అన్వేషించండి

Power Point Presentation Politics: తెలంగాణ అసెంబ్లీలో పవర్ పాయింట్ వార్ ఖాయం - తమకూ చాన్సివ్వాలంటున్న బీఆర్ఎస్ - స్పీకర్ అంగీకరిస్తారా?

PPT Politics: తెలంగాణ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశంపై దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పీపీటీ ఇస్తే తమకూ చాన్సివ్వాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది.

Congress Powe rPoint presentation:  తెలంగాణ అసెంబ్లీ  సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య  పవర్ పాయింట్ ప్రజెంటేషన్  రాజకీయాలు ముదురుతున్నాయి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను ఎండగట్టేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో పీపీటీని ఒక అస్త్రంగా ఎంచుకుంది. ఇందుకు ప్రతిగా తాము చేసిన అభివృద్ధిని వివరించేందుకు తమకూ పీపీటీ ఇచ్చే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది.

అసెంబ్లీలో కాంగ్రెస్ వ్యూహం 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగంలో జరిగిన  విధ్వంసం పై ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, అదనపు ఖర్చు,   మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వంటి అంశాలపై పక్కా ఆధారాలతో కూడిన పీపీటీని సభలో ప్రదర్శించేందుకు సిద్ధమైంది. సభ మధ్యలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టడమే కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశం. 

తమకూ చాన్సివ్వాలంటున్న బీఆర్ఎస్

ప్రభుత్వ పీపీటీకి దీటుగా సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ఏకపక్షంగా తన వాదనను వినిపిస్తే సరిపోదని, ప్రధాన ప్రతిపక్షంగా తమ వెర్షన్ ప్రజలకు తెలియజేయడానికి తమకూ పీపీటీ చాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఒకవేళ తమకు అవకాశం ఇవ్వకపోతే, గతంలో ఇలాగే అవకాశం నిరాకరించినప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభను బహిష్కరించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

గతంలో కాంగ్రెస్‌కు చాన్సివ్వని బీఆర్ఎస్               

అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో  పీపీటీ అంశం చర్చకు వచ్చింది. శీతాకాల సమావేశాల కాలాన్ని పెంచాలని, తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరగా.. స్పీకర్ ఆ వినతిని పరిశీలిస్తామని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాత సంప్రదాయాలను తెరపైకి తెస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పీపీటీలు ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలకు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడు తాము కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తామని కాంగ్రెస్ మంత్రులు స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.               

పాత సంప్రదాయాలు పాటిస్తామంటున్న కాంగ్రెస్                                  

2016లో అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రాజెక్టులపై పీపీటీ ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ కూడా తమకు అవకాశం ఇవ్వాలని అడిగింది. కానీ అప్పుడు బీఆర్ఎస్  ప్రభుత్వం నిరాకరించింది. ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో, అప్పుడు మీరు మాకు ఇవ్వలేదు.. ఇప్పుడు మేము మీకు ఇవ్వం  అనే  కాంగ్రెస్ వాదిస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తామని అంటున్నారు.  తమకు అసెంబ్లీలో పీపీటీ చాన్స్ ఇవ్వకపోతే..  కాంగ్రెస్‌కు కౌంటర్ గా  తెలంగాణ భవన్‌లో పీపీటీ ఇచ్చేందుకు హరీష్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget