అన్వేషించండి

Telangana News : డీటైల్స్ ఇవ్వని సిట్ - కోర్టుకెళ్లిన ఈడీ - టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామాలు

పేపర్ లీకేజీ కేసు వివరాలు సిట్ ఇవ్వడం లేదని ఈడీ కోర్టులో పిటిషన్ వేసింది.

 

Telangana News :  టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కోర్టును ఆశ్రయించింది.   సిట్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కేసు సమాచారం ఇవ్వాలని సిట్‌ను ఈడీ కోరింది. ESIR నమోదు చేసిన తరువాత కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టింది. కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్‌ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఈడీ దర్యాప్తునకు సిట్ సహకరించక పోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సిట్ అధికారులు ఈడీ విచారణకు సహకరించకపోవడం వివాదాస్పదంఅయ్యే అవకాశం ఉంది.  

ఇప్పటికే ఈడీ కాన్ఫిడెన్షియల్ రూమ్  కస్టోడీయన్ శంకర్ లక్ష్మీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సత్యనారాయణలను విచారించాలని నిర్ణయించింది.  టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఆర్థిక మూలలను వెతికే పనిలో ఈడీ ఉంది.  ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్‌మెంట్స్ కోసం నాంపల్లి కోర్టులో ఈడీ కస్టడీ కోరనుంది. పబ్లిక్ డొమైన్ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించి, ECIR నమోదు చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించింది. టీఎస్‌పీఎస్‌సీ నిందితుల వద్ద నుంచి సిట్ 7లక్షలు సేకరించింది. 40లక్షలు డబ్బులు చేతులు మారాయని గుర్తించింది.

శంకరలక్ష్మి కంప్యూటర్‌ నుంచే ప్రశ్నపత్రాలు లీక్‌ కావడంతో, ఆమె పాత్రపై ఈడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొదటిసారిగా బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అసిస్టెంట్‌ సెక్రటరీ సత్యనారాయణపై కూడా ఈడీ దృష్టి పెట్టింది. బుధవారం, గురువారాల్లో శంకరలక్ష్మి, సత్యనారాయణను విడివిడిగా విచారించే అవకాశం ఉన్నది. సిట్‌ సేకరించిన వివరాలు, ఫోరెన్సిక్‌ నివేదికలు, ఈ కేసులో ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను కూడా తమకు అప్పగించాలని ఈడీ లేఖ రాసింది.  గ్రూప్‌-1 పరీక్ష పత్రాన్ని ముందుగానే అందుకొని, విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాయడం, లక్షల్లో డబ్బులు చేతులు మారాయనే అనుమానంతో ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో ఇప్పటి వరకు 17 మందిని సిట్‌ అరెస్టు చేసింది. ఇంకా అధికమొత్తంలో డబ్బులు చేతులు మారి ఉంటాయోమోనని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.                                        

ఇప్పటికే ఈ అంశంపై   ఈడీ కార్యాలయానికి వెళ్లి  రేవంత్ రెడ్డి   ఫిర్యాదు  చేశారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని ఈడీ అధికారులకు  అందించారు.  పేపర్ లీక్ అంశంలో  డబ్బులు  చేతులు  మారాయన్నారు. మనీలాండరింగ్  జరిగిందని  రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై  కేసు నమోదు  చేయాలని  కోరారు. ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది.                                                               

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Allari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABPHyderabad 16Cars Fire Accident | హైదరాబాద్ యూసుఫ్ గూడలో అగ్నికి ఆహుతైపోయిన 16కార్లు | ABP DesamPawan kalyan Touches feet of Pastor | పిఠాపురంలో మహిళా పాస్టర్ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Embed widget