News
News
X

Bandi Sanjay: బండి సంజయ్ పై మహిళా కమిషన్ సీరియస్! బీజేపీ ఎంపీ రియాక్షన్ ఏంటంటే!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనను విచారణకు నోటీసులు పంపగా, నేడు ఆయన విచారణకు హాజరై పలు విషయాలు వెల్లడించారు.

FOLLOW US: 
Share:

BJP MP Bandi Sanjay: హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నేడు రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనను విచారణకు నోటీసులు పంపగా, నేడు ఆయన విచారణకు హాజరై పలు విషయాలు వెల్లడించారు. అయితే ఎంపీ బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయిందని కొన్ని మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. ఓ ప్రకటన విడుదల చేస్తూ విచారణకు సంబంధించిన వివరాలు ఓ ప్రకటనలో వెల్లడించారు.

-   నాపై రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్ అయ్యిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.
-   సమాజానికి మంచి జరిగే విషయాలు లీక్ ఇస్తే తప్పులేదు... కానీ అందుకు భిన్నంగా లీకుల పేరుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదు.
-   నా విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా నేను భావించడం లేదు. 
-   మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలి.  
-   రాజ్యాంగబద్దంగా స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై నాకు గౌరవం ఉంది. 
-   ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే  మహిళా కమిషన్ పిలవగానే హాజరయ్యాను.
-   మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చాను.
-   నా స్టేట్ మెంట్ ను మహిళా కమిషన్ రికార్డు చేసింది.
-   మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సుహ్రుద్బావ వాతావరణంలో జవాబిచ్చాను అని బండి సంజయ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

బీజేపీ మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ అని, కమిషన్ నోటీసులను గౌరవించి తాను విచారణకు హాజరైనట్లు బండి సంజయ్ చెప్పారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు తాను పూర్తి సమాధానం చెప్పానని, తెలంగాణలో వాడే వాడుక పదాలు మాత్రమే వాడానన్నారు. మహిళల్ని కించపరచలేదని, ఎమ్మెల్సీ కవితపై ఉద్దేశపూర్వకంగా ఏ వ్యాఖ్యలు చేయలేదని, కేవలం ప్రజలు మాట్లాడే వాడుక పదాలే వినియోగించానని స్పష్టం చేశారు. కుక్క పిల్లల నుంచి ప్రజల్ని కాపాడలేకపోతున్నారని మంత్రి కేటీఆర్ ను విమర్శించారు. కేటీఆర్ చెప్పివన్నీ రాజ్యాంగ బద్ద సంస్థలు అయిపోతాయా, విచారణ సంస్థలు తమ పనిని చేసుకుపోతాయని ఎవరూ జోక్యం చేసుకోరన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అభ్యర్థులు నష్టపోయాక, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నాక స్పందించడం తప్ప కేటీఆర్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. పేపర్ల లీకేజీలో బీఆర్ఎస్ తప్పు లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి ఎందుకు భయపడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై 354, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు కేంద్ర మహిళా కమిషన్ ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. కేసును సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 13న  హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే  పార్లమెంటు సమావేశాల కారణంగా 18న హాజరవుతానని ఆయన కమిషన్‌ను కోరారు. ఆ మేరకు హాజరయ్యారు.

  

Published at : 18 Mar 2023 07:57 PM (IST) Tags: Bandi Sanjay Kavitha Womens Commission Telangana BRS MLC Kavitha Telangana State Commission for Women

సంబంధిత కథనాలు

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

టాప్ స్టోరీస్

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

Anupama Parameswaran Photos: శారీలో సొగసుల అనుపమ

Anupama Parameswaran Photos: శారీలో సొగసుల అనుపమ