. ప్రజలు అలా భావించి ఫిర్యాదులు చేయడం మానివేస్తే ప్రతి ప్రాంతంలోనూ చోరీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
చోరీ జరిగిన తరువాత సాధ్యమైనంత త్వరగా బాధితులు ఫిర్యాదు చేస్తే నేరస్థులను పట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కోటిన్నర సొత్తును బాధితులకు అందించడం చాలా సంతృప్తికరమైన రోజు అని చెప్పారు. సైబరాబాద్ పరిధిలో రికవరీ చేసిన సొమ్మును ఇకనుంచి తరచుగా బాధితులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇతర నేరాలతో పాటు చోరీ కేసులపై సైతం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ప్రజలు సైతం అనుమానితుల వివరాలు తెలుపుతూ పోలీసులకు సహకరించాలన్నారు.
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి
Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర
Breaking News Live Updates: హైదరాబాద్లో అగ్ని ప్రమాదం, చార్మినార్ వద్ద కాలిపోయిన దుకాణం
Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురి దుర్మరణం
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది