అన్వేషించండి

Dundubhi River: దుందుభి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు, ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం

Telangana News | నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో దుందుభి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

Nagarkurnool MLA Rajesh Reddy | నాగర్ కర్నూలు: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మరో కలికితురాయి చేరనుంది. రాష్ట్ర ప్రభుత్వం దుందుభి వాగుపై 20 కోట్ల 20 లక్షల రూపాయలతో నూతన బ్రిడ్జి నిర్మించనుంది. ఈ మేరకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయితే ఇటు నాగర్ కర్నూల్, జడ్చర్లతో పాటు కల్వకుర్తి నియోజక వర్గాల మధ్య రాకపోకలకు అంతరాయం తొలగనుంది. దుంధుబి వాగుపై బ్రిడ్జి ద్వారా తాడూరు మండలం సిరసవాడ గ్రామ ప్రజల కష్టాలు తీరనున్నాయి. 

బ్రిడ్జి నిర్మాణానికి పెరుగుతున్న డిమాండ్

ఎన్నో ఏళ్ల నుంచి దుంధుబి వాగు మీద బ్రిడ్జి నిర్మించాలని స్థానికంగా డిమాండ్ ఉంది. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ప్రయోజనం లేదు. గత ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిర రాజేష్ రెడ్డి తక్కువ కాలంలోనే నియోజకవర్గంపై పట్టు సాధిస్తున్నారు. ఏడాదిన్నర వ్యవధిలోనే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కావడంతో ఆయన ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం రూ.20.20 కోట్లతో దుంధుబి వాగుమీద బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ శుక్రవారం నాడు జీవో జారీ చేసింది. దాంతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎన్నో ఏళ్ల కల అయినా ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు సాధించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. తాడూర్ మండలం సిరసవాడ ప్రజల కళ నెరవేరబోతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను అర్థం చేసుకుని కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరుకు జీవో వెలువడిన అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డికి, సంబంధిత శాఖ మంత్రి ధనసరి సీతక్కకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎమ్మెల్యే చొరవతో స్పందించిన ప్రభుత్వం

భారీ వర్షాలకు దుందుభి నదిపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోవడంతో మండల ప్రజలు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించి, ఫొటోలు, వీడియోలను ప్రభుత్వానికి సమర్పించారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని.. మూడు నియోజకవర్గాల ప్రజలకు ఇది ఉపయోగకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రభుత్వ పెద్దలను ఒప్పించి నిధులు సాధించారు. తాడూరు మండల వాసులతో పాటు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ నేతలు రాజేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లకి ఎమ్మెల్యే భూమి పూజ
నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. బిజ్నాపల్లి మండలంలో, తిమ్మాజిపేట మండలంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టారు. బిజ్నాపల్లి మండలం అల్లీపూర్ గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆ ఇంటికి భూమి పూజ చేసిన రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మాయమాటలు చెప్పిందన్నారు. కానీ ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ఇస్తున్నాం అన్నారు.

తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శుక్రవారం నాడు ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ చేశారు.  ఈ కార్యకరమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, సింగల్ విండో మాజీ చైర్మన్ వెంకట్ స్వామి, మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నసీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Also Read: Good News For RTC Staff: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
PM Modi in Somnath: గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
India vs New Zealand 1st ODI: కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
The Raja Saab Cast Fees : 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!

వీడియోలు

Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
MI vs DC WPL 2026 Highlights | ముంబై ఘన విజయం
Vaibhav Suryavanshi India vs Scotland U19 | వార్మప్ మ్యాచ్‌లో అదరొట్టిన వైభవ్!
India vs New Zealand 1st ODI Preview | నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
Virat Kohli Records Ind vs NZ | కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
PM Modi in Somnath: గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
India vs New Zealand 1st ODI: కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
The Raja Saab Cast Fees : 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
Cheapest Automatic 7 Seater Car: అతి చవకైన ఆటోమేటిక్ 7 సీటర్ కారు.. బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కారు కొనేయండి
అతి చవకైన ఆటోమేటిక్ 7 సీటర్ కారు.. బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కారు కొనేయండి
Pawan Kalyan : పవన్ కల్యాణ్ అరుదైన ఘనత - 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' టైటిల్... పవర్ స్టార్ రికార్డు హిస్టరీ
పవన్ కల్యాణ్ అరుదైన ఘనత - 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' టైటిల్... పవర్ స్టార్ రికార్డు హిస్టరీ
Rishabh Pant Ruled Out: వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. అతడి స్థానంలో మరో స్టార్ బ్యాటర్‌కు ఛాన్స్
వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. అతడి స్థానంలో మరో స్టార్ బ్యాటర్‌కు ఛాన్స్
Puri Sethupathi Movie Story : పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
Embed widget