అన్వేషించండి

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

మంచిర్యాలలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం.. ప్రగతి నివేదన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

తెలంగాణలో పింఛను అందుకుంటున్న దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఆస‌రా పెన్ష‌న్ల కింద నెలానెలా వారు అందుకుంటున్న మొత్తాన్ని పెంచుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. పెంచిన పెన్ష‌న్లు వ‌చ్చే నెల నుంచే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని కేసీఆర్ స్పష్టం చేశారు. మంచిర్యాలలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం.. ప్రగతి నివేదన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

మొత్తం తెలంగాణ స‌మాజం బాగుండాలని, అందుకు కులం, మతం తేడా లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ముస‌ల‌మ్మ‌లు, ముస‌లి తాత‌లు ఆస‌రా పెన్ష‌న్ల‌తో బ్ర‌హ్మాండంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం విక‌లాంగుల‌కు రూ.3,116 పెన్ష‌న్ ఇస్తున్నామని చెప్పారు. ఈ తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాలు జ‌రుగుతున్న ఈ సంద‌ర్భంలో, ఈ రోజు మంచి రోజు కాబట్టి విక‌లాంగుల పెన్ష‌న్ కూడా పెంచ‌బోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.3,116 పింఛను వస్తుండగా, మ‌రో వెయ్యి రూపాయలు పెంచి రూ.4,116 ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. మంచిర్యాల గ‌డ్డ పై ఉండి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రక‌టించాల‌ని తాను ఇన్ని రోజులు ఈ విషయాన్ని స‌స్పెన్షన్‌లో పెట్టానని అన్నారు. దీంతో ఇకపై దివ్యాంగులకు రూ.4,116 పెన్ష‌న్ అందనుంది.

‘‘మంచిర్యాల జిల్లా కావాలనేది ప్రజల చిరకాల కాంక్ష. ఎన్నో పోరాటాలు చేశారు. గత ప్రభుత్వాలు ఏవీ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక జిల్లా చేసుకున్నాం’’

సింగరేణికి గుడ్ న్యూస్
సింగరేణి సంస్థని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఆ పార్టీ చేసిన అప్పులు తీర్చలేకే సింగరేణిలో 49 శాతాన్ని కేంద్రానికి అప్పగించిందని అన్నారు. 2014 కంటే ముందు సింగరేణి కార్మికుల‌కు ఇచ్చే బోన‌స్ 18 శాతం మాత్రమే ఉండేదని కేసీఆర్ గుర్తు చేశారు. అంటే కేవ‌లం రూ.50 నుంచి 60 కోట్లు మాత్ర‌మే కార్మికుల‌కు పంచేదని అన్నారు. తెలంగాణ వ‌చ్చాక 2014లో సింగ‌రేణి ట‌ర్నోవ‌ర్ రూ.11 వేల కోట్లు మాత్ర‌మే అని.. ఇవాళ అదే సింగ‌రేణి ట‌ర్నోవ‌ర్‌ను రూ.33 వేల కోట్ల‌కు పెంచుకున్నామని అన్నారు. అదే విధంగా సింగ‌రేణి లాభాలు కేవ‌లం రూ.300 నుంచి రూ.400 కోట్లు మాత్ర‌మే ఉంటే.. ఇవాళ సింగ‌రేణిలో ఈ ఏడాది వ‌చ్చిన లాభాలు రూ. 2,184 కోట్లకు పైనే అని అన్నారు.

వచ్చే దసరాకు రూ.700 కోట్ల బోనస్
ఈ లాభాల వల్ల వ‌చ్చే ద‌స‌రాకు సింగ‌రేణి కార్మికుల‌కు పంచ‌బోయే బోన‌స్ రూ.700 కోట్లుగా ఉంటుందని చెప్పారు. దీంతో జనం ఒక్కసారిగా ఈలలు, అరుపులతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. 

సింగరేణి విషయంలో కీలక విధానం - కేసీఆర్

‘‘మన దేశంలో బొగ్గుకు కొరత లేదు. సింగరేణితో పాటు, ఈస్టర్న్ కోల్స్, వెస్టర్న్ కోల్ మైన్స్ ఉండగా అన్నీ ప్రైవేటు పరం చేస్తామని చెప్తున్నారు. మన దేశంలో బొగ్గు కొరత లేనే లేదు. దిక్కుమాలిన పాలసీలతో కేంద్ర ప్రభుత్వం మొత్తం అమ్మేస్తుంది. సింగరేణి ఎండీని నేను ఇండోనేసియా, ఆస్ట్రేలియా కూడా పంపా. ఖమ్మం జిల్లాలో ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. వజ్రపు తునక లాంటి సింగరేణికి మైనింగ్ అనుభవం ఉంది. మిగతా గనుల తవ్వకాలు ఎక్కడ ఉన్నా సింగరేణికే అప్పగించాలని మేం నిర్ణయం తీసుకున్నాం. ఇంత బొగ్గు ఉన్నా దాన్ని వాడకుండా ఆస్ట్రేలియా, ఇండొనేసియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. దేశంలోనే అన్యాయం జరుగుతోంది కాబట్టి, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి పోరాటానికి నడుం బిగించాం. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ సగం ముంచితే, బీజేపీ మిగతా సగం ముంచుతామని చెబుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Embed widget