అన్వేషించండి

Huzurabad War : మంత్రి గంగుల కుటుంబ గ్రానైట్ కంపెనీలపై ఈడీ విచారణ..! రాజకీయం ఉందా..?

మంత్రి గంగులకు చెందినవిగా భావిస్తున్న కంపెనీలతో పాటు మరికొన్ని గ్రానైట్ కంపెనీలపై ఈడీ విచారణ ప్రారంభించింది. అక్రమంగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేశారని ఈడీకి కొంత మంది ఫిర్యాదులు చేశారు.


తెలంగాణ రాష్ట్ర సమితి తరపున హుజూరాబాద్ ఉపఎన్నికల బాధ్యతలను మంత్రి గంగుల కమలాకర్ తీసుకున్నారు. ఈటల రాజీనామా చేసినప్పటి నుండి ఆయన హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. పార్టీని చక్కదిద్దుతున్నారు. అయితే హఠాత్తుగా ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దృష్టి పెట్టిందనే ప్రచారం ఊపందుకుంది. విచారణ కూడా జరుగుతున్నట్లుగా తేలింది. దానికి సంబంధించిన ఈడీ ఆదేశాలు వెలుగులోకి రావడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపుతోంది. 

గంగుల కమలాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రముఖ గ్రానైట్ వ్యాపారి. ఆయనకు పలు చోట్ల మైనింగ్ వ్యాపారం ఉంది. "శ్వేత" పేరుతో ఆయన కుటుంబం కొన్ని కంపెనీలు నిర్వహిస్తోంది. మరికొన్ని గ్రానైట్ కంపెనీల్లోనూ ఆయనకు భాగస్వామ్యం ఉందని చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని .. ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. అనుమతులు తీసుకున్న దాని కన్నా ఎక్కువగా తవ్వేసి.. గ్రానైట్‌ను విదేశాలకు తరలించారని ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వం ఈ అక్రమాలను నిర్ధారించి..  ఫైన్ విధించిందని.. వాటిని చెల్లించకుండా.. మరో మోసానికి పాల్పడ్డారని ఈడీకి పంపిన ఫిర్యాదుల్లో కొంత మంది ఆధారాలు కూడా ఇచ్చారు. ఫిర్యాదు అందడం ఆలస్యం.. ఈడీ కరీంనగర్ గ్రానైట్ కంపెనీలపై ఫెమా చట్టం కింద విచారణ ప్రారంభించింది.  

ఈడీకి అందిన ఫిర్యాదు ప్రకారం కరీంనగర్ గ్రానైట్ కంపెనీల అక్రమాలు ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉన్నాయి. అప్పట్లోనే ప్రభుత్వం విచారణ జరిపి... ఏ కంపెనీ వల్ల ఎంత నష్టం జరిగిందో లెక్కించారు. అన్ని కంపెనీలకు కలిపి దాదాపుగా రూ. 750 కోట్ల జరిమానా విధించారు. అయితే మైనింగ్ అనుమతులు రద్దు చేయకపోవడంతో  వారి వ్యాపారం అలా కొనసాగుతూ వవచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి పెనాల్టీని ప్రభుత్వం తగ్గించింది. అయినా ఆ మొత్తం కూడా చెల్లించకుండా... కేవలం రూ.11 కోట్ల వరకు మాత్రమే చెల్లించి..  వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ అక్రమాలపై బండి సంజయ్ కూడా 2019లో ఈడీకి ఫిర్యాదు చేశారు. 

ఈడీకి ప్రాథమిక విచాణలో సాక్ష్యాలు లభించడంతో కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించి గ్రానైట్‌ను విదేశాలకు తరలిస్తున్న షిప్పింగ్ కంపెనీకి సమాచారం కోసం లేఖ రాశారు. ఎంతమేర గ్రానైట్‌ విదేశాలకు తరలించారనే దగ్గర్నుంచి కంపెనీలకు సంబంధించిన ప్రతీ సమాచారం ఇవ్వాలన్నారు. మంత్రి గంగులకు నేరుగా ప్రమేయం ఉన్న వ్యవహారం కావడంతో ఇప్పుడీ ఈడీ కేసు సంచలనం అవుతోంది. షిప్పింగ్ కంపెనీ మొత్తం సమాచారం ఇస్తే..  పెద్ద ఎత్తున గంగుల కమలాకర్ కంపెనీలు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది వందల కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడ  ఎన్నికలు జరిగితే.. అక్కడ బీజేపీ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరగడం సహజమేనని.. ఇది కూడా అలాంటిదేనని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే గంగుల బృందానికి మాత్రం ఈడీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని చెబుతున్నారు. 

 


Huzurabad War : మంత్రి గంగుల కుటుంబ గ్రానైట్ కంపెనీలపై ఈడీ విచారణ..! రాజకీయం ఉందా..?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SMAM Scheme: 50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్.. ఎస్ఎంఏఎస్ స్కీమ్ అర్హతలు, దరఖాస్తు విధానం
50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్.. ఎస్ఎంఏఎస్ స్కీమ్ అర్హతలు, దరఖాస్తు విధానం
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Manchu Manoj : ఐదుగురు పిల్లలను దత్తత తీసుకున్న మంచు మనోజ్, మౌనిక - ఐక్య సేవా ట్రస్ట్ ప్రారంభం
ఐదుగురు పిల్లలను దత్తత తీసుకున్న మంచు మనోజ్, మౌనిక - ఐక్య సేవా ట్రస్ట్ ప్రారంభం
Udyogini Scheme 2026: రూ.3 లక్షల లోన్ పై రూ.90 వేల సబ్సిడీ, సున్నా వడ్డీ.. ఉద్యోగిని స్కీమ్ పూర్తి వివరాలు ఇలా!
రూ.3 లక్షల లోన్ పై రూ.90 వేల సబ్సిడీ, సున్నా వడ్డీ.. ఉద్యోగిని స్కీమ్ పూర్తి వివరాలు ఇలా!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 DC VS RR Result Updates: డీసీ అద్భుత విజ‌యం.. ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన రాహుల్, పోరెల్, స్టార్క్.. రాయ‌ల్స్ కు షాక్
డీసీ అద్భుత విజ‌యం.. ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన రాహుల్, పోరెల్, స్టార్క్.. రాయ‌ల్స్ కు షాక్
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Shahpur Railway Station Viral Video: పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
Virat Kohli Records: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి, ఏకైక బ్యాటర్‌గా బద్దలు కొట్టలేని రికార్డు
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి, ఏకైక బ్యాటర్‌గా బద్దలు కొట్టలేని రికార్డు
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Embed widget