అన్వేషించండి

Dharani Portal: భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Dharani Portal In Telangana: భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ధరణి పోర్టలో పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.

Telangana CM Revanth Reddy: హైదరాబాద్: తెంగాణలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రులు, ఉన్నతాధికారులకు సూచించారు.  భూమి సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలని పేర్కొన్నారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు.

భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ధరణి పోర్టల్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన సమీక్ష ముగిసింది. ధరణిపై లక్షల సంఖ్యలో కంప్లైంట్స్ ఉన్నాయని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..  సమస్యల పరిష్కారానికి మండల స్థాయి గ్రీవిన్స్ సెల్ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి నివేదికలో పొందుపరచాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామెదర రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, సంబంధిత శాఖలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ధరణి పోర్టల్ లోటు పాట్ల పై వారం, 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణిపై పూర్తి అవగాహన కోసం, సమస్యల పరిష్కారానికి పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని రేవంత్ భావిస్తున్నారు. ధరణి యాప్ భద్రతపై సైతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి ద్వారా లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డాటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

అధికారంలోకి రాగానే భూముల సమస్యలు పరిష్కరించేందుకు ధరణిపై పూర్తి స్థాయిలో నివేదిక తీసుకుని భారీ మార్పులు తీసుకొస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చెప్పారు. తాజాగా ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపి కొన్ని కీలక విషయాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే భూమి సమస్యలు ఎందుకొచ్చాయి, రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఫిర్యాదులు ఎందుకొచ్చాయని అధికారులను ప్రశ్నించారు. సాధ్యమైనంత త్వరగా ధరణిపై నివేదిక అందివ్వాలని ఆదేశించారు. త్వరలోనే ధరణి అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ధరణి పోర్టల్ మొదలుపెట్టినప్పటి నుంచీ నేటి వరకు తీసుకున్న నిర్ణయాలపై సవివర నివేదిక అందచేయాలని సీఎస్ శాంతికుమారిని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎంవో అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ ఖాసీం లు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రైతు ప్రతినిధులు కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్, రెవెన్యు అసోసియేషన్ ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Also Read: Telangana Politics: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల ఫైట్ ఇక షురూ! బీఆర్ఎస్ వ్యూహమిదే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget