అన్వేషించండి

BRS MLA Defection Case: ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్ కొట్టివేత, ఫిరాయింపు కేసులో కీలక పరిణామం

BRS MLA Sanjay Kumar | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై నమోదైన అనర్హత పిటిషన్ ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నారని పేర్కొన్నారు.

Telangana Politics | హైదరాబాద్: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌పై బిఆర్ఎస్ (BRS) దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేస్తూ, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ కుమార్ పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని, ఆయన సాంకేతికంగా బిఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు.

స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ ఆగ్రహం..

బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి వేసిన అనర్హతా పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేస్తూ ఎమ్మెల్యే సంజయ్ కు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని స్పీకర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసిన స్పీకర్, సుప్రీంకోర్టు గడువు లోపే తన నిర్ణయాన్ని వెలువరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, తాను పార్టీ జెండా కప్పుకోలేదని ఎమ్మెల్యే చేసిన వాదనను స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నారు.

ఈ కేసుతో పాటు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ అనర్హత వేటు వేయాలని కోరగా, ఇప్పటివరకు సంజయ్ కుమార్‌తో కలిపి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య లకు సైతం స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయాలపై బిఆర్ఎస్ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

బీఆర్ఎస్ నుంచే గెలిచా.. ఆ పార్టీలోనే కొనసాగుతా: ఎమ్మెల్యే సంజయ్

తన వేతనం నుంచి ప్రతినెలా రూ.5 వేలు బీఆర్ఎస్ కోసం వెళ్తాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు విప్ జారీ చేస్తే తాను మద్దతు ఇస్తానని చెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచానని, ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతా అన్నారు.

మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్

ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు తెలంగాణ స్పీకర్ ఇదివరకే క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని, పార్టీ మారారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ చేయగా, బుధవారం ఉదయం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరయ్యారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Advertisement

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget