అన్వేషించండి

Dundubhi River: దుందుభి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు, ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం

Telangana News | నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో దుందుభి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

Nagarkurnool MLA Rajesh Reddy | నాగర్ కర్నూలు: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మరో కలికితురాయి చేరనుంది. రాష్ట్ర ప్రభుత్వం దుందుభి వాగుపై 20 కోట్ల 20 లక్షల రూపాయలతో నూతన బ్రిడ్జి నిర్మించనుంది. ఈ మేరకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయితే ఇటు నాగర్ కర్నూల్, జడ్చర్లతో పాటు కల్వకుర్తి నియోజక వర్గాల మధ్య రాకపోకలకు అంతరాయం తొలగనుంది. దుంధుబి వాగుపై బ్రిడ్జి ద్వారా తాడూరు మండలం సిరసవాడ గ్రామ ప్రజల కష్టాలు తీరనున్నాయి. 

బ్రిడ్జి నిర్మాణానికి పెరుగుతున్న డిమాండ్

ఎన్నో ఏళ్ల నుంచి దుంధుబి వాగు మీద బ్రిడ్జి నిర్మించాలని స్థానికంగా డిమాండ్ ఉంది. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ప్రయోజనం లేదు. గత ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిర రాజేష్ రెడ్డి తక్కువ కాలంలోనే నియోజకవర్గంపై పట్టు సాధిస్తున్నారు. ఏడాదిన్నర వ్యవధిలోనే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కావడంతో ఆయన ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం రూ.20.20 కోట్లతో దుంధుబి వాగుమీద బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ శుక్రవారం నాడు జీవో జారీ చేసింది. దాంతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎన్నో ఏళ్ల కల అయినా ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు సాధించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. తాడూర్ మండలం సిరసవాడ ప్రజల కళ నెరవేరబోతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను అర్థం చేసుకుని కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరుకు జీవో వెలువడిన అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డికి, సంబంధిత శాఖ మంత్రి ధనసరి సీతక్కకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎమ్మెల్యే చొరవతో స్పందించిన ప్రభుత్వం

భారీ వర్షాలకు దుందుభి నదిపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోవడంతో మండల ప్రజలు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించి, ఫొటోలు, వీడియోలను ప్రభుత్వానికి సమర్పించారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని.. మూడు నియోజకవర్గాల ప్రజలకు ఇది ఉపయోగకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రభుత్వ పెద్దలను ఒప్పించి నిధులు సాధించారు. తాడూరు మండల వాసులతో పాటు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ నేతలు రాజేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లకి ఎమ్మెల్యే భూమి పూజ
నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. బిజ్నాపల్లి మండలంలో, తిమ్మాజిపేట మండలంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టారు. బిజ్నాపల్లి మండలం అల్లీపూర్ గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆ ఇంటికి భూమి పూజ చేసిన రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మాయమాటలు చెప్పిందన్నారు. కానీ ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ఇస్తున్నాం అన్నారు.

తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి శుక్రవారం నాడు ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ చేశారు.  ఈ కార్యకరమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, సింగల్ విండో మాజీ చైర్మన్ వెంకట్ స్వామి, మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నసీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Also Read: Good News For RTC Staff: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Ippa Flower: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
IPL 2026: ఐపీఎల్‌లో పరుగుల వర్షం! బౌలర్లను చిత్తు చేసి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన 5 మ్యాచ్‌లు ఇవే!
ఐపీఎల్‌లో పరుగుల వర్షం! బౌలర్లను చిత్తు చేసి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన 5 మ్యాచ్‌లు ఇవే!
TVS Bikes 2026: టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
Embed widget