అన్వేషించండి

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Bathini Fish Prasadam: కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో  ఆస్తమా పేషెంట్లకు చేదువార్త ఇది.

ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని, హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ఎవరూ రావొద్దని బత్తిని వంశస్తులు సూచించారు. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో  ఆస్తమా పేషెంట్లకు చేదువార్త ఇది. ప్రతి ఏడాది మృగశిర కార్తె వచ్చిందంటే చేప మందు పంపిణీ గుర్తొస్తుంది. కానీ కరోనా వ్యాప్తి తరువాత పరిస్థితులు మారిపోయాయి. 

మృగశిర కార్తెలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిట 
ప్రతి ఏడాది మృగశిర కార్తె (Mrigasira Karti) వచ్చిందంటే హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా రోగులతో కిటకిటలాడుతుంది. ఆస్తమా రోగులకు బత్తిని వంశస్తులు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆస్తమా పేషెంట్లు చేప మందు తీసుకునేందకు ప్రతి ఏడాది హైదరాబాద్‌కు వచ్చేవారు. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది చేప మందు పంపిణీకి ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. దీంతో ఆస్తమా పేషెంట్లు చేప ప్రసాదం కోసం ఈ ఏడాది హైదరాబాద్ రావొద్దని నిర్వాహకుడు బత్తిని గౌరీ శంకర్ (Gowri Shankar Distributes Fish Prasadam) తెలిపారు. 

దశాబ్దాల సంప్రదాయానికి మూడో ఏడాది ఆటంకాలే.. 
దాదాపు 170 ఏళ్ల నుంచి బత్తిని వంశస్తులు ఆస్తమా పేషెంట్ల కోసం నగరంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తితో మూడేళ్ల కిందట తొలిసారి చేప ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా, కొవిడ్19 నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి అనుమతి ఇవ్వలేదు. గత ఏడాది సైతం ప్రభుత్వం నో చెప్పడంతో ఆస్తమా పేషెంట్లకు నిరాశే ఎదురైంది. కనీసం ఈ ఏడాదైనా తమకు చేప మందు దొరుకుతుందని ఆస్తమా పేషెంట్లు భావించారు. ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చి చేప మందు తీసుకుందామనుకున్నారు. కానీ కరోనా నిబంధనలతో ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని నిర్వాహకుడు బత్తిని గౌరీ శంకర్ వెల్లడించారు. దాంతో వరుసగా మూడో ఏడాది ఆస్తమా పేషెంట్లకు చేప మందు లభించనట్లవుతుంది.

Also Read: KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GVMC Mayor Election: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
KCR on HCU Lands: హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
Pak Gets C130 Support: యుద్ధ భయంతో టర్కీ సాయం కోరిన పాక్, ఆయుధాలతో ఇస్లాబాబాద్ చేరిన సీ130 మిలటరీ విమానం
యుద్ధ భయంతో టర్కీ సాయం కోరిన పాక్, ఆయుధాలతో ఇస్లాబాబాద్ చేరిన సీ130 మిలటరీ విమానం
Vishwak Sen: మొన్ననే 30 వచ్చాయ్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా.. - 'హిట్ 3' వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ క్లారిటీ
మొన్ననే 30 వచ్చాయ్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా.. - 'హిట్ 3' వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG Captian Rishabh Pant Failures in IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్Rishabh Pant Failures IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్RCB 6 Away Matches Wins in Row | IPL 2025 లో సరికొత్త చరిత్రను సృష్టించి ఆర్సీబీKrunal Pandya 73 runs vs DC IPL 2025 | కుప్పకూలిపోతున్న RCB ని కొహ్లీ తో కలిసి నిలబెట్టేసిన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GVMC Mayor Election: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
KCR on HCU Lands: హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
Pak Gets C130 Support: యుద్ధ భయంతో టర్కీ సాయం కోరిన పాక్, ఆయుధాలతో ఇస్లాబాబాద్ చేరిన సీ130 మిలటరీ విమానం
యుద్ధ భయంతో టర్కీ సాయం కోరిన పాక్, ఆయుధాలతో ఇస్లాబాబాద్ చేరిన సీ130 మిలటరీ విమానం
Vishwak Sen: మొన్ననే 30 వచ్చాయ్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా.. - 'హిట్ 3' వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ క్లారిటీ
మొన్ననే 30 వచ్చాయ్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా.. - 'హిట్ 3' వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ క్లారిటీ
PM Modi AP Tour: అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
India Bans Pakistans YouTube: మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
Nani: మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
Telangana Politics: డేట్ ఫిక్స్ చెయ్, నీ బచ్చాగాళ్లు వద్దు, అసెంబ్లీలో చర్చకు నువ్వే రావాలి- కేసీఆర్‌కు మంత్రులు ఛాలెంజ్
డేట్ ఫిక్స్ చెయ్, నీ బచ్చాగాళ్లు వద్దు, అసెంబ్లీలో చర్చకు నువ్వే రావాలి- కేసీఆర్‌కు మంత్రులు ఛాలెంజ్
Embed widget