అన్వేషించండి

Telangana News: త్వరలో రైతు, విద్యా కమిషన్లు ఏర్పాటు- సీఎం రేవంత్ కీలక ప్రకటన

CM Revanth Reddy: రాష్ట్రంలో విద్యా, రైతు కమిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా విధానం ఎలా ఉండాలనేది కమిషన్ నిర్ణయిస్తుందన్నారు.

News From Telangana: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పౌరసంఘాల ప్రతినిధులతో ఇవాళ రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. కౌలు రైతుల రక్షణ కోసం చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు. పంట మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతు, విద్యా కమిషన్లు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, విద్యా విధానం ఎలా ఉండాలనేది కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ తెలిపారు.

కౌలు రైతుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం 
పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో సమీకృత గురుకుల వర్సిటీ సముదాయం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ధర్నా చౌక్, ప్రజా భవన్ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. గత ప్రభుత్వంలోని చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశామని, యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ నియామకాలు చేపడుతున్నామన్నారు. కౌలు రైతుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్న రేవంత్.. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ జరగాలని వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం 
శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో రైతులు కొంత ప్రీమియం చెల్లించి చేరాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, ఊహించని సంఘటనల వల్ల పంటకు నష్టం జరిగినప్పుడు బీమా తీసుకున్న వ్యక్తికి పరిహారం చెల్లిస్తారు. 2016 జూన్ నుంచి మోదీ సర్కార్ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది. 2020లో ఈ పథకం నుంచి బీఆర్ఎస్ సర్కార్ బయటకొచ్చింది. రైతులు ప్రీమియం చెల్లించడం వల్ల వారిపై భారం ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో పథకం నుంచి బయటకు వచ్చింది.  దీంతో రైతులు ఆకాల వర్షాల వల్ల పంట నష్టపోయినా ఎలాంటి పరిహారం అందటం లేదు. కేసీఆర్ సర్కార్‌పై  ఎన్ని విమర్శలు వచ్చినా ఆ పథకాన్ని మళ్లీ తీసుకురాలేదు.  రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది రైతులకు గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. 

అటు గత కేసీఆర్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రైతులు ఏదైనా కారణాల వల్ల హఠాన్మరణం చెందితే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. రైతుల తరపున ప్రభుత్వమే బీమా మొత్తం చెల్లిస్తుంది. దీని వల్ల రైతులపై ఎలాంటి భారం పడదు. కానీ ఈ పథకాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. రైతుబంధు ఇస్తున్నానని చెప్పుకుంటున్న కేసీఆర్.. రైతు బీమా, పంట బీమా పథకాలను అమలు చేయడం లేదంటూ ఆరోపించారు. ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా రైతుబీమా, పంట బీమా పధకాలను కేసీఆర్ అమలు చేయలేదు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Embed widget