అన్వేషించండి

KCR News: కేసీఆర్‌కు షాక్! ఎన్నికల సంఘం బ్యాన్ - అప్పటిదాకా ప్రచారానికి దూరమే

Telangana News: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆయనపై రెండు రోజుల పాటు నిషేధం విధించి.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఆదేశించింది.

Telangana CM KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆయన రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ బ్యాన్ ఆయనపై నేడు రాత్రి 8 గంటల నుంచి ఉంటుందని స్పష్టం చేసింది. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై ఈ నిషేధం విధించినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

సిరిసిల్లలో ఏప్రిల్‌ 5న కేసీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తో పాటు, తమ పార్టీ నేతలను ఉద్దేశించి అభ్యంతరకరంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అది ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఈసీ విచారణ చేపట్టింది. అనంతరం కేసీఆర్‌ నుంచి వివరణ కూడా సేకరించింది. స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక పోయారని కేసీఆర్ వివరణ ఇచ్చారు. దీనిపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. దీంతో ఎన్నికల కోడ్ ను కేసీఆర్ ఉల్లంఘించారని భావించి చర్యలు తీసుకుంది. మే 1న రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయొద్దని స్పష్టం చేసింది.

కేసీఆర్‌ స్పందన ఇదే
తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ తీసుకున్న చర్యలపై కేసీఆర్ స్పందించారు. తన మాటలను ఎన్నికల అధికారులు సరిగా అర్థం చేసుకోలేదని.. ఇక్కడి భాషా మాండలికం ఢిల్లీలోని ఎన్నికల అధికారులకు అర్థం కాలేదని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు కావాలనే ఈ ఫిర్యాదు చేశారని అన్నారు. తాను మాట్లాడిన మాటల్లో నుంచి కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని వాటిపైనే ఫిర్యాదు చేశారని అన్నారు. తన వ్యాఖ్యలను ఇంగ్లీషులోకి తర్జుమా చేయడం సరికాదని అన్నారు. తాను సిరిసిల్లలో కాంగ్రెస్‌ విధానాలు, హామీల అమల్లో ఫెయిల్యూర్ నే ప్రస్తావించానని అన్నారు. తన మాటలను కాంగ్రెస్‌ నేతలు వక్రీకరించి ఎన్నికల సంఘానికి సమర్పించారని కేసీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget