అన్వేషించండి

Revanth Reddy : అదానీ-మోదీ చీకటి స్నేహం బయటపడుతుందనే రాహుల్ గాంధీపై వేటు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదానీ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై వేటు వేశారని విమర్శించారు.

Revanth Reddy : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై వేటుపడింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్ సభ సెక్రటరీ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి డిస్ క్వాలిఫై చేశారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అన్నారు. దేశ ఐక్యత - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. అదానీ - మోదీ చీకటి స్నేహంపై రాహుల్ గాంధీ నిలదీశారన్నారు. అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోదీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు. ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ 

"అదానీ కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి, ఆ స్కామ్ పై చర్చ జరగకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీపై వేటు వేసింది. దేశంలో ఓ అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. దీనిని కాంగ్రెస్ ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు, రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశం ఉంది. ఈ సమావేశానికి నేను దిల్లీ వెళ్లాల్సిఉంది. కానీ పోలీసులు నిర్బంధించడం వల్ల నేను దిల్లీకి వెళ్లలేకపోయాను. చరిత్రలో నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు. ఎవరూ శాశ్వత అధికారాన్ని అనుభవించలేదు. "- రేవంత్ రెడ్డి 

టీఎస్పీఎస్సీ లీకేజీపై 

"టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై ఉస్మానియా వర్సిటీలో చేపట్టిన నిరసనకు హాజరుకాకుండా నన్ను నిర్బంధించారు. నా ఇంటి చుట్టూ మూడంచెల పోలీసుల భద్రత పెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. నేను ఇక్కడ ఉండడం వల్ల నా ఇరుగుపొరుగు వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ అక్రమ నిర్బంధం దుర్మార్గం. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటవిక చర్య. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను నిర్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ దారుణాలకు పాల్పడుతుంది. పరీక్షలకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా చూస్తారు. ఒక నిమిషం లేటుగా వచ్చినా పరీక్షకు అనుమతించరు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించడానికి ఇంకెంత పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి. లాలాగూడలో ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు కేంద్రంగా ఉంది. ఈ కేంద్రంలో 578 మంది పరీక్షలు రాశారు. ఒంటిగంటలోపు పరీక్ష జరిగాలి కానీ 90 మంది అభ్యర్థులకు 1 గంట నుంచి 3.30 గంటల వరకూ పరీక్షలు రాయించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ఇంత స్పష్టంగా పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని చెబితే సిట్ అధికారి శ్రీనివాస్ ఎందుకు వీటిపై విచారణ చేయలేదు." - రేవంత్ రెడ్డి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget