అన్వేషించండి

Revanth Reddy : పెద్దమ్మ గుడి ఆవరణలో అత్యాచారం ఆరోపణలు, రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు

Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విష్ణు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పెద్దమ్మ గుడి ఆవరణలో బాలికపై అత్యాచారం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. ఇటీవల హైదరాబాద్ లో బాలికపై సామూహిక అత్యాచారం ఘటన సంచలనం అయింది. ఈ కేసుపై రాజకీయ నేతలు విమర్శలు చేశారు. పెద్దమ్మ త‌ల్లి ఆలయం ఆవ‌ర‌ణ‌లో సామూహిక అత్యాచారం జ‌రిగింద‌ని రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నిరాధారమని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన రేవంత్ రెడ్డిపై చ‌ట్టప‌ర‌మైన చర్యలు తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరారు విష్ణువర్ధన్ రెడ్డి. భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బతినేలా రేవంత్ రెడ్డి మాట్లాడారన్నారు. 

రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు 

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంత‌రం మాజీ ఎమ్మెల్యే విష్ణువ‌ర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతగా కాకుండా, పెద్దమ్మ త‌ల్లి ఆలయం ఫౌండర్ గా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని తెలిపారు. రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి గుడి ఆవ‌ర‌ణ‌లో గ్యాంగ్ రేప్ జ‌రిగింద‌ని ఆరోపించారు. ఆ ఘ‌ట‌న పెద్దమ్మ గుడి  వెనకాల ఉన్న కాల‌నీలో జ‌రిగింద‌ని పోలీసులు కూడా నిర్ధారించారని విష్ణువ‌ర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సరైన సమాచారం లేకుండా మాట్లాడుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని హితవు పలికారు.  

తప్పుడు ఆరోపణలు 

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని ఓ ప‌బ్ వ‌ద్ద బాలిక‌ను అప‌హ‌రించి కారులో సామూహిక అత్యాచారం చేశారు కొందరు యువకులు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన రేవంత్ రెడ్డి అత్యాచార ఘ‌ట‌న జూబ్లీహిల్స్ ప‌రిధిలోని పెద్దమ్మ గుడి ఆవ‌ర‌ణ‌లో జ‌రిగింద‌ని వ్యాఖ్యానించారు. ఈ ఆరోప‌ణ‌ల‌ు వివాదానికి దారితీశాయి. దీనిపై స్పందించిన విష్ణువ‌ర్ధన్ రెడ్డి శ‌నివారం బంజారా హిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పెద్దమ్మ దేవాల‌యంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జ‌ర‌గ‌డం లేద‌న్నారు. ఈ వ్యవ‌హారంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్పన్నారు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే స‌హించేది లేద‌ని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఆల‌య ప‌రిధిలో అత్యాచారం జ‌రిగింద‌ని త‌ప్పుడు ఆరోపణలు చేసినందుకే రేవంత్ రెడ్డిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌న్నారు. తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా పెద్దమ్మతల్లి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన రేవంత్ పై చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమన్నారు.   

Also Read : Munugode Congress Candidate: మునుగోడు బైపోల్ కోసం ఇద్దరి పేర్లు ఫైనల్ చేసిన కాంగ్రెస్ - బీసీ నేతకు టికెట్ దక్కుతుందా !

Also Read : Ktr Setires BJP : నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరు? బీజేపీ నేతలపై కేటీఆర్ సెటైర్లు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget