News
News
X

TS Debts : తెలంగాణ అప్పుల చిట్టా విప్పిన కేంద్రం, ఎన్ని లక్షల కోట్లంటే?

TS Debts : తెలంగాణ అప్పుల చిట్టాను కేంద్రం ప్రకటించింది. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ రూ.4.33 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు లోక్ సభలో ప్రకటించింది.

FOLLOW US: 
Share:

TS Debts : తెలంగాణ అప్పుల లెక్కలను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి  లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.  గత ఏడాది అక్టోబర్‌ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ. 4,33,817.6 కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పులు భారీగా పెరిగాయని  కేంద్రం సోమవారం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి చేసిన అప్పుల మొత్తమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినప్పటికి రూ.75,577 కోట్ల అప్పులు ఉంటే, 2021-22 నాటికి అప్పులు కాస్త రూ.2,83,452 కోట్లకు చేరాయని తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నివేదిక ఇచ్చినట్లు ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు రూ. 1.50 లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకుల తెలిపాయి. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులు రూ.1.30 లక్షల కోట్లు అని కేంద్రం లోక్ సభలో ప్రకటించింది.  

 తెలంగాణ అప్పులు 

తెలంగాణ అప్పులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. 2014-15లో రూ. 8,121 కోట్ల అప్పులు తీసుకోగా, 2015-16లో రూ. 15,515 కోట్లు, 2016-17లో రూ. 30,319 కోట్లు, 2017-18లో రూ. 22,658 కోట్లు, 2018-19లో రూ. 23,091 కోట్లు, 2019-20లో రూ. 30,577 కోట్లు, 2020-21లో రూ. 38,161 కోట్లు 2021-22లో రూ. 39,433 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు స్పష్టంచేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, కార్పొరేషన్ల నుంచి తెలంగాణ ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు రూ. 1,50,365.6 కోట్ల అని కేంద్రం వెల్లడించింది. 

వివిధ పథకాల కింద 

తెలంగాణకు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి రూ. 8,871 కోట్లు మంజూరు కాగా, రూ. 7,144 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. వేర్‌ హౌస్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ ఫండ్‌ నుంచి రూ. 972 కోట్లు మంజూరు అవ్వగా రూ. 852 కోట్లు ఇచ్చామని తెలిపింది. వివిధ పథకాల అమలు కోసం రూ. 14,516.65 కోట్లు తెలంగాణకు మంజూరు కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,424.66 కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  

 ఏపీ అప్పులు

దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను ఇటీవల కేంద్రం ప్రకటించింది.  లోక్ సభలో కేంద్రం రాష్ట్రాల అప్పుల వివరాలు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పై అప్పుల భారం పెరుగుతున్నట్లు కేంద్రం చెప్పింది. 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం ఆ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ ఇటీవల తెలిపింది. ఏపీ జీడీపీలో మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగినట్టు చెప్పింది. 2014లో ఏపీ జీడీపీలో అప్పుల శాతం 42.3 శాతంగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. 2014 తర్వాత ఏపీ జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని, 2015లో 23.3 శాతం అప్పులు ఉండగా 2021 నాటికి అది 36.5 శాతానికి పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. 

Published at : 13 Feb 2023 05:41 PM (IST) Tags: TS News Debts Telangana Central Govt CM KCR TS Debts

సంబంధిత కథనాలు

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్

Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్