అన్వేషించండి

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఈడీ కోర్టు భారీ షాక్ - ఓటుకు నోటు కేసులో ఆ తేదీన కోర్టుకు హాజరవ్వాల్సిందే !

Vote For Cash : ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఈడీ కోర్టు షాకిచ్చింది. వచ్చే నెల పదహారో తేదీన కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

ED court has issued summons to Revanth Reddy in Vote For Cash case : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులు చిక్కులు తప్పేలా లేవు. ఈ  కేసులో పెద్ద ఎత్తున అక్రమ నగదు చెలామణి జరిగిందని ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. వచ్చే నెల పదహారో తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని రేవంత్ రెడ్డి సహా నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు నిందితులు అందరూ డుమ్మా కొడుతున్నారు. మంగళవారం జరిగిన వాయిాకు కేవలం మత్తయ్య మాత్రమే  హాజరయ్యారు. దీంతో కోర్టు నిందితలందరూ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఓటుకు నోటు కేసులో ఈడీ కూడా కేసు నమోదు 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ  తెలగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్న స్టీఫెన్సర్‌కు డబ్బులు ఎర చూపారని తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో ఆయన చాలా రోజు పాటు జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. అలా డబ్బులు ఎర చూపిన సమయంలో రూ. యాభై లక్షలు రేవంత్ దగ్గర బ్యాగులో ఉన్నాయి. దీంతో నగదు అక్రమ చెలామణి చేశారని ఏసీబీ ఈడీకి కేసు రిఫర్ చేసింది. ఈ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ నోదు చేసిన కేసులో విచారణ జరుగుతోంది. రేవంత్ రెడ్డి సీఎం అయినందున ఆ కేసును ఇతర రాష్ట్రాలకు  బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ఈ కేసు దర్యాప్తు, విచారణ విషయంలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. 

పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!

నిందితులు హాజరు కాకపోతూండటంతో విచారణ ఆలస్యం 

ఇదే కేసులలో ఈడీ దాఖలు చేసిన కేసులో విచారణ నెమ్మదిగా సాగుతోంది. కోర్టుకు నిందితులు సరిగ్గా హాజరు కావడం లేదు. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మత ప్రచారకర్త జెరూసలేం మత్తయ్య మాత్రం అటు ఏసీబీ కేసులోనూ.. ఇటు ఈడీ కేసులోనూ రెగ్యులర్ కోర్టుకు హాజరవుతున్నారు. ఇతరులు ఎవరూ హాజరు కాకుండా..హాజరు మినహాయింపు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో కోర్టు వచ్చే నెల పదహారో తేదీన నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 

అక్టోబర్ 16న హాజరు కాక తప్పదా? 

ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం పొజిషన్‌లో ఉన్నందున కోర్టుకు  హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఆయన తరపున లాయర్ హాజరయ్యేలా ఈడీ కోర్టులోనో లేకపోతే హైకోర్టులోనే పిటిషన్ వేసే ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది. గతంలో ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనపై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో కూడా కోర్టుకు హాజరు కాలేదు. సీఎం బాధ్యతల కారణంగా ఆయన మినహాయింపు కోరుకున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karnataka Khir City : రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
Chandrababu : బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
KTR About Devara: మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Donald Trump: ట్రంప్ మావయ్యను ఏసేస్తారా? ఎందుకురా ఇంత స్కెచ్చేశారు?Nirmal News: చెట్టులో వెలిసిన దుర్గామాత, చీరకట్టి పసుపు కుంకుమతో పూజలుMahabubnagar News: ఈ వాగు దాటాలంటే సాహసం అనే చెప్పాలిHarsha Sai: న్యూ*డ్ వీడియోలతో హర్షసాయి వేధింపులు - ఇన్‌స్టాలో క్లారిటీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Khir City : రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
Chandrababu : బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
KTR About Devara: మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Telangana: అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
YS Jagan: లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
Botcha Lakshman Rao :  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
Hyderabad News: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ 
Embed widget