అన్వేషించండి

Huzurabad War : మంత్రి గంగుల కుటుంబ గ్రానైట్ కంపెనీలపై ఈడీ విచారణ..! రాజకీయం ఉందా..?

మంత్రి గంగులకు చెందినవిగా భావిస్తున్న కంపెనీలతో పాటు మరికొన్ని గ్రానైట్ కంపెనీలపై ఈడీ విచారణ ప్రారంభించింది. అక్రమంగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేశారని ఈడీకి కొంత మంది ఫిర్యాదులు చేశారు.


తెలంగాణ రాష్ట్ర సమితి తరపున హుజూరాబాద్ ఉపఎన్నికల బాధ్యతలను మంత్రి గంగుల కమలాకర్ తీసుకున్నారు. ఈటల రాజీనామా చేసినప్పటి నుండి ఆయన హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. పార్టీని చక్కదిద్దుతున్నారు. అయితే హఠాత్తుగా ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దృష్టి పెట్టిందనే ప్రచారం ఊపందుకుంది. విచారణ కూడా జరుగుతున్నట్లుగా తేలింది. దానికి సంబంధించిన ఈడీ ఆదేశాలు వెలుగులోకి రావడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపుతోంది. 

గంగుల కమలాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రముఖ గ్రానైట్ వ్యాపారి. ఆయనకు పలు చోట్ల మైనింగ్ వ్యాపారం ఉంది. "శ్వేత" పేరుతో ఆయన కుటుంబం కొన్ని కంపెనీలు నిర్వహిస్తోంది. మరికొన్ని గ్రానైట్ కంపెనీల్లోనూ ఆయనకు భాగస్వామ్యం ఉందని చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని .. ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. అనుమతులు తీసుకున్న దాని కన్నా ఎక్కువగా తవ్వేసి.. గ్రానైట్‌ను విదేశాలకు తరలించారని ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వం ఈ అక్రమాలను నిర్ధారించి..  ఫైన్ విధించిందని.. వాటిని చెల్లించకుండా.. మరో మోసానికి పాల్పడ్డారని ఈడీకి పంపిన ఫిర్యాదుల్లో కొంత మంది ఆధారాలు కూడా ఇచ్చారు. ఫిర్యాదు అందడం ఆలస్యం.. ఈడీ కరీంనగర్ గ్రానైట్ కంపెనీలపై ఫెమా చట్టం కింద విచారణ ప్రారంభించింది.  

ఈడీకి అందిన ఫిర్యాదు ప్రకారం కరీంనగర్ గ్రానైట్ కంపెనీల అక్రమాలు ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉన్నాయి. అప్పట్లోనే ప్రభుత్వం విచారణ జరిపి... ఏ కంపెనీ వల్ల ఎంత నష్టం జరిగిందో లెక్కించారు. అన్ని కంపెనీలకు కలిపి దాదాపుగా రూ. 750 కోట్ల జరిమానా విధించారు. అయితే మైనింగ్ అనుమతులు రద్దు చేయకపోవడంతో  వారి వ్యాపారం అలా కొనసాగుతూ వవచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి పెనాల్టీని ప్రభుత్వం తగ్గించింది. అయినా ఆ మొత్తం కూడా చెల్లించకుండా... కేవలం రూ.11 కోట్ల వరకు మాత్రమే చెల్లించి..  వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ అక్రమాలపై బండి సంజయ్ కూడా 2019లో ఈడీకి ఫిర్యాదు చేశారు. 

ఈడీకి ప్రాథమిక విచాణలో సాక్ష్యాలు లభించడంతో కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించి గ్రానైట్‌ను విదేశాలకు తరలిస్తున్న షిప్పింగ్ కంపెనీకి సమాచారం కోసం లేఖ రాశారు. ఎంతమేర గ్రానైట్‌ విదేశాలకు తరలించారనే దగ్గర్నుంచి కంపెనీలకు సంబంధించిన ప్రతీ సమాచారం ఇవ్వాలన్నారు. మంత్రి గంగులకు నేరుగా ప్రమేయం ఉన్న వ్యవహారం కావడంతో ఇప్పుడీ ఈడీ కేసు సంచలనం అవుతోంది. షిప్పింగ్ కంపెనీ మొత్తం సమాచారం ఇస్తే..  పెద్ద ఎత్తున గంగుల కమలాకర్ కంపెనీలు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది వందల కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడ  ఎన్నికలు జరిగితే.. అక్కడ బీజేపీ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరగడం సహజమేనని.. ఇది కూడా అలాంటిదేనని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే గంగుల బృందానికి మాత్రం ఈడీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని చెబుతున్నారు. 

 


Huzurabad War : మంత్రి గంగుల కుటుంబ గ్రానైట్ కంపెనీలపై ఈడీ విచారణ..! రాజకీయం ఉందా..?

టాప్ హెడ్ లైన్స్

Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Embed widget