అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Ganesh Nimajjanam: గణేశ్ నిమజ్జనంపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న.. ఈ నెల 10 వరకు గడువు..

హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనాన్ని నిషేధించాలని 2011లోనే దాఖలైన పిటిషన్‌పై మరోసారి గురువారం విచారణ జరిగింది. ఏ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ప్రతి వినాయక చవితికి హైదరాబాద్‌లో వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తూ ఉండే సంగతి తెలిసిందే. అయితే, హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనాలు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఏడాది గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటో ఆగస్టు 10వ తేదీలోపు తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం కరోనా ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. కరోనా తీవ్రత ఇంకా తగ్గిపోలేదని, ఎప్పుడైనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఉప్పెనలా విజృంభించవచ్చని చీఫ్ జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. 

నగరంలో నడిబొడ్డులో ఉన్న హుస్సేన్ సాగర్‌లో వినాయక, దుర్గమ్మల విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలని కోరుతూ న్యాయవాది వేణు మాధవ్ 2011లోనే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ ధర్మాసనం ముందుకు మరోసారి గురువారం విచారణకు వచ్చింది. కరోనా కారణంగా గతేడాది వినాయక నిమజ్జనానికి అనుమతివ్వలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, నిమజ్జనంపై ఈ ఏడాది నిర్ణయమేంటని ధర్మాసనం అడిగింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం తెలుసుకొని చెబుతానని, అందుకు కొంత సమయం కావాలని న్యాయవాది కోరారు. దీంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాల విషయంలో శాశ్వతంగా ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఏటా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి కాకుండా ఒకేసారి శాశ్వతంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.

ఆ కేసుల కోసం రూ.58 కోట్లా..
మరోవైపు, కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు వెచ్చించిన అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ హైకోర్టుకు గురువారం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ నిధులు కోర్టు ధిక్కరణ కేసుల కోసం ఖర్చు చేయలేదని, ఆ కేసుల్లో భూ సేకరణ పరిహారం చెల్లింపు కోసం అని సీఎస్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్ ప్రసాద్‌ ధర్మాసనానికి తెలిపారు. తనకు వేసిన పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకే ఆరోపణలు చేస్తూ పిటిషన్ వేశారని సీఎస్ ఆరోపించారు. 

అయితే, నిధులు విడుదల చేస్తూ జీవో ఉన్న తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చెబుతున్న ఉద్దేశం ఏంటి? కాగితంపై ఉన్నదేంటని ప్రశ్నించింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసుల్లో ఖర్చుల కోసమే జీవో జారీ చేశారని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

Also Read: Hyderabad Viral Video: బతికున్న పామును కరకరా నమిలేస్తూ.. ఈ యువకుడిది హైదరాబాదేనా.. వైరల్ వీడియో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఓటమికి 5 కారణాలు!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఓటమికి 5 కారణాలు!
Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి కంగారు పడి వచ్చేయకండి
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఓటమికి 5 కారణాలు!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఓటమికి 5 కారణాలు!
Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి కంగారు పడి వచ్చేయకండి
Vizag CII Summit:  సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
Love OTP Review - 'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Akhanda 2 First Song: 'అఖండ 2' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్... పూనకాలు తెప్పించేలా బాలకృష్ణ - తమన్ పాట
'అఖండ 2' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్... పూనకాలు తెప్పించేలా బాలకృష్ణ - తమన్ పాట
Embed widget