CM Revanth Reddy : ఢిల్లీ టు దావోస్ వయా మణిపూర్ - పది రోజులు సీఎం రేవంత్ బిజీ టూర్స్ !
Telangana News : సీఎం రేవంత్ రెడ్డి పది రోజుల పాటు తెలంగాణకు దూరంగా ఉండనున్నారు. ఢిల్లీ నంచి మణిపూర్ వెళ్లి ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

CM Revanth Reddy foreign visit : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పది రోజుల పాటు తెలంగాణ బయట ఉండనున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీ సమావేశంలో పాల్గొనడంతో పాటు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం మణిపూర్ వెళ్ళి రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచే నేరుగా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్కు హాజరవుతారు. నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి మరో మూడు రోజులు లండన్లో పర్యటిస్తారు.
స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీ నేషనల్ కంపెనీల కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతుంటారు. భారత్ నుంచి ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదాని.. వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు. కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటుంటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ ఏడాది దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఆయన దావోస్లో పర్యటిస్తారు.
తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుతో పాటు లండన్ పర్యనటలో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ వెంట మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ సెక్రటరీలు, ఓఎస్డీ తతదితరులు దావోస్ వెళ్తున్నారు. పది రోజుల తర్వాత తిరిగి ఈ నెల 23న సీఎం రేవంత్ నేతృత్వంలోని టీమ్ హైదరాబాద్కు తిరిగి వస్తుంది.
ముఖ్యమంత్రిగా పాలన చేపట్టి నెల రోజులు దాటింది. తీరిక లేని షెడ్యూల్ తో బీజీగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడుల సాధన విషయంలో నిర్లక్ష్యం చూపించకూడదని అనుకున్నారు. దావోస్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ప్రతీ సారి తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొంటూ ఉంటుంది. ఈ సారి మిస్ కాకూడదన్న ఉద్దేశంతో వెళ్లాలనుకుంటున్నారు. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పటికీ.. ఆయన పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.
Before You Go
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్లో భారీ దాడులు
ట్రెండింగ్ వార్తలు






















