అన్వేషించండి

Telangana: సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ - డిసెంబర్‌ 9 నాటికి పూర్తి చేసేలా పనులు

Telangana : తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Hyderabad: తెలంగాణ సచివాలయంలో డిసెంబర్‌ 9 నాటికి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ భూమి పూజ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రక్రియ చేపట్టారు. వేదమంత్రాలుగా సాక్షింగా 11 గంటలకు రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులు పలుమార్లు చర్చించి సచివాలయంలో పోర్టికోకు ఎదురుగా విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు. మెయిన్ గేట్ నుంచి భవనం లోపలకు వెళ్ళే క్రమంలో అందరికీ కనిపించేలా దాన్ని రూపొందిస్తున్నారు. అక్కడే ఇవాళ భూమి పూజ జరిగింది.  

దీన్ని శరవేగంగా డిసెంబర్‌ 9 నాటికి పూర్తి చేయాలి ప్రభుత్వం సంకల్పించింది. 2009లో డిసెంబర్‌ 9న అప్పటి కేంద్ర హోమంత్రి చిదంబరం తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించారు. అందుకే ఆ తేదీన విగ్రహావిష్కరణ చేయాలని నిర్ణయించారు. 

జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఆర్టిస్టులు, తెలంగాణకు చెందిన కళాకారులు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాలను పరిశీలించిన తర్వాత ఫైనల్ విగ్రహాన్ని ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఉంటుందంటున్నారు. విగ్రహం  తెలంగాణ సంస్కృతి చాటి చెప్పేలా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రజల దయాగుణం, త్యాగనిరత, మహిళల రూపం అన్నీ కలిసేలా రూపొందించనున్నారు. 

దసరా వరకు మంచిరోజులు లేవని వేదపండితులు చెప్పడంతోనే ఇప్పుడు హడావుడిగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఉండదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారన్నారు. సోనియమ్మ మాట ఇస్తే అది శిలాశాసనమని తెలంగామ రాష్ట్ర ఏర్పాటు నిరూపిచిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి  ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని గుర్తు చేశారు. 

పదేళ్లు పరిపాలన చేసిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని విమర్శించారు. నేనే తెలంగాణ.. తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. ప్రజాప్రభుత్వం అలాంటి విధానాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. సచివాలయం తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు గుండెకాయలాంటిదని అందుకే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గత పాలకులు పదేళ్లు సచివాలయంలోకి ప్రజలకు ప్రవేశం కల్పించలేదని తెలిపారు. అదే కాకుండా  సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు వారికి మనసు రాలేదని ఆరోపించారు. 

ట్యాంక్ బండ్ నలువైపులా ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడం లోటుగా కనిపించిందని అభిప్రాయపడ్డారు. మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీన్ని వివాదం చేసేందుకే తెలంగాణ తల్లి విగ్రహంతో ముడి పెట్టారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉండి వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. 

సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని తామూు గతంలోనే ప్రకటించామని వివరించారు రేవంత్ రెడ్డి. కన్నతల్లిని తపించేలా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉండాలన్నది తమ అభిమతమని పేర్కొన్నారు. విగ్రహం రూపొందించే బాధ్యతను జేఎన్ టీయూ  ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామని ప్రకటించారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నామని... వేల మందితో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇది అరుదైన అవకాశమని ఇందులో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు రేవంత్. 

Also Read: కవిత బెయిల్ చుట్టూ రాజకీయం - కేటీఆర్ హడావుడే ఈ పరిస్థితికి కారణమా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Embed widget