అన్వేషించండి

Revanth Reddy : వైద్య సీట్ల బ్లాక్ దందాలో మంత్రుల ప్రమేయం, సీబీఐ విచారణకు ఆదేశించాలని గవర్నర్ కు రేవంత్ రెడ్డి లేఖ!

Revanth Reddy : రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాలో మంత్రుల ప్రమేయం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

Revanth Reddy Letter To Governor : తెలంగాణలో వైద్య సీట్ల బ్లాక్ దందాలో మంత్రులు కూడా భాగస్వాములు కావ‌డం దారుణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రులు మ‌ల్లారెడ్డి, పువ్వాడ అజ‌య్‌కుమార్‌, ఎమ్మె్ల్సీ ప‌ల్లా రాజేశ్వర రెడ్డి మెడికల్ పీజీ సీట్ల దందాకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారన్నారు.  నీట్ ర్యాంక్ ఆధారంగా చిన్న చిన్న లొసుగుల‌ను ఆస‌రా చేసుకుని ఏటా రూ. వంద కోట్లు మేర సీట్లను బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రైవేటు క‌ళాశాల‌ల్లో సీట్ల కోసం దర‌ఖాస్తు చేయించ‌డం, సీట్ల కేటాయింపు చేయ‌డం కౌన్సిలింగ్ పూర్తైన తరువాత అదే సీటును బ్లాక్‌లో ఇత‌రుల‌కు రెండు నుంచి రెండున్నర‌ కోట్లకు అమ్ముకుంటున్నారన్నారు.  

సీఎం ఎందుకు స్పందించలేదు?

రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు, ఇతర ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల్లో పీజీ సీట్ల బ్లాక్ దందాపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళి సైకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. క‌న్వీన‌ర్ కోటాలో మెరిట్ ఆధారంగా పేద మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు రావాల్సిన సీట్లను మేనేజ్ మెంట్ కోటాలోకి మార్చి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్‌లో వైద్య సీట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దందాపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్ ను కోరారు.  వైద్య సీట్ల దందాపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని గ‌వ‌ర్నర్‌ను రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో వారం రోజులుగా పేద, మధ్య తరగతి విద్యార్థులు పీజీ వైద్య విద్య సీట్ల బ్లాక్ దందాపై రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారన్నారు.  స్థానిక విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాయన్నారు.  విద్యార్థుల ఆందోళనపై ఇప్పటి వరకు వైద్య శాఖ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ స్పందించలేదన్నారు. 

మంత్రులపై ఆరోపణలు!

"కంచె చేను మేసిన చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారే వైద్య విద్య సీట్ల బ్లాక్ దందాలో భాగస్వాములుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, వైద్యశాఖ మంత్రి గానీ స్పందిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి నేతలు ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీలను నిర్వహిస్తూ ఈ బ్లాక్ దందాలకు పాల్పడుతున్నట్టు విద్యార్థు్లే ఆరోపిస్తున్నారు. నాలుగైదు రోజులుగా ఈ అంశంపై పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వస్తున్నాయి. మంత్రుల ఆధీనంలో ఉన్న కళాశాలల్లో బ్లాక్ దందా జరిగినట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి.
ఉత్తర భారతదేశానికి చెందిన మెరిట్ విద్యార్థుల పేరుతో రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో సీటు కోసం దరఖాస్తు చేయించడం, వారికి సీటు కేటాయింపు జరిగాక కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు చేరకుండా ఉంచి, ఆ తర్వాత అదే సీటును బ్లాక్ లో వేరే వారికి రూ.2 నుంచి రూ.2.5 కోట్లకు అమ్ముకోవడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది." అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

గవర్నర్ విశేష అధికారాలు ఉపయోగించాలి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పేద, మధ్య తరగతి మెరిట్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తోన్న ఈ బ్లాక్  దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గవర్నర్ ను కోరారు. ఇందులో స్వయంగా టీఆర్ఎస్ మంత్రుల ప్రమేయం ఉన్నందున పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల, విచారణతోనో ఇది నిగ్గు తేలదన్నారు.  కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ను మీరు నివేదిక కోరినంత మాత్రాన సరిపోదన్నారు. గవర్నర్ హోదాలో రాష్ట్రంలోని యూనివర్సిటీల ఛాన్సెలర్ గా గవర్నర్ కు ఉన్న విస్తృత అధికారాలను ప్రయోగించాల్సిన సందర్భం వచ్చిందన్నారు. బ్లాక్ దందాలో మంత్రుల ప్రమేయం ఉన్నందున నిష్పాక్షికతతో కూడిన, అత్యున్నత విచారణ అవసరమన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rishikonda Palace: పర్యాటకశాఖ చేతుల్లోకే రిషి కొండ ప్యాలెస్- ప్రజలకు ఉపయోగపడేలా, ఆదాయం తెచ్చేలా కీలక నిర్ణయం!
పర్యాటకశాఖ చేతుల్లోకే రిషి కొండ ప్యాలెస్- ప్రజలకు ఉపయోగపడేలా, ఆదాయం తెచ్చేలా కీలక నిర్ణయం!
Hyderabad Crime News: స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తోనే నాల్గో తరగతి విద్యార్థి ఆత్మహత్య! హైదరాబాద్‌లో సంచలన ఘటన 
స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తోనే నాల్గో తరగతి విద్యార్థి ఆత్మహత్య! హైదరాబాద్‌లో సంచలన ఘటన 
AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !

వీడియోలు

Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam
Auqib Nabi IPL 2026 Auction | ఐపీఎల్ 2026 వేలంలో భారీ ధర పలికిన అనామక ప్లేయర్ | ABP Desam
Matheesha Pathirana IPL 2026 Auction | భారీ ధరకు వేలంలో అమ్ముడుపోయిన పతిరానా | ABP Desam
Quinton de Kock IPL 2026 Auction Surprise | సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ కు అంత తక్కువ రేటా.? | ABP Desam
Cameron Green IPL Auction 2026 | ఆసీస్ ఆల్ రౌండర్ కు ఐపీఎల్ వేలంలో ఊహించని జాక్ పాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishikonda Palace: పర్యాటకశాఖ చేతుల్లోకే రిషి కొండ ప్యాలెస్- ప్రజలకు ఉపయోగపడేలా, ఆదాయం తెచ్చేలా కీలక నిర్ణయం!
పర్యాటకశాఖ చేతుల్లోకే రిషి కొండ ప్యాలెస్- ప్రజలకు ఉపయోగపడేలా, ఆదాయం తెచ్చేలా కీలక నిర్ణయం!
Hyderabad Crime News: స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తోనే నాల్గో తరగతి విద్యార్థి ఆత్మహత్య! హైదరాబాద్‌లో సంచలన ఘటన 
స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తోనే నాల్గో తరగతి విద్యార్థి ఆత్మహత్య! హైదరాబాద్‌లో సంచలన ఘటన 
AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
Bride Viral video: రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
Embed widget