అన్వేషించండి

HCA Azharuddin : మ్యాచ్ నిర్వహణ అంటే అంత తేలికకాదు, జింఖానా ఘటనలో హెచ్సీఏ తప్పేం లేదు- అజారుద్దీన్

HCA Azharuddin : జింఖానా గ్రౌండ్ తోపులాట ఘటనపై హెచ్సీఏ తప్పిదం ఏంలేదని అజారుద్దీన్ అన్నారు. మ్యాచ్ నిర్వహణ అంటే అంత తేలికకాదన్నారు.

HCA Azharuddin : హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట వివాదాస్పదం అయింది. హెచ్సీఏ నిర్లక్ష్యం వల్లే టికెట్లకు అధిక సంఖ్యలో అభిమానులు వచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ ఘటనపై మంత్రి సమీక్ష నిర్వహించగా అక్కడకు వచ్చిన హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు సమాచారం. భారత్‌ -ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా మైదానంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అభిమానులు, పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తోపులాట దురదృష్టకరమన్నారు. ఇందులో తమ తప్పు ఏంలేదని అజారుద్దీన్‌ అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. టికెట్ల వివరాలు శుక్రవారం మీడియాకు వెల్లడిస్తామన్నారు. మ్యాచ్‌ నిర్వహణ అంటే అంత తేలిక కాదని అజారుద్దీన్ చెప్పుకొచ్చారు. 

నెగిటివ్ కోణంలో చూడొద్దు 

జింఖానా మైదానంలో తోపులాటపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నిర్వహించిన సమీక్ష అనంతరం అజారుద్దీన్‌ మాట్లాడారు. హెచ్‌సీఏలో లోపాలుంటే సవరించుకుంటామన్నారు. తెలంగాణకు మరింత గౌరవం తెచ్చాలే హెచ్‌సీఏ చర్యలు ఉంటాయన్నారు. మ్యాచ్‌ నిర్వహణ అంత సులభం కాదని, కూర్చొని మాట్లాడుకునే అంత ఈజీ కాదన్నారు. అధ్యక్ష పదవిలో ఇవాళ తానున్నానని, రేపు మరొకరు ఉంటారని అజారుద్ధీన్ అన్నారు.తెలంగాణ ఖ్యాతి మరింత పెంచేందుకు పనిచేస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంతో కలిసి మ్యా్చ్ ల నిర్వహణ ఉంటుందన్నారు. మ్యాచ్ నిర్వహణను ఎప్పుడూ నెగిటివ్ కోణం చూడొద్దని కోరారు. చాలా ఏళ్ల తర్వాత మ్యాచ్ నిర్వహణ అవకాశం వచ్చిందని అందుకు సంతోషంగా ఉన్నామన్నారు. 

హెచ్సీఏ బోర్డు రద్దు చేయాలి-డీవైఎఫ్ఐ

సెప్టెంబర్ 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు జారీచేయడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఘోర వైఫల్యం చెందిందని డివైఎఫ్ఐ ఆరోపించింది. గత పది రోజులుగా క్రీడాభిమానులకు క్రికెట్ టికెట్లపై హెచ్సీఏ స్పష్టత ఇవ్వకపోవడంతో ఉప్పల్ స్టేడియం, జింఖానా గ్రౌండ్ దగ్గర అభిమానులు పడిగాపులు కాస్తున్నారు‌. మ్యాచ్ సమీపిస్తుండడంతో క్రీడాభిమానులు ఆందోళనలు చేయడంతో హెచ్సీఏ స్పందించి ఇవాళ క్రికెట్ మ్యాచ్ టికెట్లను జారీ చేస్తామని ప్రకటించింది. ఇవాళ టికెట్లు జారీ చేస్తారని పెద్ద ఎత్తున క్రీడాభిమానులు భారీ సంఖ్యలో క్యూ లైన్ లో నిలబడి ఎదురుచూస్తున్న తరుణంలో గంటలోనే టికెట్లు అయిపోయాయని చెప్పడంతో క్రీడాభిమానుల తోపులాటలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు పూర్తిగా హెచ్సీఏ బాధ్యత వహించాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. క్రీడాభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. హెచ్సీఏ  ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ హెచ్సీఏ బోర్డు రాజీనామా చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. పోలీసుల లాఠీ ఛార్జీలో గాయపడిన క్రీడాభిమానులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని, హెచ్సీఏ బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ డీవైఎఫ్ఐ నేతలు కోరారు. ‌‌

Also Read: IND Vs AUS Tickets: జింకానా గ్రౌండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, లాఠీఛార్జి - స్పృహతప్పిన పలువురు, మహిళకు సీరియస్!

Also Read : Minister Srinivas Goud : హెచ్సీఏ నిర్లక్ష్యం వల్లే జింఖానా ఘటన, బాధ్యులపై కఠిన చర్యలు - మంత్రి శ్రీనివాస్ గౌడ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget