అన్వేషించండి

Mlas Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు, రాజకీయాలకు కోర్టును వేదికగా చేసుకోవద్దని హితవు

Mlas Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ అంశాలకు కోర్టును వేదిక చేసుకోవద్దని హితవుపలికింది.

Mlas Poaching Case : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి కేసును బదిలీ చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ కేసును హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని ముగ్గురు నిందితులు తరఫున మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ సీతారామమూర్తి, సీనియర్‌ న్యాయవాది ఎల్‌. రవిచంద్ర వాదనలు వినిపించారు. ప్రభుత్వ అప్పీల్‌కు విచారణ అర్హత లేదని వాదించారు. క్రిమినల్‌ కేసు కాబట్టి సింగిల్‌ జడ్జి తీర్పుపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నారు. అంతేకానీ హైకోర్టులో డివిజన్ బెంచ్ విచారణ జరపకూడదన్నారు. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేసేలా ఉందని అందుకే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వాదించారు. కేసు దర్యాప్తులో ధర్మాసనం జోక్యం చేసుకోవద్దని కోరారు. బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది దామోదర్‌ రెడ్డి వినిపిస్తూ ఈ కేసును సీబీఐకి అప్పగించడమే సరైన నిర్ణయం అన్నారు.  

రాజకీయ అంశాలకు హైకోర్టు వేదిక కాదు

బీజేపీ లక్ష్యంగా బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాయని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చారని ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. ఇలాంటిది దేశంలో ఎక్కడా జరగలేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తెలంగాణలో మాత్రం 2014 నుంచి ఇప్పటి వరకు 37 మంది ఎమ్మెల్యేలు ఇతర రాజకీయపార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరారని, బీజేపీ తరఫు న్యాయవాది కోర్టు వాదనలు వినిపించారు. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి కొట్టివేసినప్పుడు దానిపై ఎందుకు అప్పీల్‌ చేశారని అడ్వొకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ అంశాలకు హైకోర్టును వేదికగా చేసుకోవద్దని హితవుపలికింది. రాజకీయ అంశాలను బయట చూసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సీబీఐ ఒత్తిడి చేస్తుందని ఏజీ వాదనలు 

 అయితే ప్రభుత్వం తరఫున వాదనలు వినపించే సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దిల్లీలో ఉన్నారని, సోమవారం వరకు గడువు ఇవ్వాలని ఏజీ కోర్టును కోరారు. సోమవారం కూడా ఆయన దిల్లీలో ఉంటారని, ఆన్‌లైన్‌ లో విచారణ జరపాలని ఏజీ కోరడంతో హైకోర్టు అందుకు అంగీకరించింది. సోమవారం మధ్యాహ్నం వర్చువల్‌ విధానంలో ఈ కేసు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని సీబీఐ తరఫున సీఎస్‌కు లేఖ రాసినట్టు డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందగానే దర్యాప్తు ప్రారంభిస్తామని సీబీఐ తెలిపింది. సీబీఐ అధికారులు కేసు వివరాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఏజీ కోర్టుకు తెలిపారు. సోమవారం వరకు కేసు ఫైల్స్‌ కోసం ఒత్తిడి చేయొద్దని సీబీఐని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసుపై సోమవారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో స్పష్టత వచ్చిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐ భావిస్తుంది.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!

వీడియోలు

Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
US proposing 500 percent tax:500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
Sabarimala gold theft case: శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
Mahindra XUV 7XO ప్రోస్‌ అండ్‌ కాన్స్‌: ఈ SUV మీకు సరిపోతుందా? మీ డబ్బుకు తగిన విలువ ఇస్తుందా?
Mahindra XUV 7XO ప్లస్‌లు-మైనస్‌లు: కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
IPAC Case in High Court:'న్యాయమూర్తిని మార్చండి' IPAC కేసులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ED విజ్ఞప్తి!
'న్యాయమూర్తిని మార్చండి' IPAC కేసులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ED విజ్ఞప్తి!
Embed widget