అన్వేషించండి

Statue Of Equality: మతాలకు అతీతంగా అందరూ ఒక్కసారైనా రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించుకోవాలన్న అమిత్‌షా

ఎన్ని ఏళ్లైనా సమతా మూర్తి రామానుజాచార్యుల సమానత్వ విగ్రహం విశిష్టాద్వైత, సమానత్వం, సనాతన ధర్మ సందేశాన్ని ప్రపంచానికి చాటుతుందని నమ్ముతున్నట్టు కామెంట్ చేశారు అమిత్‌షా.

హైదరాబాద్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా  మహా సాధువు రామానుజాచార్యులకు నివాళులర్పించారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో  పాల్గొని ప్రసంగించారు. 

సమతా విగ్రహాన్ని సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు అమిత్‌షా. చైతన్యం, ఉత్సాహం రెండూ కలుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి స్మారక కట్టడాల వల్ల సమాజానికి ఏదైనా చేయాలనే  స్ఫూర్తిని పొందుతారన్నారు. మతమేదైనా సాంప్రదాయం ఏదైనా  ఒక్కసారి ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. అంతిమంగా మోక్షానికి మూలం సనాతన ధర్మ ఆశ్రయంలోనే ఉందన్నారు. 

రామానుజాచార్యుల జీవితంలో ఇంతకంటే గొప్ప భావాంజలి, స్మరణాంజలి, కార్యాంజలి ఉండవని అన్నారు అమిత్‌షా. రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే సమతా సూత్రం బోధించారని గుర్తు చేశారు. ఇది కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి వర్తిస్తుందని అభిప్రయాపడ్డారు. 
  
దూరం నుంచి చూస్తే ఈ విగ్రహం ఆత్మకు శాంతిని ఇస్తుందని మనస్సును ఆహ్లాదపరుస్తుందన్నారు అమిత్‌షా. ఈ స్మారకం సనాతన ధర్మ సందేశాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఉపయోగపడుతుందని అమిత్ షా అన్నారు. భారతదేశ చరిత్ర పరిశీలిస్తే ఎన్నో ఒడిదుడుకులు, కాల ఒత్తిడిని తట్టుకుని సనాతన ధర్మం తన ఉనికిని కాపాడుకుంటూ ముందుకు సాగుతుందన్నారు హోంమంత్రి.

సనాతన ధర్మంలో సంక్షోభం ఏర్పడినప్పుడల్లా సనాతన ధర్మ స్ఫూర్తిని రగిలించి, ఈ జ్ఞాన యాత్రను ప్రపంచమంతటా ముందుకు తీసుకెళ్లిన వారు వచ్చారని అమిత్‌షా గుర్తు చేశారు. శంకరాచార్యుల తర్వాత ఈ పని బాగా చేసిన వారిలో రామానుజాచార్యులు ఒకరని అన్నారు. ఆదిశంకరాచార్యులు అనేక భేదాలను ఏకం చేసి సనాతన ధర్మం అనే గొడుగు కింద దేశాన్ని ఏకం చేసే పని చేశారని తెలిపారు. రామనుజాచార్యుడు ఎటువంటి తీవ్రమైన వ్యతిరేకత లేకుండా అనేక దుష్ట పద్ధతులను మార్చారన్నారు. సనాతన ధర్మంలో సత్యమనేది తప్ప వేరే అహంకారం లేదని అభిప్రాయపడ్డారు హోంమంత్రి. 

స్మారక చిహ్నంతోపాటు ఇక్కడ వేదాల అభ్యాసానికి ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. దేశంలోని ప్రతి భాషలోనూ రామానుజాచార్యుల జీవిత సందేశాన్ని అందరికీ అర్థమయ్యేలా ప్రసారమయ్యేలా చేసిన కృషిని అభినందించారు. భగవంతుడు రామానుజాచార్యుల రూపంలో ఇక్కడికి వచ్చి 120 ఏళ్లపాటు సనాతన ధర్మం నుంచి అనేక దురాచారాలను తొలగించేందుకు పని చేశారని అన్నారు. 

"సమాజంలో సమానత్వం, సామరస్యాన్ని నెలకొల్పడానికి, ధ్వైత-అధ్వైత, తరువాత విశిష్టాధ్వైత, అనేక మంది ఆచార్యులు సంక్లిష్ట జ్ఞానాన్ని వివరించి చెప్పే పనిని చేసారు. అందులో రామానుజాచార్యుల గొప్ప సహకారం ఉంది. రామానుజాచార్యులు మధ్యేమార్గాన్ని వివరిస్తూనే విశిష్టాధ్వైత భావనను అందించి భారతీయ సమాజంలో ఐక్యతను తీసుకురావడానికి విప్లవాత్మకమైన కృషి చేశారు. రామానుజాచార్యుల విశిష్టాద్వైత తత్వశాస్త్రం కారణంగా భారతదేశం తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి ఒకే దారంలో ముడిపడి ఉంది. రామానుజాచార్యుల జీవితాన్నీ, కృషిని సరళమైన మాటల్లో చెప్పగలిగితే సమానత్వం, జ్ఞానాన్ని పొందే హక్కు అందరికీ ఉంటుంది. వెయ్యేళ్ల క్రితం కుల వివక్షను అంతం చేయడానికి, సామర్థ్యానికి అనుగుణంగా పని విభజన, ఆరాధనా హక్కులు, ఆలయ కార్యకలాపాలను 20 భాగాలుగా విభజించడానికి కూడా ఆయన విప్లవాత్మక కృషి చేశారు. వర్గ నిర్దిష్ట స్థానంలో భాషా సమానత్వాన్ని, అందరికీ మోక్ష హక్కును కూడా ఇచ్చారు" అని షా అన్నారు. 

గ్రంథాల ద్వారా కలిగిన జ్ఞానం భగవంతుని పట్ల భక్తి కంటే అహంకారాన్ని కలిగిస్తే, ఈ జ్ఞానం అబద్ధమని, అజ్ఞానంగా ఉండటమే మంచిదని రామానుజాచార్యులు చెప్పారని అమిత్ షా అన్నారు. “హిందూమతంలో సమానత్వం కోసం ఎవరైనా ముఖ్యమైన పని చేసి, వాటిని అమలు చేయడానికి ప్రయత్నించినట్లయితే, అది రామానుజాచార్యులు అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. మెల్కోట్ లో బస చేసిన సమయంలో, సమాజంలోని కొన్ని వర్గాల భక్తులు సామాజిక నిబంధనల కారణంగా ఆలయం లోపల పూజించడానికి అనుమతించలేదని రామానుజాచార్య గమనించారు. దీనికి అతను చాలా బాధపడ్డాడు. మార్చేందుకు యత్నించాడు. రామానుజాచార్యులు మహిళా సాధికారత కోసం ఎలా కృషి చేశారనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి తిరువల్లిలో దళిత మహిళతో వాగ్వాదానికి దిగిన తర్వాత ఆ మహిళతో నువ్వు నాకంటే ఎక్కువ జ్ఞానివని చెప్పారు. దీని తరువాత, రామానుజాచార్యులు ఆ మహిళకు దీక్షను ఇచ్చి, ఆమె  విగ్రహాన్ని తయారు చేసి ఆలయంలో ప్రతిష్టించారు. రామానుజాచార్యులు చాలా  నిరాడంబరంగా ఉండేవారు, కానీ అతను కూడా తిరుగుబాటుదారుడే, అతనిలోని తిరుగుబాటు ఆత్మ ద్వారా అనేక చెడు పద్ధతులు అంతం చేశారు" అని హోంమంత్రి అభిప్రాయడ్డారు. 

విశిష్టాధ్వైత దర్శనం - భక్తి సాంప్రదాయం ఈ రెండూ విశ్వం ఉన్నంత వరకు చెక్కుచెదరకుండా ఉంటాయని ఎప్పటికీ చెదిరిపోవని అభిప్రాయపడ్డారు అమిత్‌షా. సమతా విగ్రహం కూడా రామానుజాచార్యుల సందేశాన్ని యుగాలపాటు ముందుకు తీసుకువెళుతుందన్నారు. ఏ కాలంలో సమతా మూర్తిని నిర్మించారో, అదే కాలంలో రామ మందిరాన్ని కూడా పునర్నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. కేదార్ధామ్, బద్రీధామ్, కాశీ విశ్వనాథ్ కారిడార్ కూడా 650 ఏళ్ల తర్వాత పునర్మిస్తున్నామని తెలిపారు. సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా మేల్కొలిపి ప్రపంచం మొత్తం మీద నైతిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన కాలం ఇదన్నారు అమిత్‌షా. రామానుజాచార్యుల సమతామూర్తి ప్రపంచానికి విశిష్టాద్వైత, సమానత్వం, సనాతన ధర్మ సందేశాన్ని అందిస్తుందని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Borugadda Anil: బెయిల్ గడువు ముగిసినా లొంగిపోని బోరుగడ్డ అనిల్ - పరారీలో ఉన్నట్లే - పోలీసులు ఏం చేయబోతున్నారు ?
బెయిల్ గడువు ముగిసినా లొంగిపోని బోరుగడ్డ అనిల్ - పరారీలో ఉన్నట్లే - పోలీసులు ఏం చేయబోతున్నారు ?
Rohit Sharma on Champions Trophy Victory: ఓటమి లేకుండా ఓ టోర్నమెంట్‌ గెలవడం గొప్ప విజయమే: ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుపై రోహిత్ శర్మ
ఓటమి లేకుండా ఓ టోర్నమెంట్‌ గెలవడం గొప్ప విజయమే: ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుపై రోహిత్ శర్మ
Robinhood First Review: క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్‌'కు నితిన్ ఫస్ట్ రివ్యూ
క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్‌'కు నితిన్ ఫస్ట్ రివ్యూ
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Borugadda Anil: బెయిల్ గడువు ముగిసినా లొంగిపోని బోరుగడ్డ అనిల్ - పరారీలో ఉన్నట్లే - పోలీసులు ఏం చేయబోతున్నారు ?
బెయిల్ గడువు ముగిసినా లొంగిపోని బోరుగడ్డ అనిల్ - పరారీలో ఉన్నట్లే - పోలీసులు ఏం చేయబోతున్నారు ?
Rohit Sharma on Champions Trophy Victory: ఓటమి లేకుండా ఓ టోర్నమెంట్‌ గెలవడం గొప్ప విజయమే: ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుపై రోహిత్ శర్మ
ఓటమి లేకుండా ఓ టోర్నమెంట్‌ గెలవడం గొప్ప విజయమే: ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుపై రోహిత్ శర్మ
Robinhood First Review: క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్‌'కు నితిన్ ఫస్ట్ రివ్యూ
క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్‌'కు నితిన్ ఫస్ట్ రివ్యూ
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
Inter Exams: ఇంటర్‌ సెకండియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, 7వ ప్రశ్నకు మార్కులు కలపనున్న బోర్డు
ఇంటర్‌ సెకండియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, 7వ ప్రశ్నకు మార్కులు కలపనున్న బోర్డు
CI Anju Yadav: సీఐ అంజూను అరెస్ట్ చేయండి - జాతీయ మహిళా కమిషన్ ఆదేశం
సీఐ అంజూను అరెస్ట్ చేయండి - జాతీయ మహిళా కమిషన్ ఆదేశం
Nara Lokesh : ఎన్నికల్లో ఇచ్చిన హామీకి లోకేష్‌కు రూ.5 లక్షల ఖర్చు - ఏం జరిగిందో తెలుసా
ఎన్నికల్లో ఇచ్చిన హామీకి లోకేష్‌కు రూ.5 లక్షల ఖర్చు - ఏం జరిగిందో తెలుసా
Embed widget