అన్వేషించండి

Revanth Reddy : భద్రాచలం ముంపులో కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర- రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

Revanth Reddy : తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీ కారణంగానే భద్రాచలం మునిగిపోయిందని విమర్శించారు.

Revanth Reddy : ప్రముఖ యాంకర్, రేడియో జాకీ కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ ల సమక్షంలో కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.  ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే అన్నారు. అయితే 8 సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం అభ్యున్నతి కోసం వారి ఆస్తులు పెంచుకొవడం కోసమే రాష్ట్రాన్ని ఉపయోగించుకున్నారని విమర్శించారు. కత్తి కార్తీక తన వంతు కృషి చేయాలని కోరారు. వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్​నారు.  
వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. 

జాతీయ రాజకీయాలపై చర్చ 

10 రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదు అయి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.  వర్షకాలం  వస్తున్నప్పుడు మే నెలలోనే ఆయా శాఖలతో , మంత్రులతో సీఎం సమీక్ష చేయాల్సి ఉందన్నారు.  ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి నిరంతరం సీఎం పర్యవేక్షించాలని, వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్య శాఖ , డిజాస్టర్ సమయంలో విపత్తు బృందాలను అప్రమత్తం చేయాలన్నారు. కానీ సీఎం కేసీఆర్ సమీక్ష చేసినప్పుడు వైద్య ఆరోగ్య శాఖను కానీ డిజాస్టర్ బృందాలను, ఆయా అధికారులను పిలవకుండా పార్టీ ఫిరాయింపులపై సమీక్ష చేస్తున్నారని ఆరోపించారు. పక్క రాష్ట్ర నేతలకు ఫోన్ చేసి జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్రపై మాట్లాడుతున్నారని విమర్శించారు.

కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలి! 

సింగరేణి ఉద్యోగులు ఇతరులను కాపాడబోయి ఇద్దరు మరణించారు. కనీసం వారికి సంతాపం కూడా ప్రభుత్వం తెలియజేయలేదు. వరదలు వచ్చే 20 నియోజకవర్గాల్లో  మంత్రులను, ఆయా శాఖ అధికారులను అలెర్ట్ చేయాలని సూచించాం. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించాం. రీడిజైన్ పేరుతో లక్ష కోట్లకు పైగా ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఎక్కడికక్కడ మోటార్లు మునిగిపోయాయి. అవి మళ్లీ పనిచేస్తాయని నమ్మకం లేదు. ఆ మోటార్లలో కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలైపోయింది. వరదలు వచ్చినప్పుడు మోటార్లు మునుగుతాయని అంటున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం మునిగాయా... నిపుణుల పేరుతో అవినీతికి తెరలేపారు. ప్రజలు కొట్టుకుపోయి చచ్చిపోతుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో కలుషితమైన తిండి వల్ల 800 మంది రోగాల బారిన పడ్డారు. వారిని ఇంత వరకు ప్రభుత్వ పరంగా పరమర్శించలేదు. 11 లక్షల ఎకరాల్లో పంట మునిగిపోయింది. - రేవంత్ రెడ్డి 

జాతీయ విపత్తుగా ప్రకటించాలి 

సర్వేలు అన్ని టీఆర్ఎస్ కు సగం స్థానాలే అని చెబుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తండ్రీ కొడుకులు నాశనం చేశారన్నారు. నేషనల్ డిజాస్టర్ బృందాలను పంపించాలని ప్రధానికి కాంగ్రెస్ లేఖ రాసిందన్నారు. నష్టపోయిన రైతులకు పంట పరిహారం చెల్లించాలని కోరారు.  ఇసుక దోపిడీ వల్లే భద్రాచలం మునిగిపోయిందని విమర్శించారు. వరదలకు కారణం కేసీఆర్ కుటుంబం ఇసుక దోపిడీ అని మండిపడ్డారు.  వరదల్లో ప్రజలు,పశువులు ఆస్తులు కొట్టుకుపోతుంటే జాతీయ రాజకీయాల పై సమీక్ష చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వరదలను జాతీయ విపత్తుగా గుర్తించి తక్షణమే రూ.2 వేల కోట్లు రిలీజ్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.  

Revanth Reddy : భద్రాచలం ముంపులో కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర- రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ లో చేరిన కత్తి కార్తీక

కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా, గర్వంగా ఉందని కత్తి కార్తీక అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మీడియాలో ఉండి, తెలంగాణ యాస, భాషపై చైతన్యం కలిగించామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
Embed widget