అన్వేషించండి

Dalitbandhu KCR : హుజురాబాద్‌లో దళిత బంధు అర్హుల ఎంపిక సర్వే షురూ..! పథకం అందరికీ కాదా..?

దళితులందరికీ రూ. పది లక్షలని కేసీఆర్ ప్రకటించారు. కానీఇప్పుడు హుజురాబాద్‌లో లబ్దిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే ప్రారంభించారు. అర్హుల కోసం 8 మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది .


దళిత బంధు పథకం అమలు కోసం హుజురాబాద్ నియోజకవర్గంలో సర్వే చేపట్టారు. ఇందు కోసం ఇటీవలే సీఎంవోలో పోస్టింగ్ పొంది దళిత బంధు పథకాన్ని పర్యవేక్షించే బాధ్యతలు పొందిన రాహుల్ బొజ్జా అక్కడే మకాం వేశారు. దాదాపుగా 4 వందల మంది అధికారులు  సర్వే ప్రారంభించారు. నాలుగు రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నారు.  ఇదంతా లబ్దిదారులను ఎంపిక చేయడానికి. అందరికీ ఇస్తామన్నప్పుడు ఇంత భారీ ఎత్తున సర్వే ఎందుకు అన్న డౌట్ అందరికీ వస్తుంది. వచ్చింది కూడా. దళిత బంధు అందరికీ ఇస్తామని.. చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు. కానీ అక్కడ జరుగుతున్న సర్వే.. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు కాస్త అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి.

ప్రభుత్వం దళిత బంధు పథకానికి సంబంధించి ఎనిమిది మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో మొదటిది తెలంగాణలో నివాసం ఉండాలి. రెండో నిబంధన ప్రకారం జీవో నెం. 5 ప్రకారం దళిత వర్గానికి చెంది ఉండాలి. మూడో నిబంధన ప్రకారం కుటుంబ మొత్తం వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2.50 లక్షలు మించకూడదు. నాలుగో నిబంధన రెండున్నర ఎకరాల మాగాణి భూమి లేదా మెట్టతో కలుపుకొని మొత్తం 5 ఎకరాలకు మించి సాగుభూమి ఉండకూడదు. ఐదో  నిబంధన ప్రకారం  కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదు. అలాగే కేంద్ర ప్రభుత్వరంగ లేదా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా ఉద్యోగం చేయకూడదు. ఆరో రూల్ కుటుంబంలో ఎవరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యగులుగా ఉండకూడదు. ఏడో నిబంధన ప్రకారం కుటుంబం మొత్తానికి పది గుంటలకు మించి నివాస స్థలం ఉండకూడదు. ఎనిమిదో నిబంధనల ప్రకారం ఫోర్ వీలర్ ఉండకూడదు. క్యాబ్ ఉంటే మాత్రం అర్హులే.

ఇప్పటి వరకు ఎస్సీ సర్టిఫికెట్ ఉంటే రూ. పది లక్షలు వస్తాయని దళిత వర్గాలనుకుంటున్నాయి. కానీ పథకానికి అర్హత పొందాలంటే చాలా ప్రక్రియ ఉంటుంది. లబ్దిదారులను గుర్తించడానికి గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేస్తారు. వారి ద్వారా  దళిత వాడల్లో సర్వే చేయిస్తారు. మండలస్థాయిలో ఆ మండల అధికారి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వీరు మార్గదర్శకాల్లో పేర్కొన్న అర్హతల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను కలెక్టర్‌కు పంపుతారు.  లబ్ధిదారుల ఎంపిక చేసిన తర్వాత వెంటనే నిధులు ఇవ్వరు. వారికి ఆసక్తి ఉన్న వ్యాపారంలో అవసరమైన శిక్షణ ఇస్తారు.  ఆ తర్వాత కూడా వ్యాపారం ప్రారంభించాలో వారికి చెల్లిస్తారు. లబ్దిదారులకు నేరుగా నగదు చేతికి అందదు. కానీ వ్యాపారం లేదా ఉపాధి మాత్రం వారికి లభిస్తుంది. 

కేసీఆర్ అందరికీ దళిత  బంధు ఇస్తామని చెబుతూంటే.. కొత్తగా మార్గదర్శకాలు ఏమిటన్న విమర్శలు సహజంగానే రాజకీయ పార్టీలు చేస్తూంటాయి. ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇస్తామని కేసీఆర్ చెప్పారు. అయితే నాలుగో దశలో ఇస్తామని చెప్పారు. మొదటిదశగా ఇలా పేదల్ని ఎంపిక చేస్తున్నట్లుగా భావించవచ్చు. ప్రస్తుతం హుజురాబాద్‌లో చేస్తున్న సర్వే తర్వాత మొదటి దశలో ఎంత మంది లబ్దిదారులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 
  

 

టాప్ హెడ్ లైన్స్

KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాకై, ఫోన్ చేశారు: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాకై, ఫోన్ చేశారు: కేటీఆర్
Uppal Balu : థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు
థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు
Breaking News: వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
Idupu Kayitham: ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Save The Tigers 4: 'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
'టైగర్స్ 4'లో స్టార్ హీరో? మళ్ళీ కొత్త ప్లాన్‌తో మహి వి రాఘవ్?
Rangasthalam Mahesh : రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
రంగస్థలం మహేశ్ డివోర్స్ - పబ్లిసిటీ జిమ్మిక్కులు వర్కౌట్ అవ్వలేదు
Embed widget