![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Revanth Reddy : పీవీ, జైపాల్ రెడ్డి తెలంగాణలు లంకె బిందెల్లాంటి వారు - వారి కీర్తిని పెంచుతామన్న రేవంత్ రెడ్డి !
CM Revanth Reddy : పీపీ, జైపాల్ రెడ్డి కీర్తిని మరింత పెంచేలా కార్యక్రమాలు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
![Revanth Reddy : పీవీ, జైపాల్ రెడ్డి తెలంగాణలు లంకె బిందెల్లాంటి వారు - వారి కీర్తిని పెంచుతామన్న రేవంత్ రెడ్డి ! CM Revanth Reddy said that they will try to increase the fame of PV and Jaipal Reddy Revanth Reddy : పీవీ, జైపాల్ రెడ్డి తెలంగాణలు లంకె బిందెల్లాంటి వారు - వారి కీర్తిని పెంచుతామన్న రేవంత్ రెడ్డి !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/23/2b5254120ba5af588cd963d3be1f533a1703319340779228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana News : మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహా రావు 19వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
“బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన చెప్పారు” అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు
భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొ చ్చిన ఘనత స్వర్గీయ పీవీ నరసింహారావుకే దక్కుతుందన్నారు. పేదలకు భూములు పంచడానికి ఆయన బలమైన పునాదులు వేశారంటూ.. . పీవీ మన మధ్య భౌతికంగా లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమని, పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని పేర్కొన్నారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి, పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని ప్రశంసించారు.
పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ నరసింహా రావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని అన్నారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని రేవంత్ రెడ్డి అన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా పీవీకి నివాళులు అర్పించారు. భారత దేశ ప్రధానిగా, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు అని చెప్పుకొచ్చారు. పీవీ తెలంగాణలో పుట్టడం గర్వంగా ఫీల్ అవుతున్నాను.. చిన్న నాటి నుంచే పీవీకి దేశం అంటే ప్రేమ.. అనేక భాషలపై ఆయనకు మంచి పట్టుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మహానుభావుడు పీవీ నరసింహారావు అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)