అన్వేషించండి

Where is Harish Rao: కేసీఆర్ సభకు అందుబాటులో లేని హరీష్ రావు.. ట్రబుల్ షూటర్‌కు అంత ముఖ్యమైన పనేంటీ ?

KCR Meeting | జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తోంది. ఏడాది తరువాత కేసీఆర్ బహిరంగ వేదిక మీద ప్రసంగించనున్న కార్యక్రమానికి ట్రబుల్ షూటర్ హరీష్ రావు అందుబాటులో లేరు.

హైదరాబాద్/ జగిత్యాల: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్  నిర్వహించబోయే సభలపైనే ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ జగిత్యాల సభతో ప్రజల ముందుకు రానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సభా వేదికపైనే సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి కేసీఆర్ ఎలాంటి విమర్శలు చేస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

జగిత్యాల సభకు అందుబాటులో లేని హరీష్ రావు..

ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ కీలక నేతల్లో ఒకరైన ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు జగిత్యాల బహిరంగ సభకు అందుబాటులో ఉండటం లేదు. ఆయనతో పాటు బి. వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీకి వెళ్లారు. నేటి సాయంత్రం ఢిల్లీలో సీనియర్ లాయర్లతో సమావేశమై కొన్ని కీలక అంశాలపై చర్చించనున్నారు.    కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టులో ఇదివరకే పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.  

ఏప్రిల్ 8న వెల్లడించాల్సిన తీర్పును హైకోర్టు ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. తీర్పు కనుక తమకు వ్యతిరేకంగా ఏం చేయాలి, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ఢిల్లీలో సీనియర్ లాయర్లతో చర్చించడానికి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడంతో ఆయన లేకుండా కేసీఆర్, కేటీఆర్ జగిత్యాల సభను నడిపించనున్నారు. ఏడాది తరువాత కేసీఆర్ హాజరై ప్రసంగించనున్న సభకు హరీష్ రావు అందుబాటులో లేకపోవడంపై పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. 

కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ మార్క్ పంచ్‌లు !
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలును కేసీఆర్ అస్త్రంగా మార్చుకోనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన బహిరంగ సభలకు దూరంగా ఉంటూ, కొత్త ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చారు. అయితే, ఇప్పుడు దాదాపు రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన ముగియడంతో, రైతులు, ఇతర వర్గాల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఈ సభ ద్వారా ఎండగట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. గత ఏడాది వరంగల్ ప్లీనరీ తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న భారీ సభ ఇదే కావడంతో, ఆయన దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

జగిత్యాల - బీఆర్‌ఎస్‌కు సెంటిమెంట్ వేదిక
 జగిత్యాల గడ్డపై కేసీఆర్ నిర్వహించిన సభలన్నీ విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ జరిగిన తొలి సభతోనే బీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. అలాగే, 2003లో ధర్మపురిలో కేసీఆర్ చేసిన సింహగర్జనతో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం దిగివచ్చి గోదావరి పుష్కరాలకు నిధులు కేటాయించాల్సి వచ్చింది. ఇలా జగిత్యాల వేదికగా జరిగిన ప్రతి పోరాటం తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరిని పోసింది.

సభపై భారీ ఆశలు - పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సభ ద్వారా కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 2004లో ఎంపీగా కేసీఆర్, ఎమ్మెల్యేగా జీవన్‌రెడ్డి పొత్తులో గెలిచిన నేపథ్యం కూడా ఈ జిల్లాకు ఉంది. ఇప్పుడు అదే జిల్లా నుంచి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. జగిత్యాల మినీ స్టేడియంలో జరిగే ఈ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి భారీగా జనం తరలివచ్చేలా ఇన్‌చార్జులను నియమించి జన సమీకరణ చేపట్టారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget