అన్వేషించండి

Revanth Reddy : అదానీ-మోదీ చీకటి స్నేహం బయటపడుతుందనే రాహుల్ గాంధీపై వేటు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదానీ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై వేటు వేశారని విమర్శించారు.

Revanth Reddy : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై వేటుపడింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్ సభ సెక్రటరీ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి డిస్ క్వాలిఫై చేశారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అన్నారు. దేశ ఐక్యత - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. అదానీ - మోదీ చీకటి స్నేహంపై రాహుల్ గాంధీ నిలదీశారన్నారు. అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోదీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు. ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ 

"అదానీ కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి, ఆ స్కామ్ పై చర్చ జరగకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీపై వేటు వేసింది. దేశంలో ఓ అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. దీనిని కాంగ్రెస్ ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు, రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశం ఉంది. ఈ సమావేశానికి నేను దిల్లీ వెళ్లాల్సిఉంది. కానీ పోలీసులు నిర్బంధించడం వల్ల నేను దిల్లీకి వెళ్లలేకపోయాను. చరిత్రలో నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు. ఎవరూ శాశ్వత అధికారాన్ని అనుభవించలేదు. "- రేవంత్ రెడ్డి 

టీఎస్పీఎస్సీ లీకేజీపై 

"టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై ఉస్మానియా వర్సిటీలో చేపట్టిన నిరసనకు హాజరుకాకుండా నన్ను నిర్బంధించారు. నా ఇంటి చుట్టూ మూడంచెల పోలీసుల భద్రత పెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. నేను ఇక్కడ ఉండడం వల్ల నా ఇరుగుపొరుగు వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ అక్రమ నిర్బంధం దుర్మార్గం. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటవిక చర్య. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను నిర్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ దారుణాలకు పాల్పడుతుంది. పరీక్షలకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా చూస్తారు. ఒక నిమిషం లేటుగా వచ్చినా పరీక్షకు అనుమతించరు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించడానికి ఇంకెంత పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి. లాలాగూడలో ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు కేంద్రంగా ఉంది. ఈ కేంద్రంలో 578 మంది పరీక్షలు రాశారు. ఒంటిగంటలోపు పరీక్ష జరిగాలి కానీ 90 మంది అభ్యర్థులకు 1 గంట నుంచి 3.30 గంటల వరకూ పరీక్షలు రాయించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ఇంత స్పష్టంగా పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని చెబితే సిట్ అధికారి శ్రీనివాస్ ఎందుకు వీటిపై విచారణ చేయలేదు." - రేవంత్ రెడ్డి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
Embed widget