అన్వేషించండి

BRS MLA To Join Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పటాన్‌చెరు ఎమ్మెల్యే

Telangana Politics | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. శనివారం అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరగా, కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

Mahipal Reddy met cm Revanth Reddy | హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత అధికార పార్టీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం కొనసాగుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతలోనే గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది. పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ భేటీతో బీఆర్ఎస్ పార్టీ మరో ఎమ్మెల్యేను కోల్పోతుందన్న ప్రచారానికి ఊతం ఇచ్చినట్లు అయింది.

సీఎం రేవంత్‌ను కలిసిన మహిపాల్ రెడ్డి 
జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కలవడంతో ఆయన కూడా కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం ఊపందుకుంది. మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి 2014 నుంచి మూడు వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందుతూ వస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, ఆ తరువాత హస్తం పార్టీలో చేరిపోవడం చకచకా జరిగిపోతున్నాయి. ఓవైపు జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. మరోవైపు జిల్లాల నుంచి సైతం ఎమ్మెల్యేలు వచ్చి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ ను కలవడంతో ఆయన సైతం పార్టీ జంప్ అయ్యే అవకాశాలే ఎక్కువ అని చర్చ జరుగుతోంది.

ఇదివరకే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఇప్పటికే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలేరు యాదయ్య, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ బీఆర్ఎస్ త్వరలో ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము బీఆర్ఎస్ ను వీడి అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 

హస్తం గూటికి అరికెపూడి గాంధీ
శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిధుల కోసమే తాను పార్టీ మారుతున్నట్లు గాంధీ ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరారు. వీరిలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్,  హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరిన వారున్నారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరగా, మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ తో భేటీతో 10వ ఎమ్మెల్యే హస్తం పార్టీలో చేరిక ఖాయమని వినిపిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget