అన్వేషించండి

CJI NV Ramana: న్యాయం చెప్పడానికి కేవలం కోర్టులే అక్కర్లేదు... సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యాయం చెప్పడానికి కేవలం కోర్టులే అక్కర్లేదని.. అధికారులు, ప్రభుత్వాలు ఎవరైనా సరే న్యాయం చేకూర్చవచ్చునని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.

తీర్పులు చెప్పడానికి హంగామా, ఆర్భాటం అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయం చెప్పడానికి కేవలం కోర్టులే అక్కర్లేదని.. అధికారులు, ప్రభుత్వాలు ఎవరైనా సరే న్యాయం చేకూర్చవచ్చునని సూచించారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ (IMAC) క్లాన్‌క్లేవ్‌లో సీజేఐ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పొప్పులు తెలుసుకుని సమస్యలు అర్థం చేసుకుని, కింది స్థాయిలోనే విశ్వసనీయతతో తీర్పులు చెప్పవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు రావడం అనేది బాధితులకు చివరి ప్రత్యామ్నాయం కావాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రతి వివాదాలను కోర్టు వరకు తీసుకురావడం అక్కర్లేదని, సంప్రదింపులు, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే ఇరుపక్షాలకు ప్రయోజనం ఉంటుందని సూచించారు. కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఏళ్ల తరబడి కాలయాపన జరిగి అసలు ప్రయోజనం ఆలస్యంగా అందుతుందని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో పరిష్కారాలు లభిస్తాయని చెప్పారు. పెండింగ్‌ కేసులు సత్వరమే విచారణ జరగాలని సూచించారు. మహాభారతంలోనూ శ్రీక్రిష్ణుడి ద్వారా కౌరవులు, పాండవులు మధ్యవర్తిత్వం చేశారని గుర్తుచేశారు.

ఆస్తుల పంపకాలను కుటుంబ సభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, తద్వారా ఇరు వర్గాలకు ప్రయోజనంగా ఉంటుందన్నారు. సాధ్యమైనంతవరకు మహిళలు మధ్యవర్తిత్వంలో వివాదాలు పరిష్కరించుకోవాలని.. పెద్ద పెద్ద వారికి, ప్రభుత్వాలకే కాదు సామాన్యులకు సైతం పలు కేంద్రాలలో న్యాయం జరుగుతుందన్నారు. అన్ని విషయాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ది చాలా పెద్ద చెయ్యిఅని.. ఆయన ఏ పని చేసినా పెద్దగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
Also Read: Rosayya No More : వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?

తెలుగులో మాట్లాడిన సీజేఐ..
తాను తెలుగువాడినని చివరగా రెండు ముక్కలు చెబుతానంటూ సీజేఐ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌ (IMAC) ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక అన్నారు. తెలుగు వారికి భోజనంలో పెరుగు లేకపోతే ఎలాగైతే సంతృప్తి ఉండదో.. తెలుగులో మాట్లాడకపోతే అలాగే ఉంటుందన్నారు. తెలుగువారైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు.

విదేశాలకు వెళ్లినప్పుడు.. మీ దేశంలో పెట్టుబడులు పెడితే లిటిగేషన్ క్లియర్ కావడానికి ఎన్నేళ్లు పడుతుందని అడుగుతారని తెలిపారు. కనుక వివాదాలు త్వరగా పరిష్కారం చేసుకోవడానికి మధ్యవర్తిత్వం జరగాలని సూచించారు. తీర్పులు చెప్పడానికి హంగామా, ఆర్భాటం అవసరం లేదన్నారు. అధికారులు, ప్రభుత్వాలు ఎవరైనా సరే విషయాన్ని తెలుసుకుని సత్వరం న్యాయం చేకూర్చవచ్చునంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయాన్ని తేల్చుకునేందుకు, న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదన్నారు. మధ్య వర్తిత్వం, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని.. ఆఖరి ప్రత్యామ్నాయంగా కోర్టులను ఆశ్రయించాలని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు.

Also Read: Rosaiah Rare Photos: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రేర్ ఫొటోస్.. ప్రముఖులతో జ్ఞాపకాలు ఇవిగో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget